నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఒకటే మ్యూజిక్ గా మారిపోయిన కూలి, వార్ 2 టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంది. నిన్న అధికారిక జిఓ రాకపోయినా నిర్మాతలు భారీ హైక్ తీసుకున్నారనే ప్రచారం ఆన్ లైన్ ని ఊపేసింది. దీంతో అభిమానులు, నెటిజెన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. డబ్బింగ్ సినిమాలకు కూడా ఇష్టానుసారం పెంచేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఏకంగా బాయ్ కాట్ నినాదం ఎత్తుకున్నారు. మరి లీకైన న్యూస్ అబద్దమో లేక ఫ్యాన్స్ ముప్పేట దాడిని గుర్తించిన నిర్మాతలు నిర్ణయం మార్చుకోవడమో ఏమో కానీ మొత్తానికి కథ సుఖాంతమయ్యింది.
తెలంగాణలో ఎలాంటి పెంపు ఉండదని, ప్రస్తుతం అమలులో ఉన్న గరిష్ట ధరలే వార్ 2, కూలికి ఉంటాయని లేటెస్ట్ అప్డేట్. అంటే మల్టీప్లెక్సుల్లో 295 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 175 కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్ సైడ్ టాక్ అయితే 75, 50 రూపాయల చొప్పున పెంపు రావొచ్చని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు నైజాం కన్నా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ వెసులుబాటుని వాడుకోవచ్చని వినికిడి. ఒకవేళ ఈ పెంపు కూడా లేకపోతే అందరికన్నా లక్కీ ఫ్యాన్స్ ఏపీలో ఉన్న వాళ్లే అవుతారు.
ఒకరకంగా ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్లకు ప్యాన్ ఇండియా సినిమాలకు హైక్ అడగడం న్యాయమే. కానీ ఇతర భాషల్లో తీసి మనకు డబ్బింగ్ రూపంలో వస్తున్నప్పుడు అదే సూత్రం అమలు పరచడం సరికాదు. వార్ 2లో టెక్నాలజీ వాడి లిప్ సింక్ ద్వారా స్ట్రెయిట్ సెన్సార్ సర్టిఫికెట్ తీసుకున్నా అది ప్రాథమికంగా హిందీ మూవీగానే పరిగణిస్తారు. జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునలు నటించారనే కారణంతో పెంపు వైపు మొగ్గు చూపడం ఏంటనేది సగటు ప్రేక్షకుల అవేదన. ఏదైతేనేం క్లైమాక్స్ హ్యాపీగా ముగిసింది. ఆగస్ట్ 14 రెండు భారీ సినిమాలతో లాంగ్ వీకెండ్ కోసం ఫ్యాన్స్ సిద్ధమైపోవచ్చు.
This post was last modified on August 12, 2025 2:32 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…