మహావతార్ నరసింహ సినిమా టైటిల్ కు తగ్గట్టే ఉగ్ర నరసింహావతారం చూపిస్తోంది. ఒకపక్క బ్రేక్ ఈవెన్లు కాక బడా ప్రొడ్యూసర్లు తలలు పట్టుకుంటే ఒక యానిమేషన్ మూవీ ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించడం ఎవరూ ఊహించలేదు. నిన్నటితో రెండు వందల కోట్ల క్లబ్బులో అడుగులు పెట్టిన ఈ చిత్రం నెక్స్ట్ టార్గెట్ గా ట్రిపుల్ సెంచరీని పెట్టుకుంది. అయితే టచ్ కావడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే గురువారం ఒకే రోజు వార్ 2, కూలీ రెండూ రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న అంచనాల దృష్ట్యా వీటికి థియేటర్లు సర్దడమే ఎగ్జిబిటర్లకు మహా కష్టంగా ఉంది. అలాంటిది పాత సినిమాలు కొనసాగించే సీన్ లేదు.
మెయిన్ సెంటర్స్ మినహాయించి తక్కువ స్క్రీన్లు అందుబాటులో ఉన్న బిసి కేంద్రాల్లో మహావతార్ నరసింహకు సెలవు ఇవ్వక తప్పదు. వీకెండ్ బుకింగ్స్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాయని, మూడో వారం వీకెండ్ లో కూడా టికెట్లు దొరకని పరిస్థితి మాములుగా పుష్ప లాంటి ప్యాన్ ఇండియా సినిమాలకు చూస్తామని, కానీ మహావతార్ నరసింహ వాటికి ధీటుగా నిలుస్తోందని ట్రేడ్ టాక్. ఇప్పటికీ చూడకుండా మిస్సయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే ఎక్స్ పీరియన్స్ కావాలని వారాంతం టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. హైక్ లేకుండా సాధారణ ధరలకే అమ్మడం నిర్మాతలకు సానుకూలంగా మారింది.
లెక్కల సంగతి పక్కనపెడితే యునానిమస్ టాక్ తో దూసుకుపోయిన మహావతార్ నరసింహ ఫిలిం మేకర్స్ కు ఒక లెసన్ లాంటిది. కంటెంట్ బాగుంటే జనం ఎంతగా నెత్తి మీద పెట్టుకుని చూస్తారనడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఒకవేళ ఈ ఒక్క వారం కాంపిటీషన్ లేకపోయి ఉంటే ఈజీగా మూడు వందల కోట్లు దాటేసేది కానీ రజినీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ రూపంలో స్పీడ్ బ్రేకర్స్ తగులుతున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా దీనికొచ్చిన రెస్పాన్స్ చూసి ఇతర నిర్మాతలు సైతం యానిమేషన్ మీద సీరియస్ గా దృష్టి పెడుతున్నారట. అతి దగ్గరలో ఇదో ట్రెండ్ గా మారిపోవడం మాత్రం ఖాయం.
This post was last modified on August 11, 2025 3:58 pm
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…