గత కొన్నేళ్లలో సౌత్ ఇండియా మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన పాట అంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ జైలర్లోని హుకుం సాంగ్ అనే చెప్పాలి. ఈ పాట ఇలా రిలీజైందో లేదో.. అలా పెద్ద హిట్ అయిపోయింది. సోషల్ మీడియాను ఆ పాట ఒక ఊపు ఊపేసింది. ఇక థియేటర్లలోనూ రజినీ అభిమానులకు మామూలు హై ఇవ్వలేదు ఆ పాట. ఒక మాస్ సినిమాలో హీరో ఎలివేషన్ సాంగ్ అంటే ఇలా ఉండాలి అని దీన్ని అందరూ రెఫరెన్సుగా తీసుకున్నారు తర్వాతి రోజుల్లో.
ఈ పాటకు స్వయంగా రజినీ ఎంతో ఇంప్రెస్ అయి.. జైలర్ ఆడియో లాంచ్ ఈవెంట్లో తన మేనల్లుడే అయిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్కు ముద్దు కూడా పెట్టాడు. ఐతే దీన్ని మించిన పాటను అనిరుధ్ ఇవ్వలేడని రజినీ అనుకున్నాడట. అదే మాట అనిరుధ్తో కూడా చెప్పాడట. కానీ కూలీ కోసం అనిరుధ్ కంపోజ్ చేసిన పవర్ హౌస్ పాట విన్నాక రజినీ తన అభిప్రాయం మార్చుకున్నాడట. ఈ సాంగ్.. హుకుం పాటను మించిపోయిందని రజినీ కితాబు ఇచ్చినట్లు అనిరుధ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఇక కూలీ సినిమా ఔట్ పుట్ గురించి అనిరుధ్ మాట్లాడుతూ.. తాను ఈ చిత్రం గురించి హైప్ చేయనని అంటూనే బాగా హైప్ వచ్చే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా మొత్తం చూశానని.. ఇందులో మాస్ మామెంట్స్ మామూలుగా ఉండవని చెప్పాడు. లోకేష్ కనకరాజ్ బెస్ట్ మాస్ మూవీగా దీన్ని పేర్కొన్నాడు అనిరుధ్. రజినీ మార్కు మాస్ ఉన్నప్పటికీ.. ఆయన లోకేష్ ప్రపంచంలోకి వచ్చి నటించాడని అనిరుధ్ చెప్పాడు.
ఇక తన వర్కింగ్ స్టైల్ గురించి అనిరుధ్ మాట్లాడుతూ.. తాను రోజూ మధ్యాహ్నం నిద్ర లేస్తానని, తర్వాత తన కుటుంబ సభ్యులతో సమయం గడుపుతానని.. సాయంత్రం తన స్టూడియోలో అడుగు పెట్టి పాటల కంపోజింగ్ మొదలుపెడతానని అనిరుధ్ తెలిపాడు. తన టీంలో మొత్తం ఎనిమిది మంది ఉంటారని.. ఆ ఎనిమిది మందిలో ఒక్కరు పాట బాగా లేదన్నా దాన్ని పక్కన పడేసి తర్వాతి కంపోజిషన్ మీదికి వెళ్లిపోతామని అనిరుధ్ తెలిపాడు.
This post was last modified on August 1, 2025 7:55 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…