Movie News

పీఆర్ లేకుంటే కష్టం.. హీరోయిన్ తెలుసుకున్న సత్యం

ఈ రోజుల్లో సినీ రంగాన్ని నడిపించేదే సోషల్ మీడియా, పీఆర్ అనే అభిప్రాయం ఉంది. అది లేకుండా ఇక్కడ మనుగడ సాగించడం చాలా కష్టం అంటారు. ఐతే ఒకప్పుడు మాత్రం తనకు ఇవేవీ అవసరం లేదని భావించేదాన్నని.. కానీ చాలా లేటుగా ఇవి ఎంత అవసరమో తెలుసుకున్నానని అంటోంది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ రెజీనా కసాండ్రా. తాను ఒక దశలో సినిమాలే మానేద్దామని అనుకున్నానని.. కానీ తర్వాత తన ఆలోచన మారిందని ఆమె వెల్లడించింది. తెలుగు సినిమాల్లో నటించడం తనకు సవాలుగా మారిందని.. ఆ ఇబ్బందిని కూడా కష్టపడి అధిగమించానని ఆమె చెప్పింది.

ఒక ఇంటర్వ్యూలో రెజీనా చెప్పిన మరిన్ని విశేషాలు తన మాటల్లోనే.. ‘‘నాకు ఫిలిం బ్యాగ్రౌండ్ లేదు. ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగాను. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో సెట్‌కు వెళ్లడం, నటించడం, వచ్చేయడం.. ఇంతే అనుకునేదాన్ని. పీఆర్‌, సోషల్ మీడియా.. ఇవేవీ అవసరం లేదు అనుకునేదాన్ని. చాన్నాళ్లు వీటికి దూరంగా ఉండేదాన్ని. నా నటనను చూసి అవకాశం ఇవ్వాలి తప్ప పబ్లిసిటీ చూసి కాదు అనుకునేదాన్ని. కానీ కాలం గడిచేకొద్దీ వీటి అవసరం తెలిసి వచ్చింది.

ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే నా వర్క్‌ను జనాల్లోకి తీసుకెళ్తున్నాను. కెరీర్లో ఒక దశలో నాకు విసుగొచ్చింది. 2015-16 టైంలో ఇక సినిమాలు చేయాలనిపించలేదు. నటన మానేయాలనుకున్నా. చేతిలో ఉన్న సినిమలు పూర్తి చేసి ఒక కెరీర్‌‌కు ముగింపు పలకాలనుకున్నా. కానీ 2018 నుంచి మళ్లీ నాకు అవకాశాలు వరుస కట్టాయి. అక్కడ్నుంచి భిన్నమైన పాత్రల్లో నటించడం మొదలుపెట్టా. తెలుగు సినిమాల్లోకి వెళ్లిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డా. నాకు తెలుగు రాదు. ఉదయం డైలాగులు ఇచ్చేవాళ్లు. వాటిని కంఠస్థం చేసి నటించడం కష్టమయ్యేది. కానీ తర్వాతి రోజుల్లో తెలుగు నేర్చుకున్నా. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నా’’ అని రెజీనా తెలిపింది.

This post was last modified on July 23, 2025 8:01 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Regina

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

36 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

43 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago