Movie News

SSMB 29 : ఆస్కార్ కోసం ఇంటర్నేషనల్ ప్లాన్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో రూపొందుతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇటీవలే ఒక పాటకు సంబంధించిన డాన్స్ రిహార్సల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విరామంలో జక్కన్న బాహుబలి ది ఎపిక్ కి సంబంధించిన పనులతో మరో ముఖ్యమైన డీల్ లో బిజీగా ఉన్నట్టు సమాచారం. అదేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మాతగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ పరంగా ఇబ్బందులు లేకపోయినా ఒక ముఖ్యమైన అడ్డంకి పట్ల సీరియస్ గా వర్క్ జరుగుతోందట.

అదేంటంటే రాజమౌళి ఎంత గొప్పగా సినిమా తీసినా ఆస్కార్ కు నామినేషన్లు వేసినప్పుడు ఫారిన్ క్యాటగిరీలోనే అప్లై చేయాల్సి వస్తోంది. దీంతో అవకాశాలు తగ్గిపోతున్నాయి. లేదంటే ఆర్ఆర్ఆర్ కు ఇంకో రెండు మూడు అవార్డులు వచ్చేవి. అలా కాకుండా ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 కనక ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో టైఅప్ చేయించి దాన్ని ముందు పెడితే అప్పుడు నేరుగా ఇంగ్లీష్ మూవీ అర్హత వస్తుంది. కాకపోతే ఆ వెర్షన్ కూడా స్ట్రెయిట్ గా షూట్ చేయాల్సి ఉంటుంది. అదేమీ ఇబ్బంది కాదు కానీ అలా కొలాబరేషన్ కోసం ఆసక్తి చూపిస్తున్న కంపెనీల స్థితిగతుల మీద ప్రస్తుతం అధ్యయనం జరుగుతున్నట్టు సమాచారం.

అందుకే ప్రస్తుతానికి ఈ అంశం మీద డిస్కషన్లు జరుగుతున్నాయని వినికిడి. షూటింగ్ కు ముందే పలు ఇంటర్నేషనల్ సంస్థలు పార్ట్ నర్ షిప్ కోసం సంప్రదింపులు జరిపినా రాజమౌళి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు దుర్గా ఆర్ట్స్ ని కనక సెకండరీ బ్యానర్ గా మార్చి మెయిన్ హౌస్ గా హాలీవుడ్ కంపెనీని పెడితే వివిధ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు ఛాన్స్ పెరుగుతుంది. ఇదంతా ఎస్ఎస్ కార్తికేయ చూసుకుంటున్నాడని తెలిసింది. 2027 విడుదలని టార్గెట్ గా పెట్టుకున్న రాజమౌళి వచ్చే సంవత్సరం వేసవిలో నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆగస్ట్ 9 మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

This post was last modified on July 17, 2025 11:21 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ద ప్రభాస్ రిటర్న్స్… టికెట్ ధరలు నార్మల్

నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…

49 minutes ago

శ్రీలీల కోరుకున్న బ్రేక్ దొరికిందా

సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…

1 hour ago

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

3 hours ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

5 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

7 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

7 hours ago