మూడు గంటల సేపు కూలి చూశాక అందరికి వచ్చిన సందేహం ఒకటే. అసలు ఎందుకు దీనికి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారనేదే ఆ డౌట్. ఇందులో వయొలెన్స్ ఉంది. చంపడాలు, నరుక్కోవడాలు అన్నీ పెట్టాడు లోకేష్ కనగరాజ్. అయితే ఏవీ శృతి మించి లేవు. విలన్ గా నటించిన నాగార్జునని డార్క్ షేడ్ చూపించినా సరే అతను చేసే హత్యలు మరీ కళ్ళు పక్కకు తిప్పుకునేలా ఉండవు. సౌభిన్ సాహిర్ ఇతరులను పెట్టే హింస కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ అది కూడా చిన్న పిల్లలు జడుసుకునేంత కాదు. ఆ మాటకొస్తే యానిమల్, పుష్ప 2 కన్నా యాక్షన్ కంటెంట్ కూలీలో తక్కువగా ఉందనే నిజాన్ని ఎవరూ కాదనరు.
కొన్ని బూతు మాటలు, హింసకు సంబంధించిన రెండు మూడు విజువల్స్ తప్ప మరీ హైలైట్ అయ్యే అడల్ట్ కంటెంట్ కూలిలో లేదు. యు/ఏ ఇచ్చినా సరిపోయేది. ఇంతకన్నా కొట్టుకోవడాలు, ఫైట్లు వార్ 2లోనే ఎక్కువగా ఉన్నా దానికి ఏ ఇవ్వలేదు. సెన్సార్ కోరిన మార్పులకు టీమ్ అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. కానీ కూలి విషయంలో లోకేష్ కనగరాజ్ కాంప్రమైజ్ కాలేదు. ఏ ఇచ్చినా పర్వాలేదు తాను ఫైనల్ చేసిన వెర్షనే ఉండాలనుకున్నాడు. దీంతో నిర్మాత కళానిధి మారన్, హీరో రజనీకాంత్ సైతం ఓకే అనేశారు. ఫలితంగా అడల్ట్స్ ఓన్లీ ముద్రతో కూలి థియేటర్లలో అడుగు పెట్టింది.
లోకేష్ పంతం మంచిదే కానీ ఇప్పుడీ చర్య వల్ల 18 ఏళ్ళ లోపు వాళ్ళను మల్టీప్లెక్సులు కూలి స్క్రీన్లలోకి అనుమతించడం లేదు. ముందుగానే సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటన ఇచ్చినప్పటికీ పలువురు పిల్లలతోనే థియేటర్ కు వస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్స్ కావడంతో వద్దని చెప్పే అవకాశం ఎగ్జిబిటర్లకు లేకుండా పోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదని, సెన్సార్ చెప్పిన కట్స్ మ్యూట్స్ చేసుకుని రీ సెన్సార్ చేసుకుంటే కలెక్షన్లు మరింత మెరుగు పడతాయని డిస్టిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. అయినా ఇది జరగని పని. ఎలాగూ కలెక్షన్లు అదిరిపోతున్నాయి కాబట్టి నిర్ణయం మారకపోవచ్చు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…