ఆగస్ట్ 14 బాక్సాఫీస్ వద్ద పరస్పరం తలపడే వార్ 2, కూలి పోటీ గురించి ఫ్యాన్స్ నుంచి సాధారణ ప్రేక్షకుల దాకా ప్రతి చోటా చర్చ జరుగుతూనే ఉంది. ఎవరిది పైచేయి అవుతుందనే దాని మీద ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు విశ్లేషణలు చేసుకుంటున్నారు. అందరూ కంటెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు కానీ మ్యూజిక్ కి సంబంధించిన డిస్కషన్ అంతగా కనిపించలేదు. ఎందుకంటే కూలికి బక్కోడు (అనిరుధ్ ముద్దుపేరు) ఇచ్చిన పాటలు జనాలకు ఓ రేంజ్ లో ఎక్కేశాయి. మౌనికా మౌనికా, పవర్ హౌస్ ఒకదాన్ని మించి మరొకటి ఫాస్ట్ గా రీచైపోయాయి. ఇప్పుడు వార్ 2 వంతు వచ్చేస్తోంది.
ఎల్లుండి మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేయబోతున్నారు. హృతిక్ రోషన్, కియారా అద్వానీ మీద షూట్ చేసిన అవాన్ జవాన్ ని ప్రీతం కంపోజ్ చేశాడు. ఇది ఫస్ట్ పాట కాబట్టి ఖచ్చితంగా పోలికలు వస్తాయి. నిజానికి ప్రీతమ్ ఇప్పటివాడు కాదు. సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్లకు పని చేశాడు. ధూమ్, రేస్, భూల్ భులాయ్యా, బర్ఫీ, భజరంగి భాయ్ జాన్ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. అయితే ఒక కంప్లీట్ ఆల్బమ్ చార్ట్ బస్టర్ ఇచ్చి కొన్నేళ్ళయింది. ఒకటి రెండు పాటలు మంచివి ఇవ్వడం తప్ప పదే పదే వినాలనిపించే స్థాయిలో ఈ మధ్య తన కంపోజింగ్స్ లేవు.
సో ఇప్పుడు వార్ 2 రూపంలో ఒక మెగా ఛాన్స్ దక్కింది. దీంతో కనక ప్రూవ్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇష్టుడైపోతాడు. అందులోనూ కూలికి ధీటుగా పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్లిక్ అవ్వాలి. మాములుగా నార్త్ ఆడియన్స్ కి తన స్టైల్ అలవాటే కాబట్టి తొందరగా కనెక్ట్ అయిపోతారు కానీ మన ప్రేక్షకులకు అలా కుదరదు. ప్రీతమ్ ప్రత్యేకంగా తెలుగు ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్ ఇచ్చి ఉంటాడని అనుకోలేం కానీ ధూమ్ రేంజ్ లో బీజీఎమ్ ఇస్తే చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాకపోతే అనిరుధ్ తాకిడిని తట్టుకోవడం అంత సులభం అయితే కాదు.
This post was last modified on July 29, 2025 9:23 pm
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…