అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సంచలనాలు నమోదు చేస్తున్న కూలి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో ఊహకు అందటం లేదు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆకాశమే హద్దుగా రజనీకాంత్ చెలరేగిపోవడం ఖాయం. అయితే ఈ ప్రాజెక్టు సాధ్యం కావడం వెనుక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఉన్నాడంటే ఆశ్చర్యం కలుగుతుంది కానీ అదే నిజం. స్వయంగా తనే ఈ విషయం చెప్పడంతో బయట ప్రపంచానికి తెలిసింది. ఖైదీ నుంచే లోకేష్ కనగరాజ్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఒక సినిమా చేయాలనే లక్ష్యం ఉండేది. మూడేళ్లు చాలా ట్రై చేశాడు. ఒక లైన్ వినిపించాడు కానీ అది సిద్ధం కాకుండానే కమల్ వచ్చి విక్రమ్ కోసం తీసుకెళ్లిపోయాడు.
దానికన్నా ముందు మాస్టర్, తర్వాత లియో చేశాడు లోకేష్. ఇలా ఏళ్ళు గడిచిపోయాక ఓసారి అనిరుధ్ తో మాట్లాడుతూ రజనితో పెండింగ్ ఉండిపోయిన సినిమా గురించి మనసులో కోరిక చెప్పాడు. ఆయన కోసం రాసుకున్న కథలో కొంత భాగం వినిపించాడు. వినగానే ఇంప్రెస్ అయిపోయిన అనిరుధ్ వెంటనే చొరవ తీసుకుని లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ మీటింగ్ జరిగేలా చూశాడు. విన్న తలైవర్ కూలీ బాగా నచ్చేసింది. పైగా ఆయన అప్పటికే ఖైదీ, మాస్టర్, లియో చూసి ఉండటంతో టేకింగ్ మీద ఎలాంటి అనుమానం లేదు. అలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, జైలర్ నిర్మాతలు సన్ పిక్చర్స్ లైన్ లోకి రావడం చకచకా జరిగిపోయాయి.
ఒకవేళ అనిరుధ్ కనక వెంటనే స్పందించకపోయి ఉంటే కూలీ ఇంకా ఆలస్యమయ్యేది. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లు అతి తక్కువ స్పాన్ లోనే రజనీకాంత్ తో చేసే అదృష్టాన్ని దక్కించుకుంటున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్, కార్తీక్ సుబ్బరాజ్, పా రంజిత్ తదితరులు పట్టుమని పది సినిమాలు చేసిన అనుభవం లేకుండానే సూపర్ స్టార్ కి కెమెరా యాక్షన్ చెప్పారు. రజని సైతం సీనియర్లను పక్కన పెట్టి కుర్రాళ్లతో చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాబీ, గోపీచంద్ మలినేని లాంటి వాళ్ళు ట్రై చేశారు కానీ కుదరలేదు. ఇవన్నీ పక్కనపెడితే కూలీ మేనియా చూస్తుంటే అరాచకం పదం చిన్నదే అనిపిస్తోంది.
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…