హరిహర వీరమల్లు విషయంలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటిది విఎఫ్ఎక్స్ మీద వచ్చిన కంప్లయింట్స్ దృష్టిలో ఉంచుకుని వాటిని సరిచేయడమే కాక సెకండాఫ్ నిడివిని కొంత భాగం తగ్గించడం. ఆదివారం షోల నుంచే ఇవి అందుబాటులోకి వచ్చాయి. అయితే మొదటి మూడు రోజులు వచ్చిన టాక్ ని ఇవి అమాంతం మార్చకపోవచ్చు కానీ కొంత సానుకూల ప్రభావం చూపించే ఛాన్స్ లేకపోలేదు. ముఖ్యంగా టికెట్ రేట్లకు దెబ్బకు దూరంగా ఉన్న సాధారణ ప్రేక్షకులకు కొంచెం కొత్త అనుభూతి కలిగించే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యూనిట్ దీని మీదే ఆశలు పెట్టుకుంది.
మరో ముఖ్యమైన విషయం సోమవారం నుంచి ఏపీ తెలంగాణలో చాలా సెంటర్లలో టికెట్ రేట్లను సాధారణ స్థితికి తీసుకొస్తున్నారట. కొన్ని చోట్ల 50 నుంచి 100 రూపాయలు తగ్గించనుండగా, మరికొన్ని చోట్ల గతంలో ఉన్న రెగ్యులర్ ధరలే పెట్టబోతున్నారు. ఇది చాలా సానుకూలాంశం. గురువారం విజయ్ దేవరకొండ కింగ్డమ్ విడుదలవుతున్న నేపథ్యంలో వీరమల్లుకి వీక్ డేస్ కీలకం కాబోతున్నాయి. డ్రాప్ మరీ తీవ్రంగా ఉంటే కష్టమవుతుంది కానీ పికప్ ఉంటే టెన్షన్ అక్కర్లేదు. ప్రస్తుతం సిచువేషన్ చూస్తుంటే వీకెండ్స్ బాగానే అనిపిస్తున్నా అసలైన అగ్ని పరీక్ష రేపటి నుంచి మొదలు కానుంది.
అసలు ఊహించని షాక్ మహావతార్ నరసింహ రూపంలో ఎదురయ్యింది. యానిమేషన్ మూవీ కదాని తేలిగ్గా తీసుకున్న వాళ్లకు దీని బాక్సాఫీస్ కలెక్షన్లు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో సండే ఒక్క టికెట్ దొరకని సిచుయేషన్ నెలకొనడం చిన్న విషయం కాదు. 160 షోలు వేస్తే అన్నీ ఫుల్ కావడం గమనార్హం. ఫామిలీస్ దీనికి ప్రాధాన్యం ఇవ్వడం హరిహర వీరమల్లుకు ప్రతిబంధకంగా మారింది. ఒకవేళ యునానిమస్ టాక్ వచ్చి ఉంటే ఎలా ఉండేదో కానీ మిక్స్డ్ రియాక్షన్ల వల్ల పవన్ కళ్యాణ్ మేజిక్ పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. వీకెండ్ ఫిగర్స్ చూశాక ఫైనల్ రన్ ఎలా ఉండబోతోందనే క్లారిటీ రావొచ్చు.
This post was last modified on July 27, 2025 8:51 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…