Movie News

మోహన్ బాబుపై ఆరేళ్ల కేసు కొట్టివేత

టాలీవుడ్ లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణుల మీద ఆరేళ్ల కిందట నమోదైన కేసులో వారికి ఊరట లభించింది. ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల కోసం ధర్నా చేసినందుకు వారిపై నమోదైన కేసును కొట్టి వేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఈ ఏడాది జనవరి 2న ఇచ్చిన హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చంద్రబాబు సర్కారు అధికారంలో ఉండగా.. 2019 మార్చి 22న తమ సిబ్బంది, విద్యార్థులతో కలిసి మోహన్ బాబు, విష్ణు తిరుపతిలో రోడ్డుపై ర్యాలీ చేయడం, బైఠాయించడం చర్చనీయాంశంగా మారింది. 

ఈ ర్యాలీ, ధర్నా వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని.. ప్రజలకు ఇబ్బంది తలెత్తిందని మోహన్ బాబు, విష్ణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ వారిపై అభియోగాలు మోపారు. తర్వాత ఆ ఎన్నికల్లో మోహన్ బాబు, విష్ణు మద్దతుగా నిలిచిన వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసు ముందుకు కదల్లేదు. ఐతే పెండింగ్‌లో ఉన్న ఆ కేసు ప్రభుత్వం మారాక మళ్లీ వేగం అందుకుంది. తమపై పోలీసులు తప్పుడు అభియోగాలు నమోదు చేశారని.. ఎన్నికల కోడ్ తమకు వర్తించకపోయినా తమపై కేసు పెట్టినందున దీన్ని కొట్టి వేయాలని మోహన్ బాబు, విష్ణు హైకోర్టును ఆశ్రయించారు. 

ఐతే వీరి క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో వీళ్లిద్దరూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్నాక సుప్రీం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 2019 మార్చి 23న చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌‌ను కొట్టి వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఎఫ్ఐఆర్, ఛార్జ్‌షీట్‌లను కలిపి చదివిన తర్వాత అందులో పేర్కొన్న సెక్షన్లు వీరికి ఎలా వర్తిస్తాయో అర్థం కాలేదని.. వాళ్లిద్దరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు కానీ, ప్రజలకు హాని తలపెట్టినట్లు కానీ ఆధారాలు చూపలేకపోయారని సుప్రీం కోర్టు పేర్కొంది.

This post was last modified on August 1, 2025 10:44 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

4 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

6 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

9 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

10 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

11 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

11 hours ago