ఈ వారం విడుదల కాబోతున్న కొత్త సినిమాల కన్నా రీ రిలీజ్ అవుతున్న అతడుదే డామినేషన్ అయ్యేలా ఉంది. కన్నడ బ్లాక్ బస్టర్ ‘సు ఫ్రమ్ సో’ని మైత్రి తీసుకొస్తున్నా జనాలకు రీచ్ అవుతున్న దాఖలాలు పెద్దగా లేవు. మౌత్ టాక్ కనక వేగంగా స్ప్రెడ్ అయితే మంచి వసూళ్లు కళ్లజూడవచ్చు. మంజుమ్మల్ బాయ్స్ తరహాలో తమకు సర్ప్రైజ్ హిట్ అవుతుందనే నమ్మకం మైత్రి టీమ్ లో ఉంది. నిన్న రాజ్ బి శెట్టితో పాటు టీమ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈవెంట్ చేయడం సోషల్ మీడియాలో కొంత బజ్ తీసుకొచ్చింది. ఇక అతడు విషయానికి వస్తే రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ లో రెండు కోట్ల దాకా గ్రాస్ వచ్చేసింది.
ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున అతడుతో సెలెబ్రేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ కి పలు బ్రేకులు పడుతున్నాయి. మొదటిది కింగ్డమ్ ఫలితంతో సంబంధం లేకుండా వార్ 2 వచ్చే దాకా కొనసాగేలా మెయిన్ థియేటర్లతో అగ్రిమెంట్లు చేసుకుంది. ఇంకోవైపు మహావీర్ నరసింహ తగ్గేదేలే తరహాలో బుక్ మై షోలో రోజుకు కనీసం లక్షన్నర టికెట్లు అమ్ముతోంది. అతడు కోసం దీన్ని తీసేంత సీన్ ఎంత మాత్రం లేదు. వచ్చే వారం కూలి, వార్ 2 కేవలం అయిదు రోజుల గ్యాప్ లో వస్తున్నాయి. సో అతడు ఎంత రాబట్టుకున్న ఈ లోపే పూర్తి చేయాలి. అందుకే రికార్డులు అనుమానంగానే ఉన్నాయి.
ట్రేడ్ టాక్ ప్రకారం అతడు రీ రిలీజ్ హక్కులు మూడున్నర కోట్లకు తీసుకున్నారట. అది కూడా కేవలం ఎడాది కాలానికి మాత్రమే. ఇది రికవర్ కావాలంటే పది కోట్ల గ్రాస్ ని టచ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం టఫ్ గానే ఉంది. ఖలేజా, మురారి లాగా ఫ్రీ గ్రౌండ్ దొరికితే ఖచ్చితంగా అతడు సునామినే అయ్యేది. అడ్డంకులు ఎన్ని ఉన్నా అతడు పై చేయి సాధించడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు. మహేష్ కోటగా చెప్పుకునే సుదర్శన్ 35 ఎంఎంలో కేవలం రెండు షోలు మాత్రమే దొరకడం లాంటి అసంతృప్తులు వాళ్ళను వెంటాడుతున్నాయి. చూడాలి అతడు ఎలాంటి మైలురాళ్లు సృష్టించబోతున్నాడో.
This post was last modified on August 7, 2025 10:10 pm
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…