ఈ రోజుల్లో సినీ రంగాన్ని నడిపించేదే సోషల్ మీడియా, పీఆర్ అనే అభిప్రాయం ఉంది. అది లేకుండా ఇక్కడ మనుగడ సాగించడం చాలా కష్టం అంటారు. ఐతే ఒకప్పుడు మాత్రం తనకు ఇవేవీ అవసరం లేదని భావించేదాన్నని.. కానీ చాలా లేటుగా ఇవి ఎంత అవసరమో తెలుసుకున్నానని అంటోంది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ రెజీనా కసాండ్రా. తాను ఒక దశలో సినిమాలే మానేద్దామని అనుకున్నానని.. కానీ తర్వాత తన ఆలోచన మారిందని ఆమె వెల్లడించింది. తెలుగు సినిమాల్లో నటించడం తనకు సవాలుగా మారిందని.. ఆ ఇబ్బందిని కూడా కష్టపడి అధిగమించానని ఆమె చెప్పింది.
ఒక ఇంటర్వ్యూలో రెజీనా చెప్పిన మరిన్ని విశేషాలు తన మాటల్లోనే.. ‘‘నాకు ఫిలిం బ్యాగ్రౌండ్ లేదు. ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగాను. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో సెట్కు వెళ్లడం, నటించడం, వచ్చేయడం.. ఇంతే అనుకునేదాన్ని. పీఆర్, సోషల్ మీడియా.. ఇవేవీ అవసరం లేదు అనుకునేదాన్ని. చాన్నాళ్లు వీటికి దూరంగా ఉండేదాన్ని. నా నటనను చూసి అవకాశం ఇవ్వాలి తప్ప పబ్లిసిటీ చూసి కాదు అనుకునేదాన్ని. కానీ కాలం గడిచేకొద్దీ వీటి అవసరం తెలిసి వచ్చింది.
ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే నా వర్క్ను జనాల్లోకి తీసుకెళ్తున్నాను. కెరీర్లో ఒక దశలో నాకు విసుగొచ్చింది. 2015-16 టైంలో ఇక సినిమాలు చేయాలనిపించలేదు. నటన మానేయాలనుకున్నా. చేతిలో ఉన్న సినిమలు పూర్తి చేసి ఒక కెరీర్కు ముగింపు పలకాలనుకున్నా. కానీ 2018 నుంచి మళ్లీ నాకు అవకాశాలు వరుస కట్టాయి. అక్కడ్నుంచి భిన్నమైన పాత్రల్లో నటించడం మొదలుపెట్టా. తెలుగు సినిమాల్లోకి వెళ్లిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డా. నాకు తెలుగు రాదు. ఉదయం డైలాగులు ఇచ్చేవాళ్లు. వాటిని కంఠస్థం చేసి నటించడం కష్టమయ్యేది. కానీ తర్వాతి రోజుల్లో తెలుగు నేర్చుకున్నా. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నా’’ అని రెజీనా తెలిపింది.
This post was last modified on July 23, 2025 8:01 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…