మహావతార్ నరసింహ సినిమా టైటిల్ కు తగ్గట్టే ఉగ్ర నరసింహావతారం చూపిస్తోంది. ఒకపక్క బ్రేక్ ఈవెన్లు కాక బడా ప్రొడ్యూసర్లు తలలు పట్టుకుంటే ఒక యానిమేషన్ మూవీ ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించడం ఎవరూ ఊహించలేదు. నిన్నటితో రెండు వందల కోట్ల క్లబ్బులో అడుగులు పెట్టిన ఈ చిత్రం నెక్స్ట్ టార్గెట్ గా ట్రిపుల్ సెంచరీని పెట్టుకుంది. అయితే టచ్ కావడం కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే గురువారం ఒకే రోజు వార్ 2, కూలీ రెండూ రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న అంచనాల దృష్ట్యా వీటికి థియేటర్లు సర్దడమే ఎగ్జిబిటర్లకు మహా కష్టంగా ఉంది. అలాంటిది పాత సినిమాలు కొనసాగించే సీన్ లేదు.
మెయిన్ సెంటర్స్ మినహాయించి తక్కువ స్క్రీన్లు అందుబాటులో ఉన్న బిసి కేంద్రాల్లో మహావతార్ నరసింహకు సెలవు ఇవ్వక తప్పదు. వీకెండ్ బుకింగ్స్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాయని, మూడో వారం వీకెండ్ లో కూడా టికెట్లు దొరకని పరిస్థితి మాములుగా పుష్ప లాంటి ప్యాన్ ఇండియా సినిమాలకు చూస్తామని, కానీ మహావతార్ నరసింహ వాటికి ధీటుగా నిలుస్తోందని ట్రేడ్ టాక్. ఇప్పటికీ చూడకుండా మిస్సయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే ఎక్స్ పీరియన్స్ కావాలని వారాంతం టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. హైక్ లేకుండా సాధారణ ధరలకే అమ్మడం నిర్మాతలకు సానుకూలంగా మారింది.
లెక్కల సంగతి పక్కనపెడితే యునానిమస్ టాక్ తో దూసుకుపోయిన మహావతార్ నరసింహ ఫిలిం మేకర్స్ కు ఒక లెసన్ లాంటిది. కంటెంట్ బాగుంటే జనం ఎంతగా నెత్తి మీద పెట్టుకుని చూస్తారనడానికి ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. ఒకవేళ ఈ ఒక్క వారం కాంపిటీషన్ లేకపోయి ఉంటే ఈజీగా మూడు వందల కోట్లు దాటేసేది కానీ రజినీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ రూపంలో స్పీడ్ బ్రేకర్స్ తగులుతున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా దీనికొచ్చిన రెస్పాన్స్ చూసి ఇతర నిర్మాతలు సైతం యానిమేషన్ మీద సీరియస్ గా దృష్టి పెడుతున్నారట. అతి దగ్గరలో ఇదో ట్రెండ్ గా మారిపోవడం మాత్రం ఖాయం.
This post was last modified on August 11, 2025 3:58 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…