మహావతార నరసింహ.. పది రోజుల ముందు వరకు ఈ పేరుతో ఓ సినిమా రిలీజవుతున్నట్లే ప్రేక్షకులకు తెలియదు. కన్నడలో అశ్విన్ కుమార్ అనే దర్శకుడు యానిమేషన్లో రూపొందించిన చిత్రమిది. తెలుగులో కల్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న భక్తప్రహ్లాద కథనే యానిమేషన్లో తెరకెక్కించారు. పెద్దగా ప్రమోషన్ కూడా చేయకుండా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు మేకర్స్. కానీ తొలి రోజు చూసిన వాళ్లందరూ సినిమాను కొనియాడడం.. రివ్యూలు కూడా బాగుండడంతో సాయంత్రానికే లెక్కలు మారిపోయాయి.
టికెట్ల ధరలు అందుబాటులో ఉండడం.. పిల్లలకు నచ్చే సినిమా కావడంతో ఫ్యామిలీస్ ఈ సినిమాను చూడడం మొదలుపెట్టాయి. ఇక అక్కడ్నుంచి థియేటర్లు, షోలు పెరుగుతూ పోయాయి. దాంతో పాటే వసూళ్లు కూడా ఊహించని స్థాయిలో రావడం మొదలైంది. తొలి వీకెండ్లో హౌస్ ఫుల్స్తో రన్ అయిన సినిమా.. వీక్ డేస్లో కూడా బలంగానే నిలబడింది. కన్నడ, తెలుగు, హిందీ.. ఈ మూడు భాషల్లోనూ సినిమాకు అనూహ్యమైన స్పందన వచ్చింది.
రెండో వీకెండ్లోనూ ‘మహావతార నరసింహ’ అదరగొడుతోంది. శుక్రవారం ఈ చిత్రానికి ఇండియా వైడ్ రూ.7 కోట్ల వసూళ్లు రావడం విశేషం. ఇక శనివారం అయితే కలెక్షన్లు ఇంకా పెరిగి రూ.10 కోట్ల మార్కుకు చేరువయ్యాయి. రిలీజ్ రోజు ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో వచ్చిన వసూళ్లు రూ.2 కోట్లు మాత్రమే. కానీ పదో రోజు అంతకు ఐదు రెట్లు ఎక్కువగా కలెక్షన్లు రావడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటికే ఈ చిత్రం రూ.70 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ రోజుతో పోలిస్తే రెండో వీకెండ్లో థియేటర్ల సంఖ్య నాలుగైదు రెట్లు అయింది. ఈ వీకెండ్లో ‘కింగ్డమ్’ లాంటి క్రేజీ మూవీ రిలీజైనా.. దానికి దీటుగా నిలుస్తోంది ‘మహావతార నరసింహ’.
హిందీలో అజయ్ దేవగణ్ సినిమా ‘సన్నాఫ్ సర్దార్-2’ను మించి కలెక్షన్లు రాబడుతోంది. ఒక యానిమేషన్ సినిమా ఈ స్థాయిలో సంచలనం రేపడం అద్భుతం అనే చెప్పాలి. సిన్సియర్గా ఓ మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎలా దాన్ని తమ భుజాల మీద మోస్తారో చెప్పడానికి ఇది రుజువు.
This post was last modified on August 3, 2025 9:38 am
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…