పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు. ఆయన సినిమాలు హిందీలోకి కూడా చాలానే డబ్ అయ్యాయి. అక్కడి ప్రేక్షకులకు పవన్ పవరేంటో చూపించాయి. కానీ పవన్ హీరోగా తెరకెక్కిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను హిందీలో కూడా అనువాదం చేసి ఒకేసారి రిలీజ్ చేస్తే అక్కడి జనాలు అస్సలు పట్టించుకోలేదు. సినిమా బాగుందా లేదా అన్నది పక్కన పెడితే దానికి మినిమం ఓపెనింగ్స్ రాలేదు. డబ్బింగ్ ఖర్చులు కూడా వెనక్కి తేలేకపోయిందా సినిమా.
ఇలా హిందీలో టాలీవుడ్ స్టార్లు చాలామంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొన్ని సినిమాలకు మాత్రమే పర్వాలేదనిపించే ఫలితం వచ్చింది. ఒకప్పుడైనా మన స్టార్లకు అంతో ఇంతో అక్కడ ఫాలోయింగ్ ఉండేది కానీ.. ఇప్పుడు మన చిత్రాలు అక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదు. ‘బాహుబలి’ వల్ల ప్రభాస్కు అమితమైన క్రేజ్ రావడం వేరు. మిగతా హీరోలెవ్వరూ అతడి దరిదాపుల్లోకి వెళ్లే పరిస్థితి లేదు.
ఇలాంటి తరుణంలో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డెబ్యూకు రెడీ అయిపోతుండటం అందరినీ షాక్కు గురి చేసింది. అతడి సినిమాలు హిందీలో అనువాదమై మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించి ఉండొచ్చు. ఆమాటకొస్తే మన హీరోలందరి సినిమాలకూ అక్కడ వ్యూస్ భారీగానే వస్తున్నాయి. రామ్ సైతం కోట్లల్లో వ్యూస్ కొల్లగొడుతున్నాడు. జియో పుణ్యమా అని ఇంటర్నెట్ చౌకగా మారిపోవడంతో ఖాళీ సమయాల్లో సౌత్ మాస్ మసాలా సినిమాలపై ఓ లుక్కేసే మాస్ ఫ్యాన్స్ ఉత్తరాదిన కోట్లల్లో ఉన్నారు.
ఈ లాజిక్ ఆలోచించకుండా బెల్లంకొండ శ్రీనివాస్ సాహసానికి సిద్ధమవుతున్నాడు. నిజానికి తెలుగులోనే శ్రీనివాస్ ఇంకా నిలదొక్కుకోలేదు. పెద్ద దర్శకులతో భారీ చిత్రాలు చేశాడు కానీ.. ఒక్క ‘రాక్షసుడు’ మినహా ఏదీ ‘హిట్’ అనిపించుకోలేదు. అప్పుడే బాలీవుడ్ కు రెడీ అయిపోవడం టూమచ్ అన్నది విశ్లేషకుల అభిప్రాయం.
This post was last modified on November 18, 2020 7:09 pm
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఆనంద్ షా వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై గ్యాంబ్లింగ్ మాఫియా…
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…