ఈ తరంలో తెలుగులో ఉత్తమ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఒకప్పటి నటులు అతడి నటనకు ముచ్చటపడిపోయి ఆకాశానికెత్తేయడం ఎన్నోసార్లు చూశాం. దక్షిణాదిన వేరే భాషలకు చెందిన సీనియర్లు సైతం తారక్ను ప్రశంసల్లో ముంచెత్తిన సందర్భాలు బోలెడు. తమిళ సీనియర్ నటి ఖుష్బు ఎన్టీఆర్ పేరెత్తితే చాలు.. తెగ పొగిడేస్తుంది. ఇప్పుడు మరో సీనియర్ నటి అర్చన సైతం ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయింది.
80ల్లో ‘నిరీక్షణ’ సహా పలు సినిమాలతో తనదైన ముద్ర వేసిన అర్చన.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. ఆలీ నిర్వహించే ఒక టీవీ షోలో పాల్గొని అప్పటి, ఇప్పటి ముచ్చట్లు చెప్పింది. ఈ సందర్భంగా ఇప్పటి తెలుగు సినిమాల గురించి అడిగితే.. మహానటి, జనతా గ్యారేజ్ గురించి ఆమె మాట్లాడింది.
‘మహానటి’ సినిమా తనకు చాలా నచ్చిందని, అందులో కీర్తి సురేష్ చాలా బాగా నటించిందని చెప్పిన అర్చన.. అలాగే ‘జనతా గ్యారేజ్’ కూడా తనను మెప్పించిందని ఆమె వెల్లడించింది. ఇక ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుతూ.. జనతా గ్యారేజ్లో అతడి పెర్ఫామెన్స్ అదిరిపోయిందని చెప్పింది. మోహన్ లాల్ లాంటి లెజెండరీ నటుడు ఉండగా ఆయన ముందు పెర్ఫామ్ చేయడం చిన్న విషయం కాదని అర్చన అంది.
మోహన్ లాల్కు ఇవ్వాల్సిన స్పేస్ ఇస్తూ.. తన స్పేస్ తాను తీసుకుని తారక్ అద్భుత అభినయాన్ని ప్రదర్శించాడని.. లాల్ను మ్యాచ్ చేస్తూ నటించాడని అర్చన చెప్పింది. జనతా గ్యారేజ్ సినిమా కూడా తనకు వేరే లెవెల్లో అనిపించిందని ఆమె అంది. అర్చన సినిమాల నుంచి విరామం తీసుకున్నాక 25 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ ఇదే కావడం విశేషం. ఆమె తారక్ను ఇలా పొగడ్డం అతడి అభిమానులకు అమితానందాన్నిచ్చేదే.
This post was last modified on November 18, 2020 1:36 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…