ఏ స్టార్ హీరో కూడా తాను మిగతా హీరోల కంటే తక్కువ అనుకోడు. ఒకవేళ అనుకున్నా బయటికి చెప్పడు. కానీ తాను అందరికీ భిన్నమని పవర్ పవన్ కళ్యాణ్ మరోసారి చాటి చెప్పాడు. తన సినిమాల గురించి, తన స్టార్ ఇమేజ్ గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోని పవన్.. కొన్ని సందర్భాల్లో తనను తాను తక్కువ చేసుకునే మాట్లాడతాడు. తాజాగా ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రెస్ మీట్లో కూాడా ఆయన అదే తరహాలో మాట్లాడాడు. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోల కంటే తన స్థాయి తక్కువ అని పవన్ వ్యాఖ్యానించడం విశేషం. తాను రాజకీయ నాయకుడిగా ఎక్కువ పాపులర్ కానీ.. సినిమా స్టార్గా అంత పెద్దవాడిని కాదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.
తన సినిమాలకు సంబంధించి ప్రమోషన్లలో పాల్గొనడం తక్కువ అని.. ఐతే నిర్మాత ఏఎం రత్నం కష్టం చూసి ‘హరిహర వీరమల్లు’ ప్రెస్ మీట్కు వచ్చానని పవన్ చెప్పారు. సినిమాలంటే తనకు అపారమైన గౌరవం, ఆసక్తి అని.. తన ప్రాణవాయువు సినిమానే అని పవన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.
‘‘నేను తిరిగి సినిమాలకు వెళ్లిపోయానని ప్రత్యర్థులు తిడుతున్నారు. కానీ సినిమా పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను. మాట్లాడను. ఐతే సినిమా అంటే నాకు అపారమైన గౌరవం, ఆసక్తి.. అది నాకు ప్రాణ వాయువు. స్టోరీ టెల్లింగ్ అనేది ప్రతి మనిషికీ చాలా అవసరం. ఆ అవకాశం సినిమా మనకు కల్పిస్తుంది. ఈ సినిమా తీయడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఏఎం రత్నం ఈ సినిమాను ముందకు తీసుకెళ్లారు.
నాకు రాజకీయంగా పేరుండొచ్చు. దేశవ్యాప్తంగా తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాల పరంగా చూస్తే మాత్రం చాలా మంది హీరోలతో పోలిస్తే నేను చాలా తక్కువ. మిగతా వాళ్ల సినిమాలకు అయినంత బిజినెస్ నా సినిమాలకు అవ్వదు. వాళ్లకు వచ్చినంత రెవెన్యూ నాకు రాకపోవచ్చు. నేను సినిమాల్లో పోటీ మీద ఎప్పుడూ అంత దృష్టిపెట్టలేదు. నేను సొసైటీ, రాజకీయాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాను. రత్నం గారి లాంటి నిర్మాతకు ఇబ్బందులు రాకూడదని నేను ఈ రోజు ప్రెస్ మీట్కు వచ్చాను. ఆయనకు ఏ ఇబ్బంది ఎదురైనా ఎవరి మీదా కోపం రాదు. కోప్పడొచ్చు కదా అంటే.. మౌనంగా ఉంటారు. ఆ మౌనమే నన్ను ఈ రోజు సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చేలా చేసింది’’ అని పవన్ అన్నారు.
This post was last modified on July 21, 2025 6:10 pm
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…