Movie News

హనీమూన్ మర్డర్ మీద సినిమా

రెండు నెలల కిందట మేఘాలయలో జరిగిన హనీమూన్ హత్య ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రఘువంశీ అనే కొత్త పెళ్లికొడుకు మేఘాలయాలో హనీమూన్ కోసం వెళ్లి హత్యకు గురయ్యాడు. దీని వెనుక ఉన్నది భార్య, ఆమె ప్రియుడే అని వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఈ హత్యోదంతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడీ ఉదంతం మీద సినిమా రాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. 

ఇందుకు హతుడు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలిపారు. ‘హనీమూన్ ఇన్ షిల్లాంగ్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. తన సోదరుడి మృతి మీద సినిమా తీస్తే ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది ప్రజలు తెలుసుకుంటారని రఘువంశీ సోదరుడు సచిన్ మీడియాకు తెలిపాడు. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయని.. 80 శాతం రాజా రఘువంశీ స్వస్థలం ఇండోర్‌లో, మిగతా 20 శాతం హత్య జరిగిన మేఘాలయాలో తీస్తామని.. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు ఆగాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీస్తున్నామని దర్శకుడు వెల్లడించాడు.

ఇండోర్‌లో ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేసే కుటుంబానికి చెందిన రఘువంశీ.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. తన భార్య సోనమ్‌తో కలిసి కొన్ని రోజుల తర్వాత అతను మేఘాలయకు హనీమూన్ కోసమని వెళ్లాడు. రెండు రోజులకే అతను అక్కడ హత్యకు గురయ్యాడు. తనతో పాటు భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని.. తర్వాత అతణ్ని చంపేశారని.. తనను మాత్రం వదిలేశారని సోనమ్ ముందు వాంగ్మూలం ఇచ్చింది. కానీ పోలీసులు లోతుగా విచారిస్తే.. తన ప్రియుడు, కొందరు సుపారీ కిల్లర్ల సాయంతో సోనమే.. భర్తను హత్య చేయించినట్లు వెల్లడైంది. 

స్వయంగా సోనమ్ సోదరుడే తన చెల్లే భర్తను చంపించిందని.. ఆమెను ఉరి తీయాలని పేర్కొనడంతో జనాలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మేఘాలయలోని కామాఖ్య అనే ఆలయంలో తనకు మొక్కు ఉందని.. అక్కడ పూజలు చేశాకే తనను తాకనిస్తానని భర్తకు షరతు పెట్టిన సోనమ్.. మొక్కు తీర్చుకునే నెపంతో ఆ ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ ప్రియుడు, సుపారీ కిల్లర్లకు అతణ్ని అప్పగించిందని.. వాళ్లు హత్య చేస్తుంటే దగ్గరుండి చూసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.

This post was last modified on July 30, 2025 2:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

2 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

2 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

4 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

4 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

5 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

5 hours ago