Movie News

రెహమాన్ దర్శనం చాలా ఖరీదు గురూ

ఈ మధ్య టాలీవుడ్ లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ పెరుగుతున్నాయి. తమిళంతో పోలిస్తే మన దగ్గర తక్కువే కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి వాళ్ళు ఓవర్సీస్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పేరు, ఆదాయం వచ్చే అవకాశం కావడంతో క్రమంగా వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఇటీవలే అనిరుద్ రవిచందర్ చెన్నైలో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తే టికెట్ల కోసం ఒత్తిడి తట్టుకోలేక ఏకంగా వేదికను మార్చి మరో డేట్ ఎంచుకోవాల్సి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే నవంబర్ 8 హైదరాబాద్ లో ఏఆర్ రెహమాన్ ఒక ఈవెంట్ చేయబోతున్నారు.

ఇంకేం మ్యూజిక్ లెజెండ్ ని దగ్గర నుంచి చూడొచ్చని అనుకుంటున్నారా. కాకపోతే పర్సులు కొంచెం ప్రియంగా మారిపోతాయి. ఎందుకంటే టికెట్ రేట్లు చాలా ప్రీమియం గా ఉన్నాయి. గంటల తరబడి నిలుచుని చూడాలన్నా కనిష్టంగా 1800 రూపాయలు చెల్లించాల్సిందే. ఇది గోల్డ్ క్లాస్. లేదు కొంచెం మెరుగ్గా కావాలంటే ప్లాటినం 4 వేలు, ఎంఐపి 13 వేలు జంట టికెట్ కు కట్టాలి. లేదూ సౌకర్యం ఎక్కువగా కావాలంటే ఇద్దరికీ కలిపి 24 వేలు సమర్పించుకుంటే ఫేజ్ 3లో దగ్గర నుంచి చూడొచ్చు. ఫ్యాన్ పిట్ అని మరో రెండు సెక్షన్లున్నాయి. వీటిలో ఐదున్నర వేలు, పది వేలు టికెట్ రేట్లు. ఇవి కూడా స్టాండింగ్ సెక్షన్లే.

మూడు నెలల తర్వాత జరిగే ఈవెంట్ కి ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మన సీట్లు రిజర్వ్ అవుతాయి. ఏడేళ్ల క్రితం ఇదే హైదరాబాద్ లో రెహమాన్ కన్సర్ట్ చేసినప్పుడు, అంతకు ముందు ఇళయరాజా నిర్వహించినప్పుడు కూడా ఇంత భారీ రేట్లు లేవనేది సంగీత ప్రియుల కామెంట్. అయినా సరే ఇంత పెట్టి వెళ్ళేవాళ్ళు లేకపోలేదు. రోజా నుంచి ధగ్ లైఫ్ దాకా ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ తో బ్లాక్ బస్టర్స్ కు ప్రాణం పోసిన రెహమాన్ నెక్స్ట్ రామ్ చరణ్ పెద్దికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ నవంబర్ ఈవెంట్ లో దీన్నుంచి ఏదైనా సాంగ్ అభిమానుల కోసం ఎక్స్ క్లూజివ్ గా పాడతారేమో వేచి చూడాలి.

This post was last modified on July 29, 2025 6:57 pm

Share
Show comments
Published by
Kumar
Tags: AR Rahman

Recent Posts

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

6 minutes ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

43 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

2 hours ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 hours ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago