Movie News

SSMB 29 : ఆస్కార్ కోసం ఇంటర్నేషనల్ ప్లాన్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో రూపొందుతున్న ప్యాన్ వరల్డ్ మూవీకి చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇటీవలే ఒక పాటకు సంబంధించిన డాన్స్ రిహార్సల్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ విరామంలో జక్కన్న బాహుబలి ది ఎపిక్ కి సంబంధించిన పనులతో మరో ముఖ్యమైన డీల్ లో బిజీగా ఉన్నట్టు సమాచారం. అదేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మాతగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ పరంగా ఇబ్బందులు లేకపోయినా ఒక ముఖ్యమైన అడ్డంకి పట్ల సీరియస్ గా వర్క్ జరుగుతోందట.

అదేంటంటే రాజమౌళి ఎంత గొప్పగా సినిమా తీసినా ఆస్కార్ కు నామినేషన్లు వేసినప్పుడు ఫారిన్ క్యాటగిరీలోనే అప్లై చేయాల్సి వస్తోంది. దీంతో అవకాశాలు తగ్గిపోతున్నాయి. లేదంటే ఆర్ఆర్ఆర్ కు ఇంకో రెండు మూడు అవార్డులు వచ్చేవి. అలా కాకుండా ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 కనక ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో టైఅప్ చేయించి దాన్ని ముందు పెడితే అప్పుడు నేరుగా ఇంగ్లీష్ మూవీ అర్హత వస్తుంది. కాకపోతే ఆ వెర్షన్ కూడా స్ట్రెయిట్ గా షూట్ చేయాల్సి ఉంటుంది. అదేమీ ఇబ్బంది కాదు కానీ అలా కొలాబరేషన్ కోసం ఆసక్తి చూపిస్తున్న కంపెనీల స్థితిగతుల మీద ప్రస్తుతం అధ్యయనం జరుగుతున్నట్టు సమాచారం.

అందుకే ప్రస్తుతానికి ఈ అంశం మీద డిస్కషన్లు జరుగుతున్నాయని వినికిడి. షూటింగ్ కు ముందే పలు ఇంటర్నేషనల్ సంస్థలు పార్ట్ నర్ షిప్ కోసం సంప్రదింపులు జరిపినా రాజమౌళి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు దుర్గా ఆర్ట్స్ ని కనక సెకండరీ బ్యానర్ గా మార్చి మెయిన్ హౌస్ గా హాలీవుడ్ కంపెనీని పెడితే వివిధ విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు ఛాన్స్ పెరుగుతుంది. ఇదంతా ఎస్ఎస్ కార్తికేయ చూసుకుంటున్నాడని తెలిసింది. 2027 విడుదలని టార్గెట్ గా పెట్టుకున్న రాజమౌళి వచ్చే సంవత్సరం వేసవిలో నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఆగస్ట్ 9 మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

This post was last modified on July 17, 2025 11:21 am

Share

Recent Posts

పంజా మీద ఇంత ప్రేమ దాచుకున్నారా

ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…

2 hours ago

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

3 hours ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

3 hours ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

3 hours ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

5 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

6 hours ago