పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు రెండు నెలల వ్యవధిలో విడుదల కాబోతున్నాయి. ముందుగా ఈ నెల 24న ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కానుండగా.. సెప్టెంబరు 25కు ‘ఓజీ’ ఫిక్స్ అయింది. ఈ రెండు చిత్రాల్లో దేనికి ఎక్కువ క్రేజ్ అంటే అందరూ ‘ఓజీ’ అనే చెబుతారు. పవన్ అభిమానులు ఈ సినిమా పేరు చెబితే ఊగిపోతున్నారు. ట్రేడ్ వర్గాల్లో కూడా దానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఫ్యాన్సీ రేట్లకు ఆ సినిమాను కొంటున్నారు. ‘వీరమల్లు’కు కూడా ఒకప్పుడు మంచి హైపే ఉండేది కానీ.. బాగా ఆలస్యం కావడం, దర్శకుడు మారడం, రిలీజ్ డేట్లు మారడం లాంటి కారణాలతో బజ్ తగ్గిందన్నది స్పష్టం.
ఇలా హైప్ పరంగా ఈ రెండు చిత్రాల మధ్య తేడా ఉండడం.. ‘ఓజీ’కే డిమాండ్ ఎక్కువ కనిపిస్తుండడం గురించి ఒక ఇంటర్వ్యూలో ‘హరిహర వీరమల్లు’ దర్శకుడు జ్యోతికృష్ణకు ప్రశ్న ఎదురైంది. దీనిపై అతను స్పందించాడు. ‘‘నాలుగైదేళ్ల క్రితం హరిహర వీరమల్లు మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న తొలి పీరియాడిక్ ఫిలిం కావడంతో ఇది మొదలైనపుడు దీని గురించే జనం ఎక్కువ మాట్లాడుకున్నారు. కానీ కరోనా, ఇతర కారణాల వల్ల మా సినిమా ఆలస్యమైంది. ఒక దశ దాటాక అప్డేట్లు కూడా రాలేదు. దీంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి తయారైంది. నాతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులూ ఈ సినిమా కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు.
అదే సమయంలో ‘ఓజీ’ మొదలైంది. ఆ సినిమా ప్రోమోలు అద్భుతంగా ఉన్నాయి. అదొక భిన్నమైన యాక్షన్ మూవీ. ముంబయి బ్యాక్డ్రాప్, గన్స్, గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో నడిచే సినిమా అది. దీంతో ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు రెండు నెలల వ్యవధిలో రాబోతున్నాయి. ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఎంతో సంతోషాన్నిచ్చే విషయం. ఈ రెండు సినిమాలూ బాగా ఆడతాయి’’ అని జ్యోతికృష్ణ చెప్పాడు.
ముందు ‘హరిహర వీరమల్లు’ను మొదలుపెట్టిన దర్శకుడు క్రిష్కు తాను అభిమానినని ఈ సందర్భంగా జ్యోతికృష్ణ తెలిపాడు. ఈ సినిమా బాగా ఆలస్యం కావడంతో ఒక అగ్ర దర్శకుడిని ఎక్కువ కాలం హోల్డ్ చేయడం కరెక్ట్ కాదని అనుకున్నాం. తాను వేరే ప్రాజెక్టుల్లో బిజీ అవుతున్నానని.. దీనిని పూర్తి చేయమని ఆయన చెప్పారనే.. అందుకే తాను ఈ సినిమాలో భాగం అయ్యానని.. ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమని జ్యోతికృష్ణ తెలిపాడు.
This post was last modified on July 17, 2025 10:29 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…