‘‘ఎంత మంచి టాక్ వచ్చినా.. వీకెండ్ తర్వాత కష్టమే’’.. ‘‘వీక్ డేస్లో సినిమాకు మంచి వసూళ్లు రావండీ’’.. ‘‘రెండో వారంలో ఇంకో కొత్త సినిమా వస్తే.. ముందు వారంలో వచ్చిన సినిమాను ప్రేక్షకులు పట్టించుకోరు’’.. ‘‘ఈ రోజుల్లో కొన్ని వారాల పాటు సినిమా ఎక్కడ ఆడుతుందండీ’’.. ‘‘ప్రేక్షకులకు వెండితెర మీద ఆసక్తి పోయింది. ఓటీటీలను దాటి వాళ్లను థియేటర్లకు తీసుకురావడం కష్టం’’.. ‘‘పబ్లిసిటీ లేకుండా జనాల్లోకి సినిమాను తీసుకెళ్లడం సాధ్యం కాదు’’.. ఇలా ఎన్నో అభిప్రాయాలు బలపడిపోయాయి గత కొన్నేళ్లలో. ఎంత మంచి సినిమా తీసినా.. స్టార్లు ఉన్నా జనాలను థియేటర్లకు రప్పించడం కష్టమని ఫిక్సయిపోతున్నారు నిర్మాతలు.
కానీ సిన్సియర్గా సినిమా తీసి, టికెట్ల ధరలను అందుబాటులో పెడితే జనం ఎలా థియేటర్లకు విరగబడి వస్తారో ‘మహావతార నరసింహా’ అనే సినిమా రుజువు చేస్తోంది. రెండు వారాల కిందట ఏమాత్రం అంచనాల్లేకుండా రిలీజైన ఈ యానిమేషన్ మూవీ.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ రోజు బుక్ మై షోలో గంటకు 35-40 వేల మధ్య టికెట్లు తెగుతున్నాయి ఈ చిత్రానికి. మల్టీప్లెక్సుల్లో ఫుల్స్ పడుతున్నాయి. వాటిలో ఈవెనింగ్ షోలకు ఎక్కడా టికెట్లు దొరికే పరిస్థితి లేేదు.
ముందే అన్నీ బుక్ అయిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్స్ కూడా ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. ఇలా మూడో వీకెండ్లో ఈ స్థాయిలో జనాలతో థియేటర్లు కళకళలాడిన సినిమా ఈ మధ్య కాలంలో మరొకటి లేదు. ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా, బజ్ లేకుండా రిలీజైన సినిమా.. ఈ స్థాయిలో జనాలను మెప్పించడం అరుదైన విషయం. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఒక వారానికే కళ్ళు తేలేస్తున్న రోజుల్లో నటులు లేని ఒక యానిమేషన్ మూవీ ఇలా వారాల తరబడి ఆడడం షాకింగ్. ప్రేక్షకులు థియేటర్లకే వచ్చి సినిమా చూడాలి అనిపించే కంటెంట్ ఉండడం.. టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం ఈ సినిమా అసాధారణ విజయానికి కారణం. దీన్ని బట్టి సినిమా సక్సెస్కు ఏం అవసరం అన్నది ఫిలిం మేకర్స్ ఆలోచిస్తే మంచిది.
This post was last modified on August 9, 2025 4:46 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…