ఏనాటి నుంచో వినిపిస్తోంది ఢీ సినిమాకు సీక్వెల్. మంచు విష్ణు నోట చాలా సార్లు వినిపించింది కానీ మెటీరియలైజ్ కాలేదు. ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టు సెట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇది సీక్వెల్ మాదిరిగా వుండదు. సెపరేట్ కథతో సెపరేట్ సినిమాగా వుంటుంది. ఢీ అనే టైటిల్, శ్రీనువైట్ల, మంచు విష్ణు మాత్రమే కామన్ విషయాలు.
ఈవారంలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతోంది. ప్రస్తుతం మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో చాలా ప్రాజెక్టులు వున్నాయి. మోసగాళ్లు, భక్త కన్నప్ప, మోహన్ బాబు కీలకపాత్రలో ఓ సినిమా. ఇలా చాలా వున్నాయి. వాటితో పాటే ఈ సినిమాను కూడా విష్ణునే నిర్మిస్తారు.
ఢీ సినిమా విషయంలో అప్పట్లో దర్శకుడు శ్రీనువైట్లకు బొలెడు మంది సాయం పట్టారు. పైగా ప్రస్తుతం శ్రీనువైట్ల అస్సలు ఫామ్ లో లేరు. వరుస డిజాస్టర్లు ఇచ్చి ఖాళీగా వున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి మరోసారి ఢీ అనేందుకు ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేసారో? ఎలా వుంటుందో చూడాలి.
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…