కేవలం 15 ఏళ్లకే కథానాయికగా అరంగేట్రం చేసి.. టీనేజీలోనే పెద్ద స్టార్ హీరోయిన్గా ఎదిగింది తమన్నా. రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో ఇటు దక్షిణాదిన.. అటు బాలీవుడ్లో ఆమె భారీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. గత కొన్నేళ్లలో కథానాయికగా అవకాశాలు తగ్గినప్పటికీ.. ఐటెం సాంగ్స్లో మెరుస్తూ, వెబ్ సిరీస్ల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న తమ్మూ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి పంచుకుంది. ఒక సౌత్ బిగ్ స్టార్ తన మీద సెట్స్లో అందరి ముందు కేకలు వేశారని.. ఆ తర్వాత తనకు సారీ చెప్పారని ఆమె వెల్లడించంది.
ఆ స్టార్ ఎవరన్నది చెప్పలేదు కానీ.. ఆ హీరో టాలీవుడ్కు చెందిన వాడే అయ్యుంటాడనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ అనుభవం గురించి తమన్నా ఏం చెప్పిందంటే?
‘‘నేను చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చేశాను. దీంతో నాకు పెద్దగా ఏమీ తెలియదని అనుకునేవాళ్లు. నా కాన్ఫిడెన్స్ను దెబ్బ తీయాలని చూసేవారు. నన్ను అవమానించడానికి ప్రయత్నించారు. ఐతే ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత కాలానికే నాకు ఓ పెద్ద హీరో సినిమాలో నటించే అవకాశం దక్కింది. కానీ ఆయనతో కొన్ని సీన్లు చేసేటపుడు ఇబ్బందిగా అనిపించేది. ఆ విషయాన్ని దర్శక నిర్మాతలకు కూడా చెప్పాను. ఆ సీన్లు నా వల్ల కాదన్నాను.
అప్పుడు ఆ హీరో హీరోయిన్ని మార్చమంటూ నాపై కేకలు వేశాడు. సెట్లో అందరి ముందూ ఆయన అరిచాడు. ఐతే ఒకరు మన పట్ల అవమానకరంగా ప్రవర్తించినా.. తిరిగి మనం అలా చేయకూడదని సైలెంట్గా ఉన్నా. ఐతే తర్వాతి రోజు ఆ హీరో తనంతటే తనే నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు. కోపంలో అరిచానని.. నాతో అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దీంతో ఆ గొడవ సమసిపోయింది’’ అని తమన్నా వివరించింది. హిందీలో ‘చాంద్ సా రోష్ చెహ్రా’ అనే చిత్రంతో కథానాయికగా పరిచయం అయిన తమన్నా.. తెలుగులోకి మంచు మనోజ్ మూవీ ‘శ్రీ’తో ఎంట్రీ ఇచ్చింది. ‘హ్యాపీడేస్’తో పెద్ద బ్రేక్ వచ్చాక చూస్తుండగానే పెద్ద హీరోయిన్ అయిపోయింది తమ్మూ.
This post was last modified on August 7, 2025 6:10 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…