నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఒకటే మ్యూజిక్ గా మారిపోయిన కూలి, వార్ 2 టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంది. నిన్న అధికారిక జిఓ రాకపోయినా నిర్మాతలు భారీ హైక్ తీసుకున్నారనే ప్రచారం ఆన్ లైన్ ని ఊపేసింది. దీంతో అభిమానులు, నెటిజెన్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. డబ్బింగ్ సినిమాలకు కూడా ఇష్టానుసారం పెంచేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఏకంగా బాయ్ కాట్ నినాదం ఎత్తుకున్నారు. మరి లీకైన న్యూస్ అబద్దమో లేక ఫ్యాన్స్ ముప్పేట దాడిని గుర్తించిన నిర్మాతలు నిర్ణయం మార్చుకోవడమో ఏమో కానీ మొత్తానికి కథ సుఖాంతమయ్యింది.
తెలంగాణలో ఎలాంటి పెంపు ఉండదని, ప్రస్తుతం అమలులో ఉన్న గరిష్ట ధరలే వార్ 2, కూలికి ఉంటాయని లేటెస్ట్ అప్డేట్. అంటే మల్టీప్లెక్సుల్లో 295 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 175 కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్ సైడ్ టాక్ అయితే 75, 50 రూపాయల చొప్పున పెంపు రావొచ్చని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు నైజాం కన్నా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ వెసులుబాటుని వాడుకోవచ్చని వినికిడి. ఒకవేళ ఈ పెంపు కూడా లేకపోతే అందరికన్నా లక్కీ ఫ్యాన్స్ ఏపీలో ఉన్న వాళ్లే అవుతారు.
ఒకరకంగా ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్లకు ప్యాన్ ఇండియా సినిమాలకు హైక్ అడగడం న్యాయమే. కానీ ఇతర భాషల్లో తీసి మనకు డబ్బింగ్ రూపంలో వస్తున్నప్పుడు అదే సూత్రం అమలు పరచడం సరికాదు. వార్ 2లో టెక్నాలజీ వాడి లిప్ సింక్ ద్వారా స్ట్రెయిట్ సెన్సార్ సర్టిఫికెట్ తీసుకున్నా అది ప్రాథమికంగా హిందీ మూవీగానే పరిగణిస్తారు. జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునలు నటించారనే కారణంతో పెంపు వైపు మొగ్గు చూపడం ఏంటనేది సగటు ప్రేక్షకుల అవేదన. ఏదైతేనేం క్లైమాక్స్ హ్యాపీగా ముగిసింది. ఆగస్ట్ 14 రెండు భారీ సినిమాలతో లాంగ్ వీకెండ్ కోసం ఫ్యాన్స్ సిద్ధమైపోవచ్చు.
This post was last modified on August 12, 2025 2:32 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…