టాలీవుడ్ ఒకప్పుడు గబ్బర్ సింగ్, బలుపు, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్లతో మంచి స్టార్ డమ్ ఎంజాయ్ చేసిన శృతి హాసన్ కాటమ రాయుడు తర్వాత కనిపించకుండా పోయింది. మళ్ళీ సలార్ లో దర్శనమిచ్చింది. అందులో ప్రభాస్ సరసన ఆడి పాడకపోయినా కాస్త చెప్పుకోదగ్గ పాత్రే దక్కింది. తాజాగా కూలీలో ఫుల్ లెన్త్ రోల్ చేసింది. అయితే ఇందులో తను హీరోయిన్ కాదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈమెకు పెట్టలేదు. అయితే చెన్నై వర్గాల కథనం ప్రకారం కూలీలోని కీలకమైన ట్విస్టులన్నీ ఈమె చుట్టే ఉంటాయట. ఒకవేళ నిజమైతే కనక ఫ్యాన్స్ కి పండగే. అవేంటో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది.
శృతి హాసన్ తండ్రైన సత్యరాజ్ హార్బర్ లో జరిగే మాఫియా రహస్యాలను వెతికి తీసే పనిలో ఉంటాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ తో ఏర్పడిన స్నేహం బంధంగా మారుతుంది. కొన్ని అనూహ్య సంఘటనల తర్వాత రజని, సత్యరాజ్ ఇద్దరూ మాయమైపోతారు. శృతి హాసన్ తండ్రిని వెతికే క్రమంలో నాగార్జున చీకటి ప్రపంచాన్ని బయటికి తెస్తుంది. దీంతో ఆమెను చంపే ప్రయత్నాలు మొదలవుతాయి. అప్పుడే రీ ఎంట్రీ ఇస్తాడు రజని. అయితే వెతుకుతున్న తండ్రికి బదులు ఆయన ఫ్రెండ్ కనిపించడం శృతిని షాక్ కు గురి చేస్తుంది. ఇద్దరూ కలిసి వేట మొదలెడతారు. వినడానికి బాగానే ఉంది కానీ ఇదెంత వరకు నిజమో ఆగస్ట్ 14 తెలుస్తుంది.
టైం ట్రావెల్ అని ఒకరు, సై ఫై బ్యాక్ డ్రాపని ఇంకొకరు ఇలా కూలి ట్రైలర్ మీద రకరకాల డీ కోడింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ వాటిని కొట్టిపారేయడం లేదు. థియేటర్ లో చూశాక సర్ప్రైజ్ అవుతారని అంటున్నాడు. వార్ 2తో పాటు ఒకే రోజు రిలీజవుతున్న కూలి అంచనాలు అంతకంతా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రీమియర్లతో మిలియన్ మార్క్ దాటేసిన రజనీకాంత్ అసలు డేట్ వచ్చెలోపు డబుల్ మిలియన్ లాక్ చేసేలా ఉన్నారు. రిలీజ్ కు ఇంకో ఎనిమిది రోజులే ఉన్న నేపథ్యంలో తలైవర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ అంతకంతా పెరిగిపోతోంది. భారీ ఓపెనింగ్స్ కి రంగం సిద్ధమయ్యింది.
This post was last modified on August 6, 2025 1:11 pm
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…