మహావతార్ నరసింహ సినిమా టైటిల్ కు తగ్గట్టే ఉగ్ర నరసింహావతారం చూపిస్తోంది. ఒకపక్క బ్రేక్ ఈవెన్లు కాక బడా ప్రొడ్యూసర్లు తలలు పట్టుకుంటే ఒక యానిమేషన్ మూవీ ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించడం ఎవరూ ఊహించలేదు. నిన్నటితో రెండు వందల కోట్ల క్లబ్బులో అడుగులు పెట్టిన ఈ చిత్రం నెక్స్ట్ టార్గెట్ గా ట్రిపుల్ సెంచరీని పెట్టుకుంది. అయితే టచ్ కావడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే గురువారం ఒకే రోజు వార్ 2, కూలీ రెండూ రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న అంచనాల దృష్ట్యా వీటికి థియేటర్లు సర్దడమే ఎగ్జిబిటర్లకు మహా కష్టంగా ఉంది. అలాంటిది పాత సినిమాలు కొనసాగించే సీన్ లేదు.
మెయిన్ సెంటర్స్ మినహాయించి తక్కువ స్క్రీన్లు అందుబాటులో ఉన్న బిసి కేంద్రాల్లో మహావతార్ నరసింహకు సెలవు ఇవ్వక తప్పదు. వీకెండ్ బుకింగ్స్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాయని, మూడో వారం వీకెండ్ లో కూడా టికెట్లు దొరకని పరిస్థితి మాములుగా పుష్ప లాంటి ప్యాన్ ఇండియా సినిమాలకు చూస్తామని, కానీ మహావతార్ నరసింహ వాటికి ధీటుగా నిలుస్తోందని ట్రేడ్ టాక్. ఇప్పటికీ చూడకుండా మిస్సయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే ఎక్స్ పీరియన్స్ కావాలని వారాంతం టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. హైక్ లేకుండా సాధారణ ధరలకే అమ్మడం నిర్మాతలకు సానుకూలంగా మారింది.
లెక్కల సంగతి పక్కనపెడితే యునానిమస్ టాక్ తో దూసుకుపోయిన మహావతార్ నరసింహ ఫిలిం మేకర్స్ కు ఒక లెసన్ లాంటిది. కంటెంట్ బాగుంటే జనం ఎంతగా నెత్తి మీద పెట్టుకుని చూస్తారనడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఒకవేళ ఈ ఒక్క వారం కాంపిటీషన్ లేకపోయి ఉంటే ఈజీగా మూడు వందల కోట్లు దాటేసేది కానీ రజినీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ రూపంలో స్పీడ్ బ్రేకర్స్ తగులుతున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా దీనికొచ్చిన రెస్పాన్స్ చూసి ఇతర నిర్మాతలు సైతం యానిమేషన్ మీద సీరియస్ గా దృష్టి పెడుతున్నారట. అతి దగ్గరలో ఇదో ట్రెండ్ గా మారిపోవడం మాత్రం ఖాయం.
This post was last modified on August 11, 2025 3:58 pm
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…