టాలీవుడ్లో ముందుతరం నిర్మాతల్లో చాలామంది ప్రొడక్షన్ ఆపేశారు. సురేష్ బాబు లాంటి వాళ్లు ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంటూ సినిమాలు తీస్తున్నదంటే అల్లు అరవింద్, అశ్వినీదత్ మాత్రమే. మధ్యలో దత్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు కానీ.. సమయానికి కూతుళ్లు పగ్గాలు అందుకుని ఆయన్ని నిలబెట్టారు. ఐతే ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉంటూ ప్రొడక్షన్లో సూపర్ సక్సెస్ఫుల్గా సాగిపోతున్న సీనియర్ ప్రొడ్యూసర్ అంటే.. అల్లు అరవింద్ అనే చెప్పాలి. గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి వచ్చే సినిమాలు చాలా వరకు సక్సెస్ ఫుల్గానే రన్ అవుతుంటాయి. అదే సమయంలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు కూడా మంచి ఫలితాన్ని అందుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా అనువాద చిత్రాలతో ఆయన జాక్ పాట్ కొడుతుంటారు.
గత కొన్నేళ్లలో కాంతార, 2018 సహా పలు చిత్రాలను రిలీజ్ చేసి మంచి ఫలితాలను అందుకున్నారు. ఇప్పుడు గీతా సంస్థకు ‘మహావతార నరసింహ’ రూపంలో మరో జాక్పాట్ తగిలింది. కన్నడలో రూపొందిన యానిమేషన్ మూవీ ‘మహావతార నరసింహ’ను తెలుగులో ‘హరిహర వీరమల్లు’ లాంటి భారీ చిత్రానికి పోటీగా రిలీజ్ చేస్తుంటే ఎవ్వరూ పట్టించుకోలేదు.
కానీ ఈ సినిమా తొలి రోజు మంచి టాక్ తెచ్చుకుని సాయంత్రానికి మంచి ఆక్యుపెన్సీలతో నడిచింది. రెండో రోజు నుంచి స్క్రీన్ కౌంట్ పెరుగుతూ పోతోంది. శని, ఆదివారాల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. సోమవారం కూడా సినిమా స్ట్రాంగ్గా నిలబడే సంకేతాలు కనిపిస్తున్నాయి. తక్కువ రేటుకే తెలుగు హక్కులు తీసుకున్న గీతా సంస్థ ఈ చిత్రం ద్వారా భారీ లాభాలే ఆర్జించేలా కనిపిస్తోంది. రిలీజ్కు ముందు ఇలాంటి సినిమాల మీద ఒక అంచనాతో హక్కులు కొనడంలోనే అల్లు అరవింద్ అండ్ టీం తెలివి దాగి ఉంది. ఒక యానిమేషన్ మూవీ ఇలాంటి అద్భుతాలు చేస్తుందని ఊహించడం కష్టం. ఐతే ఇది తెలుగులో సక్సెస్ అవుతుందని అరవింద్ బృందం గెస్ చేసి రిలీజ్ చేయడం ద్వారా ఇప్పుడు పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభాలను అందుకుంటోంది.
This post was last modified on July 28, 2025 2:45 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…