ఈ మధ్య టాలీవుడ్ లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ పెరుగుతున్నాయి. తమిళంతో పోలిస్తే మన దగ్గర తక్కువే కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి వాళ్ళు ఓవర్సీస్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పేరు, ఆదాయం వచ్చే అవకాశం కావడంతో క్రమంగా వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఇటీవలే అనిరుద్ రవిచందర్ చెన్నైలో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తే టికెట్ల కోసం ఒత్తిడి తట్టుకోలేక ఏకంగా వేదికను మార్చి మరో డేట్ ఎంచుకోవాల్సి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే నవంబర్ 8 హైదరాబాద్ లో ఏఆర్ రెహమాన్ ఒక ఈవెంట్ చేయబోతున్నారు.
ఇంకేం మ్యూజిక్ లెజెండ్ ని దగ్గర నుంచి చూడొచ్చని అనుకుంటున్నారా. కాకపోతే పర్సులు కొంచెం ప్రియంగా మారిపోతాయి. ఎందుకంటే టికెట్ రేట్లు చాలా ప్రీమియం గా ఉన్నాయి. గంటల తరబడి నిలుచుని చూడాలన్నా కనిష్టంగా 1800 రూపాయలు చెల్లించాల్సిందే. ఇది గోల్డ్ క్లాస్. లేదు కొంచెం మెరుగ్గా కావాలంటే ప్లాటినం 4 వేలు, ఎంఐపి 13 వేలు జంట టికెట్ కు కట్టాలి. లేదూ సౌకర్యం ఎక్కువగా కావాలంటే ఇద్దరికీ కలిపి 24 వేలు సమర్పించుకుంటే ఫేజ్ 3లో దగ్గర నుంచి చూడొచ్చు. ఫ్యాన్ పిట్ అని మరో రెండు సెక్షన్లున్నాయి. వీటిలో ఐదున్నర వేలు, పది వేలు టికెట్ రేట్లు. ఇవి కూడా స్టాండింగ్ సెక్షన్లే.
మూడు నెలల తర్వాత జరిగే ఈవెంట్ కి ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మన సీట్లు రిజర్వ్ అవుతాయి. ఏడేళ్ల క్రితం ఇదే హైదరాబాద్ లో రెహమాన్ కన్సర్ట్ చేసినప్పుడు, అంతకు ముందు ఇళయరాజా నిర్వహించినప్పుడు కూడా ఇంత భారీ రేట్లు లేవనేది సంగీత ప్రియుల కామెంట్. అయినా సరే ఇంత పెట్టి వెళ్ళేవాళ్ళు లేకపోలేదు. రోజా నుంచి ధగ్ లైఫ్ దాకా ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ తో బ్లాక్ బస్టర్స్ కు ప్రాణం పోసిన రెహమాన్ నెక్స్ట్ రామ్ చరణ్ పెద్దికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ నవంబర్ ఈవెంట్ లో దీన్నుంచి ఏదైనా సాంగ్ అభిమానుల కోసం ఎక్స్ క్లూజివ్ గా పాడతారేమో వేచి చూడాలి.
This post was last modified on July 29, 2025 6:57 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…