ఏనాటి నుంచో వినిపిస్తోంది ఢీ సినిమాకు సీక్వెల్. మంచు విష్ణు నోట చాలా సార్లు వినిపించింది కానీ మెటీరియలైజ్ కాలేదు. ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టు సెట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇది సీక్వెల్ మాదిరిగా వుండదు. సెపరేట్ కథతో సెపరేట్ సినిమాగా వుంటుంది. ఢీ అనే టైటిల్, శ్రీనువైట్ల, మంచు విష్ణు మాత్రమే కామన్ విషయాలు.
ఈవారంలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతోంది. ప్రస్తుతం మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో చాలా ప్రాజెక్టులు వున్నాయి. మోసగాళ్లు, భక్త కన్నప్ప, మోహన్ బాబు కీలకపాత్రలో ఓ సినిమా. ఇలా చాలా వున్నాయి. వాటితో పాటే ఈ సినిమాను కూడా విష్ణునే నిర్మిస్తారు.
ఢీ సినిమా విషయంలో అప్పట్లో దర్శకుడు శ్రీనువైట్లకు బొలెడు మంది సాయం పట్టారు. పైగా ప్రస్తుతం శ్రీనువైట్ల అస్సలు ఫామ్ లో లేరు. వరుస డిజాస్టర్లు ఇచ్చి ఖాళీగా వున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి మరోసారి ఢీ అనేందుకు ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేసారో? ఎలా వుంటుందో చూడాలి.
This post was last modified on November 20, 2020 2:47 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…