అప్పుడప్పుడు కొందరు ఫిలిం సెలబ్రెటీలకు ఉన్న బయట ఇమేజ్కు భిన్నంగా కొన్ని ఆరోపణలు వస్తుంటాయి. వాటిని జనం నమ్మకపోయినా .. ఆ ఆరోపణలు సదరు వ్యక్తులను డిస్టర్బ్ చేస్తాయి. ‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా అమ్మాయిలు గళం విప్పడం మొదలైంది. కానీ దీన్ని తమకు అనుకూలంగా వాడుకుని కొందరి మీద బురదజల్లే వాళ్లూ తయారయ్యారు.
శేఖర్ కమ్ముల లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి మీద కూడా శ్రీరెడ్డి నిరాధారంగా ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. శేఖర్ తీవ్రంగా స్పందించేసరికి తర్వాత ఆమె సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు విజయ్ సేతుపతి మీద కూడా ఇలాగే రమ్య అనే మహిళ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. తన స్నేహితురాలు సేతుపతి వల్ల ఇబ్బంది పడిందంటూ ఒక మహిళ సోషల్ మీడియా పోస్టు పెట్టి డెలీట్ చేయడం సంచలనం రేపింది.
కోలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ బాగా ఎక్కువగా ఉందని.. దీని వల్ల తన స్నేహితురాలు ఇబ్బంది పడిందని.. విజయ్ సేతుపతి ఆమెను ఇబ్బంది పెట్టాడని.. దీంతో తన ఫ్రెండు డిప్రెషన్కు గురైందని రమ్య అనే మహిళ పోస్ట్ పెట్టింది. ఐతే ఈ పోస్టు మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి దాన్ని ఆమె డెలీట్ చేసింది. ఈ నేపథ్యంలో సేతుపతి సైతం స్పందించాడు. తనను ఎన్నో ఏళ్లుగా చూస్తున్న వాళ్లంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారని.. తనేంటో తనకు, చుట్టూ ఉన్న వాళ్లకు తెలుసని సేతుపతి వ్యాఖ్యానించాడు.
ఇలాంటి తప్పుడు ఆరోపణలు తనను బాధ పెట్టలేవని.. కానీ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రం బాధ పడ్డారని అతను చెప్పాడు. ఆమె ఫేమస్ కావడం కోసమే ఇలా చేస్తోందని.. కొన్ని నిమిషాల పాటు తను హైలైట్ అవుతుందని.. తనను ఎంజాయ్ చేయనివ్వాలని వాళ్లందరికీ చెప్పానని సేతుపతి తెలిపాడు. తన మీద పోస్టు పెట్టిన మహిళ మీద సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసినట్లు కూడా సేతుపతి వెల్లడించాడు. తన పోస్ట్ వివాదాస్పదమయ్యేసరికి.. ఏదో కోపంలోనే అలా పోస్ట్ చేశానని.. అదంత వైరల్ అవుతుందని అనుకోలేదని రమ్య తర్వాత మరో పోస్టులో వివరణ ఇచ్చింది.
This post was last modified on July 31, 2025 3:33 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…