ఒకప్పుడు టాలీవుడ్లో బిజీ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు అనిల్ సుంకర. రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంటలతో కలిసి ‘14 రీల్స్’ బేనర్లో ‘దూకుడు’ సహా పలు భారీ చిత్రాలను నిర్మించిన ఆయన.. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బేనర్లో విడిగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలనూ ప్రొడ్యూస్ చేశాడు. ఐతే కొన్నేళ్ల తర్వాత 14 రీల్స్ నుంచి బయటికి వచ్చి ఏకే బేనర్లోనే సినిమాలు తీస్తూ వచ్చాడు. ఆ సంస్థను పెద్ద స్థాయికి తీసుకెళ్లేలా కొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు అనిల్. కానీ వాటిలో ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం బాగా ఆడినా.. ఆ తర్వాతి చిత్రాలు ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి.
అఖిల్ అక్కినేని మీద భారీ బడ్జెట్ పెట్టి తీసిన ‘ఏజెంట్’.. మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘భోళా శంకర్’ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. దీంతో అనిల్ ప్రొడక్షన్ హౌస్ సంక్షోభంలో పడింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భోళాశంకర్’ తనను ఎంత పెద్ద దెబ్బ కొట్టిందో ఆయన పరోక్షంగా మాట్లాడాడు. దీంతో సోషల్ మీడియా జనాలు చిరంజీవి వైపు వేలెత్తి చూపించడం మొదలుపెట్టారు. చిరంజీవి వల్ల మంచి నిర్మాత దెబ్బ తిన్నాడంటూ కౌంటర్లు వేశారు. మరోవైపు చిరు అభిమానులు.. అనిల్ కామెంట్లకు హర్టయ్యారు.
ఐతే ఒక ఇంటర్వ్యూలో అనిల్.. చిరు తనకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘భోళా శంకర్’ ఫెయిల్యూర్ తర్వాత చిరు తనకు ఎంతగానో అండగా నిలిచారని.. ఆ నష్టాల నుంచి బయటపడడానికి సాయం చేశారని అనిల్ తెలిపారు. ఇక ‘ఏజెంట్’ ఫలితం గురించి అనిల్ మాట్లాడారు. ఈ సినిమాకు అఖిల్ ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదన్నాడు. సినిమా బాగా ఆడితే రెమ్యూనరేషన్ తీసుకునేవాడని.. అలా జరక్కపోవడంతో అతను ఒక్క రూపాయి కూడా పుచ్చుకోలేదని అనిల్ వెల్లడించాడు.
This post was last modified on August 24, 2025 5:03 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…