నిన్న 50వ పడిలో అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబుకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెలబ్రిటీలతో మొదలుపెట్టి అతడు రీ రిలీజ్ థియేటర్లలో అభిమానుల దాకా అందరూ ఘనంగా జరుపుకున్నారు. అయితే అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కి ఇది ఎందుకు అసలైన మలుపు కానుందో చూద్దాం. పాతికేళ్ల నట ప్రస్థానంలో మహేష్ సోలో హీరోగా చేసినవి 28 సినిమాలే. వాటిలో ఒక్క రీమేక్ లేదు. పక్క భాషల నుంచి కథలు అద్దెకు తెచ్చుకుని సేఫ్ గేమ్ ఆడలేదు. హిందీ మార్కెట్ కోసం పాకులాడలేదు. ఆ మాటకొస్తే తనను కలిసిన ఎందరో బాలీవుడ్ మేకర్స్ కి సున్నితంగా నో చెప్పుకుంటూ వచ్చి ఓన్లీ తెలుగుతో గెలుస్తూ వచ్చాడు.
ఇప్పుడు కోరుకున్న ఘడియ రానే వచ్చింది. ప్రపంచంలోని టాప్ క్లాస్ ఫిలిం మేకర్స్ సైతం ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 చేతికి దక్కింది. రాజమౌళి తన మరో కలల ప్రాజెక్టుకు మహేష్ బాబునే ఎంచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తో కేవలం పాటకు మాత్రమే ఆస్కార్ తెచ్చుకున్న జక్కన్న ఈసారి దర్శకత్వ అవార్డు వైపు గురి పెడుతున్నాడు. కేవలం ప్రీ లుక్ తోనే ప్రకంపనలు రేపుతున్నాడు. భారతీయ మూలాలు మర్చిపోకుండా తీసుకున్నది ఇండియానా జోన్స్ స్ఫూర్తినే అయినా మన నేటివిటీతో మన అడవి కథను గర్వంగా చూపించబోతున్నాడు. ఇప్పటిదాకా నార్త్ ని సీరియస్ గా తీసుకోని మహేష్ కు ఇప్పుడు ఏకంగా గ్లోబల్ గుర్తింపు రానుంది.
నవంబర్ లో టీజర్ వస్తుందని రాజమౌళి సూచన ఇచ్చారు కాబట్టి ఫస్ట్ దర్శనం కోసం ఇంకో మూడు నెలలు ఎదురు చూడాల్సిందే. బాలనటుడిగా బుడిబుడి అడుగులు వేస్తూ, నాన్న కృష్ణతో కలిసి తెరను పంచుకుంటూ, అన్నయ్య రమేష్ విఫలమైన చోట తాను గెలవాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్ని మైలురాళ్ళు దాటి గెలవడం ఫ్యాన్స్ నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటారు. అభాగ్యులైన చిన్న పిల్లల ప్రాణాలు కాపాడుతూ, వివాదాలకు దూరంగా ఉంటూ మహేష్ సాగిస్తున్న ప్రస్థానం వంద సినిమాలను చేరుకుంటుందో లేదో కానీ వందేళ్ల పాటు గుర్తుండిపోయే ల్యాండ్ మార్క్ మూవీస్ అందించే హామీ ఇస్తోంది.
This post was last modified on August 10, 2025 10:26 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…