ఈ వారం విడుదల కాబోతున్న కొత్త సినిమాల కన్నా రీ రిలీజ్ అవుతున్న అతడుదే డామినేషన్ అయ్యేలా ఉంది. కన్నడ బ్లాక్ బస్టర్ ‘సు ఫ్రమ్ సో’ని మైత్రి తీసుకొస్తున్నా జనాలకు రీచ్ అవుతున్న దాఖలాలు పెద్దగా లేవు. మౌత్ టాక్ కనక వేగంగా స్ప్రెడ్ అయితే మంచి వసూళ్లు కళ్లజూడవచ్చు. మంజుమ్మల్ బాయ్స్ తరహాలో తమకు సర్ప్రైజ్ హిట్ అవుతుందనే నమ్మకం మైత్రి టీమ్ లో ఉంది. నిన్న రాజ్ బి శెట్టితో పాటు టీమ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఈవెంట్ చేయడం సోషల్ మీడియాలో కొంత బజ్ తీసుకొచ్చింది. ఇక అతడు విషయానికి వస్తే రెండు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ లో రెండు కోట్ల దాకా గ్రాస్ వచ్చేసింది.
ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున అతడుతో సెలెబ్రేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ కి పలు బ్రేకులు పడుతున్నాయి. మొదటిది కింగ్డమ్ ఫలితంతో సంబంధం లేకుండా వార్ 2 వచ్చే దాకా కొనసాగేలా మెయిన్ థియేటర్లతో అగ్రిమెంట్లు చేసుకుంది. ఇంకోవైపు మహావీర్ నరసింహ తగ్గేదేలే తరహాలో బుక్ మై షోలో రోజుకు కనీసం లక్షన్నర టికెట్లు అమ్ముతోంది. అతడు కోసం దీన్ని తీసేంత సీన్ ఎంత మాత్రం లేదు. వచ్చే వారం కూలి, వార్ 2 కేవలం అయిదు రోజుల గ్యాప్ లో వస్తున్నాయి. సో అతడు ఎంత రాబట్టుకున్న ఈ లోపే పూర్తి చేయాలి. అందుకే రికార్డులు అనుమానంగానే ఉన్నాయి.
ట్రేడ్ టాక్ ప్రకారం అతడు రీ రిలీజ్ హక్కులు మూడున్నర కోట్లకు తీసుకున్నారట. అది కూడా కేవలం ఎడాది కాలానికి మాత్రమే. ఇది రికవర్ కావాలంటే పది కోట్ల గ్రాస్ ని టచ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం టఫ్ గానే ఉంది. ఖలేజా, మురారి లాగా ఫ్రీ గ్రౌండ్ దొరికితే ఖచ్చితంగా అతడు సునామినే అయ్యేది. అడ్డంకులు ఎన్ని ఉన్నా అతడు పై చేయి సాధించడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు. మహేష్ కోటగా చెప్పుకునే సుదర్శన్ 35 ఎంఎంలో కేవలం రెండు షోలు మాత్రమే దొరకడం లాంటి అసంతృప్తులు వాళ్ళను వెంటాడుతున్నాయి. చూడాలి అతడు ఎలాంటి మైలురాళ్లు సృష్టించబోతున్నాడో.
This post was last modified on August 7, 2025 10:10 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…