కంగువ, రెట్రో వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న సూర్య ఆశలన్నీ ఇప్పుడు కరుప్పు మీదే ఉన్నాయి. ఆర్జె బాలాజీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు. నిజానికిది దీపావళి లేదా దసరాకు వస్తుందని అనుకున్నారు కానీ ఆ స్లాట్లు ఆల్రెడీ ప్యాన్ ఇండియా సినిమాలతో నిండిపోవడంతో ఇప్పుడు సంక్రాంతి వైపు చూస్తున్నట్టు చెన్నై రిపోర్ట్. ఆగస్ట్ మినహాయించి ఇంకో నాలుగు నెలలు సమయం ఉంది కాబట్టి ప్యాచ్ వర్కులు, రీ రికార్డింగ్, ప్రమోషన్లకు ఆ టైం సరిపోతుందని భావిస్తున్నట్టు సమాచారం. అసలు ట్విస్టు వేరే ఉంది.
2026 సంక్రాంతి ఇప్పటికే పిచ్చ టైట్ గా ఉంది. చిరంజీవి – అనిల్ రావిపూడిల మెగా 157 వెనక్కు తగ్గే సూచనలు లేవు కానీ విశ్వంభర డేట్ మీద నిర్ణయం ఆధారపడి ఉంది. రవితేజ – కిషోర్ తిరుమల కాంబో మూవీ ఈ పండక్కి తీసుకురావాలనే సంకల్పంతో షూట్ ని పరుగులు పెట్టిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రోజు ఆల్రెడీ డేట్ తో సహా అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభాస్ ది రాజా సాబ్ జనవరి 9 తేవాలని బయ్యర్లు నిర్మాత మీద ఒత్తిడి తెస్తున్నారు. ఆయన మాత్రం డిసెంబర్ 5కే మొగ్గు చూపుతున్నారు. విజయ్ జన నాయగన్ ఆల్రెడీ అదే డేట్ మీద ఫస్ట్ కర్చీఫ్ వేసుకుని ఉంది.
వీటి మధ్యలో సూర్య కరుప్పు వస్తే అనవసరంగా క్రష్ అవుతుందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే కరుప్పు టీజర్ చూశాక ఇదో రెగ్యులర్ కమర్షియల్ ఫిలింగా అనిపించింది తప్ప ప్రత్యేకంగా ఏదో యునిక్ కంటెంట్ ఉన్న ఫీలింగ్ ఇవ్వలేదు. సూర్య డ్యూయల్ రోల్ అంటున్నారు కానీ అదెంతవరకు నిజమో సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు. పైన చెప్పిన లిస్టు ప్రకారం చూసుకుంటే నిజంగా కాంపిటీషన్ లో దిగితే సూర్యకే రిస్క్ అవుతుంది. ముఖ్యంగా తెలుగులో సరైన థియేటర్లు దొరకడం కూడా కష్టమే. మరి కరుప్పు మేకర్స్ నిర్ణయం మార్చుకుంటారో లేక పోటీ సవాల్ కు సై అంటారో వేచి చూడాలి.
This post was last modified on August 16, 2025 9:41 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…