నిన్న 50వ పడిలో అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబుకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెలబ్రిటీలతో మొదలుపెట్టి అతడు రీ రిలీజ్ థియేటర్లలో అభిమానుల దాకా అందరూ ఘనంగా జరుపుకున్నారు. అయితే అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ కి ఇది ఎందుకు అసలైన మలుపు కానుందో చూద్దాం. పాతికేళ్ల నట ప్రస్థానంలో మహేష్ సోలో హీరోగా చేసినవి 28 సినిమాలే. వాటిలో ఒక్క రీమేక్ లేదు. పక్క భాషల నుంచి కథలు అద్దెకు తెచ్చుకుని సేఫ్ గేమ్ ఆడలేదు. హిందీ మార్కెట్ కోసం పాకులాడలేదు. ఆ మాటకొస్తే తనను కలిసిన ఎందరో బాలీవుడ్ మేకర్స్ కి సున్నితంగా నో చెప్పుకుంటూ వచ్చి ఓన్లీ తెలుగుతో గెలుస్తూ వచ్చాడు.
ఇప్పుడు కోరుకున్న ఘడియ రానే వచ్చింది. ప్రపంచంలోని టాప్ క్లాస్ ఫిలిం మేకర్స్ సైతం ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 చేతికి దక్కింది. రాజమౌళి తన మరో కలల ప్రాజెక్టుకు మహేష్ బాబునే ఎంచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తో కేవలం పాటకు మాత్రమే ఆస్కార్ తెచ్చుకున్న జక్కన్న ఈసారి దర్శకత్వ అవార్డు వైపు గురి పెడుతున్నాడు. కేవలం ప్రీ లుక్ తోనే ప్రకంపనలు రేపుతున్నాడు. భారతీయ మూలాలు మర్చిపోకుండా తీసుకున్నది ఇండియానా జోన్స్ స్ఫూర్తినే అయినా మన నేటివిటీతో మన అడవి కథను గర్వంగా చూపించబోతున్నాడు. ఇప్పటిదాకా నార్త్ ని సీరియస్ గా తీసుకోని మహేష్ కు ఇప్పుడు ఏకంగా గ్లోబల్ గుర్తింపు రానుంది.
నవంబర్ లో టీజర్ వస్తుందని రాజమౌళి సూచన ఇచ్చారు కాబట్టి ఫస్ట్ దర్శనం కోసం ఇంకో మూడు నెలలు ఎదురు చూడాల్సిందే. బాలనటుడిగా బుడిబుడి అడుగులు వేస్తూ, నాన్న కృష్ణతో కలిసి తెరను పంచుకుంటూ, అన్నయ్య రమేష్ విఫలమైన చోట తాను గెలవాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్ని మైలురాళ్ళు దాటి గెలవడం ఫ్యాన్స్ నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటారు. అభాగ్యులైన చిన్న పిల్లల ప్రాణాలు కాపాడుతూ, వివాదాలకు దూరంగా ఉంటూ మహేష్ సాగిస్తున్న ప్రస్థానం వంద సినిమాలను చేరుకుంటుందో లేదో కానీ వందేళ్ల పాటు గుర్తుండిపోయే ల్యాండ్ మార్క్ మూవీస్ అందించే హామీ ఇస్తోంది.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…