ఈ తరంలో తెలుగులో ఉత్తమ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఒకప్పటి నటులు అతడి నటనకు ముచ్చటపడిపోయి ఆకాశానికెత్తేయడం ఎన్నోసార్లు చూశాం. దక్షిణాదిన వేరే భాషలకు చెందిన సీనియర్లు సైతం తారక్ను ప్రశంసల్లో ముంచెత్తిన సందర్భాలు బోలెడు. తమిళ సీనియర్ నటి ఖుష్బు ఎన్టీఆర్ పేరెత్తితే చాలు.. తెగ పొగిడేస్తుంది. ఇప్పుడు మరో సీనియర్ నటి అర్చన సైతం ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయింది.
80ల్లో ‘నిరీక్షణ’ సహా పలు సినిమాలతో తనదైన ముద్ర వేసిన అర్చన.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. ఆలీ నిర్వహించే ఒక టీవీ షోలో పాల్గొని అప్పటి, ఇప్పటి ముచ్చట్లు చెప్పింది. ఈ సందర్భంగా ఇప్పటి తెలుగు సినిమాల గురించి అడిగితే.. మహానటి, జనతా గ్యారేజ్ గురించి ఆమె మాట్లాడింది.
‘మహానటి’ సినిమా తనకు చాలా నచ్చిందని, అందులో కీర్తి సురేష్ చాలా బాగా నటించిందని చెప్పిన అర్చన.. అలాగే ‘జనతా గ్యారేజ్’ కూడా తనను మెప్పించిందని ఆమె వెల్లడించింది. ఇక ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుతూ.. జనతా గ్యారేజ్లో అతడి పెర్ఫామెన్స్ అదిరిపోయిందని చెప్పింది. మోహన్ లాల్ లాంటి లెజెండరీ నటుడు ఉండగా ఆయన ముందు పెర్ఫామ్ చేయడం చిన్న విషయం కాదని అర్చన అంది.
మోహన్ లాల్కు ఇవ్వాల్సిన స్పేస్ ఇస్తూ.. తన స్పేస్ తాను తీసుకుని తారక్ అద్భుత అభినయాన్ని ప్రదర్శించాడని.. లాల్ను మ్యాచ్ చేస్తూ నటించాడని అర్చన చెప్పింది. జనతా గ్యారేజ్ సినిమా కూడా తనకు వేరే లెవెల్లో అనిపించిందని ఆమె అంది. అర్చన సినిమాల నుంచి విరామం తీసుకున్నాక 25 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ ఇదే కావడం విశేషం. ఆమె తారక్ను ఇలా పొగడ్డం అతడి అభిమానులకు అమితానందాన్నిచ్చేదే.
This post was last modified on November 18, 2020 1:36 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…