ఒకప్పుడు టాలీవుడ్లో బిజీ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు అనిల్ సుంకర. రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంటలతో కలిసి ‘14 రీల్స్’ బేనర్లో ‘దూకుడు’ సహా పలు భారీ చిత్రాలను నిర్మించిన ఆయన.. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బేనర్లో విడిగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలనూ ప్రొడ్యూస్ చేశాడు. ఐతే కొన్నేళ్ల తర్వాత 14 రీల్స్ నుంచి బయటికి వచ్చి ఏకే బేనర్లోనే సినిమాలు తీస్తూ వచ్చాడు. ఆ సంస్థను పెద్ద స్థాయికి తీసుకెళ్లేలా కొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు అనిల్. కానీ వాటిలో ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం బాగా ఆడినా.. ఆ తర్వాతి చిత్రాలు ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి.
అఖిల్ అక్కినేని మీద భారీ బడ్జెట్ పెట్టి తీసిన ‘ఏజెంట్’.. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో అనిల్ ప్రొడక్షన్ హౌస్ సంక్షోభంలో పడింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భోళాశంకర్’ తనను ఎంత పెద్ద దెబ్బ కొట్టిందో ఆయన పరోక్షంగా మాట్లాడాడు. దీంతో సోషల్ మీడియా జనాలు చిరంజీవి వైపు వేలెత్తి చూపించడం మొదలుపెట్టారు. చిరంజీవి వల్ల మంచి నిర్మాత దెబ్బ తిన్నాడంటూ కౌంటర్లు వేశారు. మరోవైపు చిరు అభిమానులు.. అనిల్ కామెంట్లకు హర్టయ్యారు.
ఐతే ఒక ఇంటర్వ్యూలో అనిల్.. చిరు తనకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘భోళా శంకర్’ ఫెయిల్యూర్ తర్వాత చిరు తనకు ఎంతగానో అండగా నిలిచారని.. ఆ నష్టాల నుంచి బయటపడడానికి సాయం చేశారని అనిల్ తెలిపారు. ఇక ‘ఏజెంట్’ ఫలితం గురించి అనిల్ మాట్లాడారు. ఈ సినిమాకు అఖిల్ ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదన్నాడు. సినిమా బాగా ఆడితే రెమ్యూనరేషన్ తీసుకునేవాడని.. అలా జరక్కపోవడంతో అతను ఒక్క రూపాయి కూడా పుచ్చుకోలేదని అనిల్ వెల్లడించాడు.
This post was last modified on August 24, 2025 5:03 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…