నిన్న విడుదలైన కూలీలో తెలుగు ప్రేక్షకుల దృష్టి నాగార్జున మీద ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే నలభై సంవత్సరాల కెరీర్ లో మొదటిసారి ఫుల్ లెన్త్ విలన్ వేషం వేయడంతో ఎలా ఉంటుందోననే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో కనిపించింది. ఇలాంటి పాత్రలు చేయడం స్వతహాగా ఫ్యాన్స్ కి ఇష్టం లేనప్పటికీ లోకేష్ కనగరాజ్ మీద నమ్మకంతో చాలా ఊహించేసుకున్నారు. తెలుగు వెర్షన్ ఓపెనింగ్స్ లో ఈ అంశం బాగానే పని చేసింది. ఇక రియాక్షన్ల విషయానికి వస్తే సైమన్ గా నాగ్ ని లోకేష్ ఎందుకు అంత పర్ఫెక్ట్ ఛాయస్ గా ఎంచుకున్నాడో స్టైలింగ్ చూశాక అర్థమయ్యిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
క్యారెక్టర్ లోని ఇంటెన్సిటీని పండించిన తీరు ఆకట్టుకుంది. అయితే నిడివి పరంగా సెకండాఫ్ లో స్పేస్ తగ్గిపోవడం కొంత అసంతృప్తికి దారి తీసింది. ముగించిన విధానం పట్ల కూడా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. రజనీకాంత్ తో ఫేస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఇంకా పవర్ ఫుల్ గా ఉండాల్సిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ కనగరాజ్ మన నాగ్ ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాడు. ఏడెనిమిది నెరేషన్లు ఇచ్చాడంటే జనం చాలా ఊహించేసుకున్నారు. కానీ ఫుల్ మీల్స్ ఆశిస్తే ప్లేట్ మీల్స్ దక్కినట్టు మిక్స్డ్ రియాక్షన్లు అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఇక జెన్యూన్ గా ఫ్యాన్స్ మనసులో మాటలని బట్టి చూస్తే కుబేర, కూలి లాంటి వాటికన్నా నా సామిరంగ, బంగార్రాజు లాంటి వాటిలో తమ హీరోని చూడాలని కోరుకున్నట్టుగా అర్థమవుతోంది. నిజానికి విలన్ క్యారెక్టర్ డిజైన్ అంటే లెజెండ్ లో జగపతిబాబులా ఉండాలి. బాలకృష్ణ లాంటి పవర్ ఫుల్ కటవుట్ ని ఎదురుగా పెట్టుకుని జగ్గు భాయ్ చూపించిన విలనిజం తెరమీద అద్భుతంగా పండింది. ఒకవేళ అదే స్థాయిలో కనక సైమన్ ని ప్రెజెంట్ చేసి ఉంటే నాగార్జున ఇవాళ ఆన్ లైన్ టాపిక్ అయ్యేవారు. ఫైనల్ రిజల్ట్ తేలాక ఇకపై ఇలాంటి సినిమాలు చేయలా వద్దానే నిర్ణయం తీసుకోవాలని నాగ్ ఫిక్సయ్యారట. మంచిదే.
This post was last modified on August 15, 2025 11:11 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…