ఈ మధ్య టాలీవుడ్ లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ పెరుగుతున్నాయి. తమిళంతో పోలిస్తే మన దగ్గర తక్కువే కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి వాళ్ళు ఓవర్సీస్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పేరు, ఆదాయం వచ్చే అవకాశం కావడంతో క్రమంగా వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఇటీవలే అనిరుద్ రవిచందర్ చెన్నైలో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తే టికెట్ల కోసం ఒత్తిడి తట్టుకోలేక ఏకంగా వేదికను మార్చి మరో డేట్ ఎంచుకోవాల్సి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే నవంబర్ 8 హైదరాబాద్ లో ఏఆర్ రెహమాన్ ఒక ఈవెంట్ చేయబోతున్నారు.
ఇంకేం మ్యూజిక్ లెజెండ్ ని దగ్గర నుంచి చూడొచ్చని అనుకుంటున్నారా. కాకపోతే పర్సులు కొంచెం ప్రియంగా మారిపోతాయి. ఎందుకంటే టికెట్ రేట్లు చాలా ప్రీమియం గా ఉన్నాయి. గంటల తరబడి నిలుచుని చూడాలన్నా కనిష్టంగా 1800 రూపాయలు చెల్లించాల్సిందే. ఇది గోల్డ్ క్లాస్. లేదు కొంచెం మెరుగ్గా కావాలంటే ప్లాటినం 4 వేలు, ఎంఐపి 13 వేలు జంట టికెట్ కు కట్టాలి. లేదూ సౌకర్యం ఎక్కువగా కావాలంటే ఇద్దరికీ కలిపి 24 వేలు సమర్పించుకుంటే ఫేజ్ 3లో దగ్గర నుంచి చూడొచ్చు. ఫ్యాన్ పిట్ అని మరో రెండు సెక్షన్లున్నాయి. వీటిలో ఐదున్నర వేలు, పది వేలు టికెట్ రేట్లు. ఇవి కూడా స్టాండింగ్ సెక్షన్లే.
మూడు నెలల తర్వాత జరిగే ఈవెంట్ కి ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మన సీట్లు రిజర్వ్ అవుతాయి. ఏడేళ్ల క్రితం ఇదే హైదరాబాద్ లో రెహమాన్ కన్సర్ట్ చేసినప్పుడు, అంతకు ముందు ఇళయరాజా నిర్వహించినప్పుడు కూడా ఇంత భారీ రేట్లు లేవనేది సంగీత ప్రియుల కామెంట్. అయినా సరే ఇంత పెట్టి వెళ్ళేవాళ్ళు లేకపోలేదు. రోజా నుంచి ధగ్ లైఫ్ దాకా ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ తో బ్లాక్ బస్టర్స్ కు ప్రాణం పోసిన రెహమాన్ నెక్స్ట్ రామ్ చరణ్ పెద్దికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ నవంబర్ ఈవెంట్ లో దీన్నుంచి ఏదైనా సాంగ్ అభిమానుల కోసం ఎక్స్ క్లూజివ్ గా పాడతారేమో వేచి చూడాలి.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…