వచ్చే వారం ఆగస్ట్ 22 విడుదలవుతున్న సినిమాల్లో అంతో ఇంతో ప్రేక్షకుల దృష్టిలో ఉన్నది పరదా ఒకటే. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో శుభం ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ విలేజ్ థ్రిల్లర్ కు మంచి ప్రమోషన్లు చేస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో పదే పదే రివ్యూలో చూసి రమ్మని హీరోయిన్, దర్శకుడు చెప్పడం చూస్తే గట్టి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేస్తున్నాం రివ్యూలు బాగుంటేనే రండి, నచ్చితేనే నలుగురికి చెప్పమని రిపీట్ చేయడం కొంచం బజ్ వచ్చేలా చేస్తోంది. కాకపోతే దీని వల్ల లాభమూ రిస్క్ రెండూ ఉన్నాయి.
ఇదే దర్శకుడు శుభం టైంలో కూడా సినిమా చూసి పిచ్చెక్కిపోతారు, ఎప్పుడూ చూడని కంటెంట్ ఇస్తానని చాలా ధీమాగా చెప్పారు. తీరా చూస్తే నిర్మాత సమంత నాన్ థియేట్రికల్ రెవిన్యూతో గట్టెక్కింది కానీ కమర్షియల్ రిజల్ట్ కోణంలో చూసుకుంటే యావరేజ్ గానే నిలిచింది. ఇప్పుడు పరదా విషయంలోనూ అలాంటి స్ట్రాటజీనే ఫాలో కావడం గమనార్హం. సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరు. రివ్యూలు ఎలాగూ మద్దతు ఇస్తాయి. మహావతార్ నరసింహకు ఎలాంటి హడావిడి చేయకపోయినా మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉంది. మల్టీస్టారర్స్ ఉన్నా వార్ 2, కూలీలు యునానిమస్ టాక్ తెచ్చుకోలేకపోయాయి.
భారం మొత్తం తన మీదే ఉంది కాబట్టి అనుపమ పరమేశ్వరన్ పరదా మీద చాలా ఆశలే పెట్టుకుంది. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు పడ్డాయి కానీ తర్వాత పెద్దగా కనిపించలేదు. టిల్లు స్క్వేర్ హిట్టయినా దాని వల్ల సిద్ధూ జొన్నలగడ్డ ఎక్కువ లాభపడ్డాడు కానీ అనుపమకు కలిగిన ప్రయోజనం తక్కువే. రవితేజతో చేసిన ఈగల్ డిజాస్టర్ ఖాతాలోకి చేరుకుంది. మరి పరదా కనక సక్సెస్ అయితే లక్కు దక్కినట్టే. కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో అనుపమ మరో మూవీ కిష్కిందపురి సెప్టెంబర్ 12 రిలీజ్ కానుంది. బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో తను ఇంకొన్ని వారాలు హైదరాబాద్ లోనే ఉండబోతోంది.
This post was last modified on August 17, 2025 9:07 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…