ఏనాటి నుంచో వినిపిస్తోంది ఢీ సినిమాకు సీక్వెల్. మంచు విష్ణు నోట చాలా సార్లు వినిపించింది కానీ మెటీరియలైజ్ కాలేదు. ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టు సెట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇది సీక్వెల్ మాదిరిగా వుండదు. సెపరేట్ కథతో సెపరేట్ సినిమాగా వుంటుంది. ఢీ అనే టైటిల్, శ్రీనువైట్ల, మంచు విష్ణు మాత్రమే కామన్ విషయాలు.
ఈవారంలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతోంది. ప్రస్తుతం మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో చాలా ప్రాజెక్టులు వున్నాయి. మోసగాళ్లు, భక్త కన్నప్ప, మోహన్ బాబు కీలకపాత్రలో ఓ సినిమా. ఇలా చాలా వున్నాయి. వాటితో పాటే ఈ సినిమాను కూడా విష్ణునే నిర్మిస్తారు.
ఢీ సినిమా విషయంలో అప్పట్లో దర్శకుడు శ్రీనువైట్లకు బొలెడు మంది సాయం పట్టారు. పైగా ప్రస్తుతం శ్రీనువైట్ల అస్సలు ఫామ్ లో లేరు. వరుస డిజాస్టర్లు ఇచ్చి ఖాళీగా వున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి మరోసారి ఢీ అనేందుకు ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేసారో? ఎలా వుంటుందో చూడాలి.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…