ఏనాటి నుంచో వినిపిస్తోంది ఢీ సినిమాకు సీక్వెల్. మంచు విష్ణు నోట చాలా సార్లు వినిపించింది కానీ మెటీరియలైజ్ కాలేదు. ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టు సెట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇది సీక్వెల్ మాదిరిగా వుండదు. సెపరేట్ కథతో సెపరేట్ సినిమాగా వుంటుంది. ఢీ అనే టైటిల్, శ్రీనువైట్ల, మంచు విష్ణు మాత్రమే కామన్ విషయాలు.
ఈవారంలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతోంది. ప్రస్తుతం మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో చాలా ప్రాజెక్టులు వున్నాయి. మోసగాళ్లు, భక్త కన్నప్ప, మోహన్ బాబు కీలకపాత్రలో ఓ సినిమా. ఇలా చాలా వున్నాయి. వాటితో పాటే ఈ సినిమాను కూడా విష్ణునే నిర్మిస్తారు.
ఢీ సినిమా విషయంలో అప్పట్లో దర్శకుడు శ్రీనువైట్లకు బొలెడు మంది సాయం పట్టారు. పైగా ప్రస్తుతం శ్రీనువైట్ల అస్సలు ఫామ్ లో లేరు. వరుస డిజాస్టర్లు ఇచ్చి ఖాళీగా వున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి మరోసారి ఢీ అనేందుకు ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేసారో? ఎలా వుంటుందో చూడాలి.
This post was last modified on November 20, 2020 2:47 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…