ఏపీ డిప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్ కున్న కమిట్ మెంట్ల వల్ల ప్రమోషన్లకు రాలేరని నిర్మాత ఏఎం రత్నం చెప్పిన సంగతి తెలిసిందే. గతంలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లతో తప్ప పవర్ స్టార్ ప్రత్యేకంగా వేరే పబ్లిసిటీలో భాగం పంచుకున్న దాఖలాలు భూతద్దం పెట్టి వెతికినా దొరకవు. కెరీర్ మొదట్లో ఏమో కానీ రాజకీయ ప్రయాణం ప్రారంభించాక కేవలం నటించడం వరకే తనను తాను పరిమితం చేసుకున్నారు. ఆఖరికి రిజల్ట్ కూడా ఏమయ్యిందో పెద్దగా పట్టించుకునే వారు కాదనేది అందరికీ తెలిసిన విషయం. అయితే హరిహర వీరమల్లు విషయంలో ఈ సెంటిమెంట్ ని పవన్ బ్రేక్ చేయబోతున్నట్టు సమాచారం.
రేపు ఉదయం హైదరాబాద్ లో నిర్వహించబోయే ప్రెస్ మీట్ లో యూనిట్ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. ఇది ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తోంది. ఎందుకంటె సాయంత్రం శిల్పకళా వేదికలో ఎలాగూ మాట్లాడతాడని తెలిసినా మీడియా అడిగే ప్రశ్నలకు ఒక చిన్న స్టేజి మీద ఇచ్చే ఆన్సర్లు డిఫరెంట్ గా ఉంటాయి. పైగా కొంత సరదాతనం కలిసి ఉంటుంది. ఎలాగూ కొందరు జర్నలిస్టులు పాలిటిక్స్, సినిమాలు రెండు అంశాలను టచ్ చేస్తారు. వాటికి పవన్ ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తిరకంగా మారింది. వీడియోలు ఎలాగూ వైరలవుతాయి.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయ్యే అవకాశాల గురించి ప్రచారం జరిగింది కానీ అలాంటిది ఏమి లేదని వీరమల్లు అఫీషియల్ హ్యాండిల్ కన్ఫమ్ చేసింది. ఒకరోజు ముందే పాసుల పంపిణి జరిగిపోయింది. సో యథావిధిగా ఈవెంట్ ఉంటుంది కాబట్టి టెన్షన్ అక్కర్లేదు. ఒకే రోజు రెండు డబుల్ ధమాకాలు అభిమానులను ఖుషి చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈవెంట్ కి వద్దే వందలాది ఫ్యాన్స్ మధ్య పవన్ ఏం మాట్లాడబోతున్నాడనే దాని మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ నెలకొంది. చూడబోతే రేపు ఉదయం నుంచి రాత్రి దాకా ఆన్ లైన్ మొత్తం వీరమల్లు నామస్మరణలో ఉండబోతోంది.
This post was last modified on July 20, 2025 8:54 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…