పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు. ఆయన సినిమాలు హిందీలోకి కూడా చాలానే డబ్ అయ్యాయి. అక్కడి ప్రేక్షకులకు పవన్ పవరేంటో చూపించాయి. కానీ పవన్ హీరోగా తెరకెక్కిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను హిందీలో కూడా అనువాదం చేసి ఒకేసారి రిలీజ్ చేస్తే అక్కడి జనాలు అస్సలు పట్టించుకోలేదు. సినిమా బాగుందా లేదా అన్నది పక్కన పెడితే దానికి మినిమం ఓపెనింగ్స్ రాలేదు. డబ్బింగ్ ఖర్చులు కూడా వెనక్కి తేలేకపోయిందా సినిమా.
ఇలా హిందీలో టాలీవుడ్ స్టార్లు చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొన్ని సినిమాలకు మాత్రమే పర్వాలేదనిపించే ఫలితం వచ్చింది. ఒకప్పుడైనా మన స్టార్లకు అంతో ఇంతో అక్కడ ఫాలోయింగ్ ఉండేది కానీ.. ఇప్పుడు మన చిత్రాలు అక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదు. ‘బాహుబలి’ వల్ల ప్రభాస్కు అమితమైన క్రేజ్ రావడం వేరు. మిగతా హీరోలెవ్వరూ అతడి దరిదాపుల్లోకి వెళ్లే పరిస్థితి లేదు.
ఇలాంటి తరుణంలో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డెబ్యూకు రెడీ అయిపోతుండటం అందరినీ షాక్కు గురి చేసింది. అతడి సినిమాలు హిందీలో అనువాదమై మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించి ఉండొచ్చు. ఆమాటకొస్తే మన హీరోలందరి సినిమాలకూ అక్కడ వ్యూస్ భారీగానే వస్తున్నాయి. రామ్ సైతం కోట్లల్లో వ్యూస్ కొల్లగొడుతున్నాడు. జియో పుణ్యమా అని ఇంటర్నెట్ చౌకగా మారిపోవడంతో ఖాళీ సమయాల్లో సౌత్ మాస్ మసాలా సినిమాలపై ఓ లుక్కేసే మాస్ ఫ్యాన్స్ ఉత్తరాదిన కోట్లల్లో ఉన్నారు.
ఈ లాజిక్ ఆలోచించకుండా బెల్లంకొండ శ్రీనివాస్ సాహసానికి సిద్ధమవుతున్నాడు. నిజానికి తెలుగులోనే శ్రీనివాస్ ఇంకా నిలదొక్కుకోలేదు. పెద్ద దర్శకులతో భారీ చిత్రాలు చేశాడు కానీ.. ఒక్క ‘రాక్షసుడు’ మినహా ఏదీ ‘హిట్’ అనిపించుకోలేదు. అప్పుడే బాలీవుడ్ కు రెడీ అయిపోవడం టూమచ్ అన్నది విశ్లేషకుల అభిప్రాయం.
This post was last modified on November 18, 2020 7:09 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…