ఒకప్పుడు టాలీవుడ్లో బిజీ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు అనిల్ సుంకర. రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంటలతో కలిసి ‘14 రీల్స్’ బేనర్లో ‘దూకుడు’ సహా పలు భారీ చిత్రాలను నిర్మించిన ఆయన.. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బేనర్లో విడిగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలనూ ప్రొడ్యూస్ చేశాడు. ఐతే కొన్నేళ్ల తర్వాత 14 రీల్స్ నుంచి బయటికి వచ్చి ఏకే బేనర్లోనే సినిమాలు తీస్తూ వచ్చాడు. ఆ సంస్థను పెద్ద స్థాయికి తీసుకెళ్లేలా కొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు అనిల్. కానీ వాటిలో ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం బాగా ఆడినా.. ఆ తర్వాతి చిత్రాలు ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి.
అఖిల్ అక్కినేని మీద భారీ బడ్జెట్ పెట్టి తీసిన ‘ఏజెంట్’.. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో అనిల్ ప్రొడక్షన్ హౌస్ సంక్షోభంలో పడింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భోళాశంకర్’ తనను ఎంత పెద్ద దెబ్బ కొట్టిందో ఆయన పరోక్షంగా మాట్లాడాడు. దీంతో సోషల్ మీడియా జనాలు చిరంజీవి వైపు వేలెత్తి చూపించడం మొదలుపెట్టారు. చిరంజీవి వల్ల మంచి నిర్మాత దెబ్బ తిన్నాడంటూ కౌంటర్లు వేశారు. మరోవైపు చిరు అభిమానులు.. అనిల్ కామెంట్లకు హర్టయ్యారు.
ఐతే ఒక ఇంటర్వ్యూలో అనిల్.. చిరు తనకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘భోళా శంకర్’ ఫెయిల్యూర్ తర్వాత చిరు తనకు ఎంతగానో అండగా నిలిచారని.. ఆ నష్టాల నుంచి బయటపడడానికి సాయం చేశారని అనిల్ తెలిపారు. ఇక ‘ఏజెంట్’ ఫలితం గురించి అనిల్ మాట్లాడారు. ఈ సినిమాకు అఖిల్ ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదన్నాడు. సినిమా బాగా ఆడితే రెమ్యూనరేషన్ తీసుకునేవాడని.. అలా జరక్కపోవడంతో అతను ఒక్క రూపాయి కూడా పుచ్చుకోలేదని అనిల్ వెల్లడించాడు.
This post was last modified on August 24, 2025 5:03 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…