ఈ తరంలో తెలుగులో ఉత్తమ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఒకప్పటి నటులు అతడి నటనకు ముచ్చటపడిపోయి ఆకాశానికెత్తేయడం ఎన్నోసార్లు చూశాం. దక్షిణాదిన వేరే భాషలకు చెందిన సీనియర్లు సైతం తారక్ను ప్రశంసల్లో ముంచెత్తిన సందర్భాలు బోలెడు. తమిళ సీనియర్ నటి ఖుష్బు ఎన్టీఆర్ పేరెత్తితే చాలు.. తెగ పొగిడేస్తుంది. ఇప్పుడు మరో సీనియర్ నటి అర్చన సైతం ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయింది.
80ల్లో ‘నిరీక్షణ’ సహా పలు సినిమాలతో తనదైన ముద్ర వేసిన అర్చన.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. ఆలీ నిర్వహించే ఒక టీవీ షోలో పాల్గొని అప్పటి, ఇప్పటి ముచ్చట్లు చెప్పింది. ఈ సందర్భంగా ఇప్పటి తెలుగు సినిమాల గురించి అడిగితే.. మహానటి, జనతా గ్యారేజ్ గురించి ఆమె మాట్లాడింది.
‘మహానటి’ సినిమా తనకు చాలా నచ్చిందని, అందులో కీర్తి సురేష్ చాలా బాగా నటించిందని చెప్పిన అర్చన.. అలాగే ‘జనతా గ్యారేజ్’ కూడా తనను మెప్పించిందని ఆమె వెల్లడించింది. ఇక ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుతూ.. జనతా గ్యారేజ్లో అతడి పెర్ఫామెన్స్ అదిరిపోయిందని చెప్పింది. మోహన్ లాల్ లాంటి లెజెండరీ నటుడు ఉండగా ఆయన ముందు పెర్ఫామ్ చేయడం చిన్న విషయం కాదని అర్చన అంది.
మోహన్ లాల్కు ఇవ్వాల్సిన స్పేస్ ఇస్తూ.. తన స్పేస్ తాను తీసుకుని తారక్ అద్భుత అభినయాన్ని ప్రదర్శించాడని.. లాల్ను మ్యాచ్ చేస్తూ నటించాడని అర్చన చెప్పింది. జనతా గ్యారేజ్ సినిమా కూడా తనకు వేరే లెవెల్లో అనిపించిందని ఆమె అంది. అర్చన సినిమాల నుంచి విరామం తీసుకున్నాక 25 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ ఇదే కావడం విశేషం. ఆమె తారక్ను ఇలా పొగడ్డం అతడి అభిమానులకు అమితానందాన్నిచ్చేదే.
This post was last modified on November 18, 2020 1:36 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…