మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర ఆగస్ట్ 27 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు కొన్ని వారాల క్రితమే అధికారిక ప్రకటన ఇచ్చారు. నిజానికి ఇది ఏప్రిల్ లో రావాల్సిన సినిమా. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఒకసారి కాంపిటీషన్, మరోసారి శ్రీలీల డేట్లు అందుబాటులో లేకపోవడం, ఇంకోసారి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కావడం ఇలా రకరకాల అడ్డంకులు ఎదురయ్యాయి. ఇటీవలే రవితేజ తండ్రి కాలం చేయడంతో మరోసారి విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఊహించని విషాదం కావడంతో మాస్ రాజా సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. పైగా శ్రీలీల కాల్ షీట్లు లేవట.
చేతిలో చూస్తేనేమో నెల రోజులు కూడా టైం లేదు. ఈలోగా ఫస్ట్ కాపీ సిద్ధం చేసి, రీ రికార్డింగ్, సెన్సార్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్, ప్రమోషన్ వగైరా సవాలక్ష పనులన్నీ చూసుకోవాలి. ఇది తీవ్ర ఒత్తిడికి దారి తీస్తుంది. అసలే సితార బృందం కింగ్డమ్ హడావిడిలో ఉంది. ఓ వారం దాకా దాని వ్యవహారాలు కొనసాగుతాయి. అటుపై నాగవంశీ వార్ 2 తాలూకు డిస్ట్రిబ్యూషన్, థియేటర్ రిలీజ్ వ్యవహారాల మీద దృష్టిపెట్టాలి. పెద్ద మొత్తం కాబట్టి ఆషామాషీగా వేరొకరికి అప్పజెప్పలేరు. ఇంత టైట్ షెడ్యూల్ లో మాస్ జాతర మీద ఫోకస్ పెట్టడం సులభం కాదు. అందుకే ప్రెజర్ తీసుకోకూడదని అనుకుంటున్నారట.
అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం దసరాకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఓజి, అఖండ 2, కాంతార 2తో పండగ సీజన్ ఆల్రెడీ ప్యాక్ అయ్యి ఉంది. ఎవరైనా తప్పుకుంటే అప్పుడో స్లాట్ తీసుకోవచ్చు. కానీ అంత సులభంగా జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుతమైతే ఆగస్ట్ 27 టార్గెట్ గానే మాస్ జాతర పనులు జరుగుతున్నాయి కానీ మాట మీద ఉండే సూచనలు తగ్గుతున్నాయి. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. ఇడియట్ స్టైల్ లో వచ్చిన ఒక పాట ఆల్రెడీ హిట్టయ్యింది.
This post was last modified on July 30, 2025 1:55 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…