తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్ల నుంచి సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నప్పటికీ సూర్య నటుడిగా మాత్రం ఎప్పుడూ ఫెయిలవలేదు. అందుకే తన ఫాలోయింగ్ ఇంకా చెక్కు చెదరలేదు. సూర్యను ప్రేక్షకులు ఎంతో ఇష్టపడడానికి వ్యక్తిగతంగా తనకున్న మంచి పేరు కూడా ఒక కారణం. సామాజిక సమస్యల మీద గళం విప్పుడతాడు. ప్రకృతి విపత్తులు వచ్చినపుడు, వేరే సందర్భాల్లో బాధితులకు ఉదారంగా సాయం చేయడానికి ముందుకు వస్తాడు.
ఇవన్నీ ఒకెత్తయితే.. అగరం అనే ఫౌండేషన్ నెలకొల్పి అతను చేస్తున్న సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే.
మనుషుల జీవితాలను మార్చే అతి పెద్ద ఆయుధం చదువే అని బలంగా నమ్మే సూర్య.. ఈ ఫౌండేషన్ ద్వారా వందల మందిని చదివిస్తున్నాడు. పేదలు, అనాథలను ఎంపిక చేసి వారికి కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు సూర్య. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది సూర్య కుటుంబం. అగరం ఫౌండేషన్ నడిపే స్కూల్ కోసం తమ ఇంటినే ఇచ్చేసిన ఔన్నత్యం సూర్య ఫ్యామిలీది.
తాజాగా ఈ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమం సూర్య గొప్పదనాన్ని ప్రపంచానికి చాటింది.
ఈ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 8 వేలమంది చదువు పూర్తి చేశారట. అందులో 1800 మంది ఇంజినీర్లు ఉన్నారట. అగరం ద్వారా డాక్టర్లయిన వారి సంఖ్య 51. వీళ్లందరూ అగరం నిర్వహించిన కార్యక్రమంలో స్టేజ్ మీదికి వచ్చారు. అగరం ద్వారా తమ జీవితాలు ఎలా మారాయో వాళ్లు చెబుతుంటే.. సూర్య తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆడిటోరియంలో ఉన్న వాళ్లందరి కళ్లూ తడి అయిపోయాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సూర్య చేస్తున్న గొప్ప పనికి మరోసారి నెటిజన్లు అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి లోక నాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరైన సూర్య సేవను కొనియాడారు.
This post was last modified on August 5, 2025 11:32 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…