సాయిపల్లవి.. ఈ పేరు ఎంత సంప్రదాయబద్ధంగా అనిపిస్తుందో.. ఆమె సినిమాల్లో ఎంచుకునే పాత్రలు, తన అప్పీయరెన్స్ కూడా అంతే సంప్రదాయబద్ధంగా ఉంటాయి. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ ఆమె గ్లామర్ ఒలకబోయలేదు. హద్దులు దాటి నటించలేదు. ఇక ముందు కూడా అందుకు అవకాశమే లేదని అంటోంది సాయిపల్లవి.
ఎన్ని కోట్లిచ్చినా తాను అంగాంగ ప్రదర్శన చేయలేనని ఆమె స్పష్టం చేసింది. మొదట్నుంచి తన ఉద్దేశం ఇదేనని.. కెరీర్లో ఎప్పటికీ ఈ విషయంలో మార్పు ఉండదని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.
తనకు దర్శకులు గ్లామర్ పాత్రలు ఆఫర్ చేయకుండా ఏమీ లేదని.. ఎక్స్పోజింగ్ చేయాలని అన్నారని.. దీంతో చాలా సినిమాలు వదులుకున్నానని సాయిపల్లవి వెల్లడించింది. ఈ విషయంలో తనకెలాంటి రిగ్రెట్స్ లేవని సాయిపల్లవి స్పష్టం చేసింది. తాను మొదట్నుంచి కూడా తెరపై ఒక సాధారణమైన కాలేజ్ అమ్మాయి లాగే కనిపించానని.. కురచ దుస్తులు వేసుకోవడం, శ్రుతి మించి అంగాంగ ప్రదర్శన చేయడం తనకు ఇష్టం ఉండదని సాయపల్లవి చెప్పింది.
‘ఫిదా’ సినిమాలో ఒక సన్నివేశంలో మాత్రం షార్ట్ డ్రెస్ వేసుకున్నానని.. అది సన్నివేశానికి అవసరం కాబట్టే చేశానని.. అవసరం లేకున్నా మరో సినిమాలో అలా కనిపించమంటే ఒప్పుకోనని.. ఒత్తిడి చేస్తే సినిమా నుంచి తప్పుకుంటానని క్రిస్టల్ క్లియర్గా చెప్పేసింది సాయిపల్లవి. ఆమె చెప్పడం అనే కాదు కానీ.. ప్రేక్షకులు కూడా సాయిపల్లవిని సెక్సీ రోల్స్లో చూడాలని అనుకోరు. ఆమెను అభిమానించే కోణమే వేరు.
కేవలం నటనతోనే కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకోవడం సాయిపల్లవికే చెల్లింది. ప్రస్తుతం తెలుగులో ఆమె రానా దగ్గుబాటి సరసన ‘విరాట పర్వం’ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 1, 2020 2:18 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…