మూడు గంటల సేపు కూలి చూశాక అందరికి వచ్చిన సందేహం ఒకటే. అసలు ఎందుకు దీనికి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారనేదే ఆ డౌట్. ఇందులో వయొలెన్స్ ఉంది. చంపడాలు, నరుక్కోవడాలు అన్నీ పెట్టాడు లోకేష్ కనగరాజ్. అయితే ఏవీ శృతి మించి లేవు. విలన్ గా నటించిన నాగార్జునని డార్క్ షేడ్ చూపించినా సరే అతను చేసే హత్యలు మరీ కళ్ళు పక్కకు తిప్పుకునేలా ఉండవు. సౌభిన్ సాహిర్ ఇతరులను పెట్టే హింస కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ అది కూడా చిన్న పిల్లలు జడుసుకునేంత కాదు. ఆ మాటకొస్తే యానిమల్, పుష్ప 2 కన్నా యాక్షన్ కంటెంట్ కూలీలో తక్కువగా ఉందనే నిజాన్ని ఎవరూ కాదనరు.
కొన్ని బూతు మాటలు, హింసకు సంబంధించిన రెండు మూడు విజువల్స్ తప్ప మరీ హైలైట్ అయ్యే అడల్ట్ కంటెంట్ కూలిలో లేదు. యు/ఏ ఇచ్చినా సరిపోయేది. ఇంతకన్నా కొట్టుకోవడాలు, ఫైట్లు వార్ 2లోనే ఎక్కువగా ఉన్నా దానికి ఏ ఇవ్వలేదు. సెన్సార్ కోరిన మార్పులకు టీమ్ అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. కానీ కూలి విషయంలో లోకేష్ కనగరాజ్ కాంప్రమైజ్ కాలేదు. ఏ ఇచ్చినా పర్వాలేదు తాను ఫైనల్ చేసిన వెర్షనే ఉండాలనుకున్నాడు. దీంతో నిర్మాత కళానిధి మారన్, హీరో రజనీకాంత్ సైతం ఓకే అనేశారు. ఫలితంగా అడల్ట్స్ ఓన్లీ ముద్రతో కూలి థియేటర్లలో అడుగు పెట్టింది.
లోకేష్ పంతం మంచిదే కానీ ఇప్పుడీ చర్య వల్ల 18 ఏళ్ళ లోపు వాళ్ళను మల్టీప్లెక్సులు కూలి స్క్రీన్లలోకి అనుమతించడం లేదు. ముందుగానే సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటన ఇచ్చినప్పటికీ పలువురు పిల్లలతోనే థియేటర్ కు వస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్స్ కావడంతో వద్దని చెప్పే అవకాశం ఎగ్జిబిటర్లకు లేకుండా పోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదని, సెన్సార్ చెప్పిన కట్స్ మ్యూట్స్ చేసుకుని రీ సెన్సార్ చేసుకుంటే కలెక్షన్లు మరింత మెరుగు పడతాయని డిస్టిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. అయినా ఇది జరగని పని. ఎలాగూ కలెక్షన్లు అదిరిపోతున్నాయి కాబట్టి నిర్ణయం మారకపోవచ్చు.
This post was last modified on August 15, 2025 6:49 am
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…