మూడు గంటల సేపు కూలి చూశాక అందరికి వచ్చిన సందేహం ఒకటే. అసలు ఎందుకు దీనికి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారనేదే ఆ డౌట్. ఇందులో వయొలెన్స్ ఉంది. చంపడాలు, నరుక్కోవడాలు అన్నీ పెట్టాడు లోకేష్ కనగరాజ్. అయితే ఏవీ శృతి మించి లేవు. విలన్ గా నటించిన నాగార్జునని డార్క్ షేడ్ చూపించినా సరే అతను చేసే హత్యలు మరీ కళ్ళు పక్కకు తిప్పుకునేలా ఉండవు. సౌభిన్ సాహిర్ ఇతరులను పెట్టే హింస కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ అది కూడా చిన్న పిల్లలు జడుసుకునేంత కాదు. ఆ మాటకొస్తే యానిమల్, పుష్ప 2 కన్నా యాక్షన్ కంటెంట్ కూలీలో తక్కువగా ఉందనే నిజాన్ని ఎవరూ కాదనరు.
కొన్ని బూతు మాటలు, హింసకు సంబంధించిన రెండు మూడు విజువల్స్ తప్ప మరీ హైలైట్ అయ్యే అడల్ట్ కంటెంట్ కూలిలో లేదు. యు/ఏ ఇచ్చినా సరిపోయేది. ఇంతకన్నా కొట్టుకోవడాలు, ఫైట్లు వార్ 2లోనే ఎక్కువగా ఉన్నా దానికి ఏ ఇవ్వలేదు. సెన్సార్ కోరిన మార్పులకు టీమ్ అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. కానీ కూలి విషయంలో లోకేష్ కనగరాజ్ కాంప్రమైజ్ కాలేదు. ఏ ఇచ్చినా పర్వాలేదు తాను ఫైనల్ చేసిన వెర్షనే ఉండాలనుకున్నాడు. దీంతో నిర్మాత కళానిధి మారన్, హీరో రజనీకాంత్ సైతం ఓకే అనేశారు. ఫలితంగా అడల్ట్స్ ఓన్లీ ముద్రతో కూలి థియేటర్లలో అడుగు పెట్టింది.
లోకేష్ పంతం మంచిదే కానీ ఇప్పుడీ చర్య వల్ల 18 ఏళ్ళ లోపు వాళ్ళను మల్టీప్లెక్సులు కూలి స్క్రీన్లలోకి అనుమతించడం లేదు. ముందుగానే సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటన ఇచ్చినప్పటికీ పలువురు పిల్లలతోనే థియేటర్ కు వస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్స్ కావడంతో వద్దని చెప్పే అవకాశం ఎగ్జిబిటర్లకు లేకుండా పోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదని, సెన్సార్ చెప్పిన కట్స్ మ్యూట్స్ చేసుకుని రీ సెన్సార్ చేసుకుంటే కలెక్షన్లు మరింత మెరుగు పడతాయని డిస్టిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. అయినా ఇది జరగని పని. ఎలాగూ కలెక్షన్లు అదిరిపోతున్నాయి కాబట్టి నిర్ణయం మారకపోవచ్చు.
This post was last modified on August 15, 2025 6:49 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…