ఈ తరంలో తెలుగులో ఉత్తమ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఒకప్పటి నటులు అతడి నటనకు ముచ్చటపడిపోయి ఆకాశానికెత్తేయడం ఎన్నోసార్లు చూశాం. దక్షిణాదిన వేరే భాషలకు చెందిన సీనియర్లు సైతం తారక్ను ప్రశంసల్లో ముంచెత్తిన సందర్భాలు బోలెడు. తమిళ సీనియర్ నటి ఖుష్బు ఎన్టీఆర్ పేరెత్తితే చాలు.. తెగ పొగిడేస్తుంది. ఇప్పుడు మరో సీనియర్ నటి అర్చన సైతం ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయింది.
80ల్లో ‘నిరీక్షణ’ సహా పలు సినిమాలతో తనదైన ముద్ర వేసిన అర్చన.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. ఆలీ నిర్వహించే ఒక టీవీ షోలో పాల్గొని అప్పటి, ఇప్పటి ముచ్చట్లు చెప్పింది. ఈ సందర్భంగా ఇప్పటి తెలుగు సినిమాల గురించి అడిగితే.. మహానటి, జనతా గ్యారేజ్ గురించి ఆమె మాట్లాడింది.
‘మహానటి’ సినిమా తనకు చాలా నచ్చిందని, అందులో కీర్తి సురేష్ చాలా బాగా నటించిందని చెప్పిన అర్చన.. అలాగే ‘జనతా గ్యారేజ్’ కూడా తనను మెప్పించిందని ఆమె వెల్లడించింది. ఇక ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుతూ.. జనతా గ్యారేజ్లో అతడి పెర్ఫామెన్స్ అదిరిపోయిందని చెప్పింది. మోహన్ లాల్ లాంటి లెజెండరీ నటుడు ఉండగా ఆయన ముందు పెర్ఫామ్ చేయడం చిన్న విషయం కాదని అర్చన అంది.
మోహన్ లాల్కు ఇవ్వాల్సిన స్పేస్ ఇస్తూ.. తన స్పేస్ తాను తీసుకుని తారక్ అద్భుత అభినయాన్ని ప్రదర్శించాడని.. లాల్ను మ్యాచ్ చేస్తూ నటించాడని అర్చన చెప్పింది. జనతా గ్యారేజ్ సినిమా కూడా తనకు వేరే లెవెల్లో అనిపించిందని ఆమె అంది. అర్చన సినిమాల నుంచి విరామం తీసుకున్నాక 25 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ ఇదే కావడం విశేషం. ఆమె తారక్ను ఇలా పొగడ్డం అతడి అభిమానులకు అమితానందాన్నిచ్చేదే.
This post was last modified on November 18, 2020 1:36 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ…