అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సంచలనాలు నమోదు చేస్తున్న కూలి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో ఊహకు అందటం లేదు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆకాశమే హద్దుగా రజనీకాంత్ చెలరేగిపోవడం ఖాయం. అయితే ఈ ప్రాజెక్టు సాధ్యం కావడం వెనుక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఉన్నాడంటే ఆశ్చర్యం కలుగుతుంది కానీ అదే నిజం. స్వయంగా తనే ఈ విషయం చెప్పడంతో బయట ప్రపంచానికి తెలిసింది. ఖైదీ నుంచే లోకేష్ కనగరాజ్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఒక సినిమా చేయాలనే లక్ష్యం ఉండేది. మూడేళ్లు చాలా ట్రై చేశాడు. ఒక లైన్ వినిపించాడు కానీ అది సిద్ధం కాకుండానే కమల్ వచ్చి విక్రమ్ కోసం తీసుకెళ్లిపోయాడు.
దానికన్నా ముందు మాస్టర్, తర్వాత లియో చేశాడు లోకేష్. ఇలా ఏళ్ళు గడిచిపోయాక ఓసారి అనిరుధ్ తో మాట్లాడుతూ రజనితో పెండింగ్ ఉండిపోయిన సినిమా గురించి మనసులో కోరిక చెప్పాడు. ఆయన కోసం రాసుకున్న కథలో కొంత భాగం వినిపించాడు. వినగానే ఇంప్రెస్ అయిపోయిన అనిరుధ్ వెంటనే చొరవ తీసుకుని లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ మీటింగ్ జరిగేలా చూశాడు. విన్న తలైవర్ కూలీ బాగా నచ్చేసింది. పైగా ఆయన అప్పటికే ఖైదీ, మాస్టర్, లియో చూసి ఉండటంతో టేకింగ్ మీద ఎలాంటి అనుమానం లేదు. అలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, జైలర్ నిర్మాతలు సన్ పిక్చర్స్ లైన్ లోకి రావడం చకచకా జరిగిపోయాయి.
ఒకవేళ అనిరుధ్ కనక వెంటనే స్పందించకపోయి ఉంటే కూలీ ఇంకా ఆలస్యమయ్యేది. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లు అతి తక్కువ స్పాన్ లోనే రజనీకాంత్ తో చేసే అదృష్టాన్ని దక్కించుకుంటున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్, కార్తీక్ సుబ్బరాజ్, పా రంజిత్ తదితరులు పట్టుమని పది సినిమాలు చేసిన అనుభవం లేకుండానే సూపర్ స్టార్ కి కెమెరా యాక్షన్ చెప్పారు. రజని సైతం సీనియర్లను పక్కన పెట్టి కుర్రాళ్లతో చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాబీ, గోపీచంద్ మలినేని లాంటి వాళ్ళు ట్రై చేశారు కానీ కుదరలేదు. ఇవన్నీ పక్కనపెడితే కూలీ మేనియా చూస్తుంటే అరాచకం పదం చిన్నదే అనిపిస్తోంది.
This post was last modified on August 13, 2025 11:22 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…