లాక్ డౌన్కి ముందు రాసుకున్న కథలు ఏమైనా వుంటే వాటిని చింపేయాలని పూరి జగన్నాథ్ సూచించాడు. లాక్డౌన్ టైమ్లో మామూలుగా కంటే ఎక్కువ శాతం సినిమా ప్రియులు వరల్డ్ సినిమా చూసారని, గతంలో ఇరవై శాతం మందికి మాత్రం అది తెలిస్తే ఇప్పుడు యాభై శాతం వరకు సినీ ప్రియులు అన్ని భాషల సినిమాలను ఓటిటిల్లో చూస్తున్నారని, దీని వల్ల గ్లోబల్ ఆడియన్స్ని దృష్టిలో వుంచుకుని ఒక కథ రాసుకోవాలని, కేవలం తెలుగు సినిమా బి, సి సెంటర్ల ఆడియన్స్ కోసం సినిమా చేస్తామంటే ఇకపై చెల్లదని, సినిమా భవిష్యత్తు థియేటర్ల కంటే ఓటిటిలోనే వుందని పూరి చెబుతున్నాడు.
పూరి చెబుతున్నట్టుగా తెలుగు సినిమా స్టోరీ నిజంగా మారిపోవాలా? మునుపు చేసినట్టు మాస్ సినిమాలు ఇప్పుడు చేస్తే కుదరదా? ఆయన చెబుతోన్నది లో బడ్జెట్ సినిమాలకు సరిపోతుంది కానీ భారీ బడ్జెట్ సినిమాలను థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను దృష్టిలో వుంచుకునే చేయాల్సి వుంటుంది. ఉదాహరణకు విజయ్ ‘మాస్టర్’ సినిమా టీజర్ చూస్తే దానిని ఓటిటిలో ఇంట్లో కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేయగలమా? మాస్ ప్రేక్షకుల ఈలలు, కేరింతలు లేకుండా అలాంటి సినిమా టీవీలో చూస్తే మెప్పిస్తుందా? ఫ్రెష్గా ఇప్పుడే లాక్డౌన్ నుంచి బయటకు వస్తున్నారు కనుక లోకం అంతా మారిపోయిందనే ఫీలింగ్ సహజం కానీ ఒక ఆరు నెలలు పోయి అంతా మామూలైపోతే సినిమా కూడా పూర్వ స్థితికి చేరుకోవడం తథ్యం.
This post was last modified on November 20, 2020 10:35 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…