సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో రూపొందుతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇటీవలే ఒక పాటకు సంబంధించిన డాన్స్ రిహార్సల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విరామంలో జక్కన్న బాహుబలి ది ఎపిక్ కి సంబంధించిన పనులతో మరో ముఖ్యమైన డీల్ లో బిజీగా ఉన్నట్టు సమాచారం. అదేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మాతగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ పరంగా ఇబ్బందులు లేకపోయినా ఒక ముఖ్యమైన అడ్డంకి పట్ల సీరియస్ గా వర్క్ జరుగుతోందట.
అదేంటంటే రాజమౌళి ఎంత గొప్పగా సినిమా తీసినా ఆస్కార్ కు నామినేషన్లు వేసినప్పుడు ఫారిన్ క్యాటగిరీలోనే అప్లై చేయాల్సి వస్తోంది. దీంతో అవకాశాలు తగ్గిపోతున్నాయి. లేదంటే ఆర్ఆర్ఆర్ కు ఇంకో రెండు మూడు అవార్డులు వచ్చేవి. అలా కాకుండా ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 కనక ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో టైఅప్ చేయించి దాన్ని ముందు పెడితే అప్పుడు నేరుగా ఇంగ్లీష్ మూవీ అర్హత వస్తుంది. కాకపోతే ఆ వెర్షన్ కూడా స్ట్రెయిట్ గా షూట్ చేయాల్సి ఉంటుంది. అదేమీ ఇబ్బంది కాదు కానీ అలా కొలాబరేషన్ కోసం ఆసక్తి చూపిస్తున్న కంపెనీల స్థితిగతుల మీద ప్రస్తుతం అధ్యయనం జరుగుతున్నట్టు సమాచారం.
అందుకే ప్రస్తుతానికి ఈ అంశం మీద డిస్కషన్లు జరుగుతున్నాయని వినికిడి. షూటింగ్ కు ముందే పలు ఇంటర్నేషనల్ సంస్థలు పార్ట్ నర్ షిప్ కోసం సంప్రదింపులు జరిపినా రాజమౌళి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు దుర్గా ఆర్ట్స్ ని కనక సెకండరీ బ్యానర్ గా మార్చి మెయిన్ హౌస్ గా హాలీవుడ్ కంపెనీని పెడితే వివిధ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు ఛాన్స్ పెరుగుతుంది. ఇదంతా ఎస్ఎస్ కార్తికేయ చూసుకుంటున్నాడని తెలిసింది. 2027 విడుదలని టార్గెట్ గా పెట్టుకున్న రాజమౌళి వచ్చే సంవత్సరం వేసవిలో నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆగస్ట్ 9 మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.
This post was last modified on July 17, 2025 11:21 am
స్టేజ్ మీద నోరు జారడం.. ఆపై క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య ఫిలిం సెలబ్రిటీలకు మాములు అయిపోయింది. టాలీవుడ్ లెజెండరీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తెలంగాణలో టికెట్ల ధరలు ఎలా ఉంటాయన్నది గత…
సోషల్ మీడియాలో ఓ రెస్టారెంట్ బిల్లు హాట్ టాపిక్గా మారింది. ఇడ్లీ, వడతో పాటు గ్యాస్ ఖర్చును కూడా విడిగా…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. తన సినిమాల ఫలితాలను చూస్తే.. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదనిపిస్తుంది.…
మాస్ రాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘షాక్’ ఆ ఇద్దరికీ పెద్ద…
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…