ఏపీ డిప్యూటీ సిఎంగా పవన్ కళ్యాణ్ కున్న కమిట్ మెంట్ల వల్ల ప్రమోషన్లకు రాలేరని నిర్మాత ఏఎం రత్నం చెప్పిన సంగతి తెలిసిందే. గతంలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లతో తప్ప పవర్ స్టార్ ప్రత్యేకంగా వేరే పబ్లిసిటీలో భాగం పంచుకున్న దాఖలాలు భూతద్దం పెట్టి వెతికినా దొరకవు. కెరీర్ మొదట్లో ఏమో కానీ రాజకీయ ప్రయాణం ప్రారంభించాక కేవలం నటించడం వరకే తనను తాను పరిమితం చేసుకున్నారు. ఆఖరికి రిజల్ట్ కూడా ఏమయ్యిందో పెద్దగా పట్టించుకునే వారు కాదనేది అందరికీ తెలిసిన విషయం. అయితే హరిహర వీరమల్లు విషయంలో ఈ సెంటిమెంట్ ని పవన్ బ్రేక్ చేయబోతున్నట్టు సమాచారం.
రేపు ఉదయం హైదరాబాద్ లో నిర్వహించబోయే ప్రెస్ మీట్ లో యూనిట్ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. ఇది ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తోంది. ఎందుకంటె సాయంత్రం శిల్పకళా వేదికలో ఎలాగూ మాట్లాడతాడని తెలిసినా మీడియా అడిగే ప్రశ్నలకు ఒక చిన్న స్టేజి మీద ఇచ్చే ఆన్సర్లు డిఫరెంట్ గా ఉంటాయి. పైగా కొంత సరదాతనం కలిసి ఉంటుంది. ఎలాగూ కొందరు జర్నలిస్టులు పాలిటిక్స్, సినిమాలు రెండు అంశాలను టచ్ చేస్తారు. వాటికి పవన్ ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తిరకంగా మారింది. వీడియోలు ఎలాగూ వైరలవుతాయి.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయ్యే అవకాశాల గురించి ప్రచారం జరిగింది కానీ అలాంటిది ఏమి లేదని వీరమల్లు అఫీషియల్ హ్యాండిల్ కన్ఫమ్ చేసింది. ఒకరోజు ముందే పాసుల పంపిణి జరిగిపోయింది. సో యథావిధిగా ఈవెంట్ ఉంటుంది కాబట్టి టెన్షన్ అక్కర్లేదు. ఒకే రోజు రెండు డబుల్ ధమాకాలు అభిమానులను ఖుషి చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈవెంట్ కి వద్దే వందలాది ఫ్యాన్స్ మధ్య పవన్ ఏం మాట్లాడబోతున్నాడనే దాని మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ నెలకొంది. చూడబోతే రేపు ఉదయం నుంచి రాత్రి దాకా ఆన్ లైన్ మొత్తం వీరమల్లు నామస్మరణలో ఉండబోతోంది.
This post was last modified on July 20, 2025 8:54 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…