డిసెంబర్ 5 విడుదల కాబోతున్న ది రాజా సాబ్ డేట్ మారొచ్చనే ప్రచారం ఒక వర్గంలో మొదలు కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయం చెందుతున్నారు. ఇప్పటికే పలు వాయిదాలకు లోనైన ఈ ప్యాన్ ఇండియా మూవీ చెప్పిన టైంకే రావాలని వాళ్ళ కోరిక. ఎవరు ఎలాంటి గాసిప్స్ మొదలుపెట్టినా రాజా సాబ్ రాకలో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ సంక్రాంతి ఆప్షన్ ఏమైనా చూస్తున్నారేమో అనే సందేహం రావొచ్చు. కానీ ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే సోలో డేట్ వదిలేసి అనవసరంగా కాంపిటీషన్ లో దిగడం వల్ల ఓపెనింగ్స్ తో పాటు వసూళ్లు ఎఫెక్టవుతాయి. ప్రభాస్ వస్తాడని అందరూ తప్పుకోలేరుగా.
ప్రాక్టికల్ గా చూస్తే డిసెంబర్ 5 బెస్ట్ డేట్. ఎందుకంటే అదే తేదీకి వచ్చిన పుష్ప 2 ది రూల్ రెండు వేల కోట్లకు దగ్గరగా వెళ్ళింది. పరిమిత మార్కెట్లతోనూ యానిమల్ డిసెంబర్ మొదటి వారంలో వచ్చి తొమ్మిది వందల కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇవి సోలోగా రావడం ఎంత పెద్ద మేలయ్యిందో డిస్ట్రిబ్యూటర్లను నిద్రలో లేపి అడిగినా చెబుతారు. ది రాజా సాబ్ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో కావాలని చూస్తోంది. ఎందుకంటే ఒకవేళ సంక్రాంతిని వెళదామనుకునా చిరంజీవి రావిపూడిల మెగా 157 బరిలోనే ఉంటుంది. డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ లను దాటుకుని సంక్రాంతికి వస్తున్నాంతో అనిల్ ఎంత పెద్ద హిట్టు కొట్టాడో చూశాం.
రవితేజ కిషోర్ తిరుమల సినిమా, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఆల్రెడీ అఫీషియల్ గా బరిలో ఉన్నాయి. అసలైనది మరొకటి ఉంది. విజయ్ జన నాయగన్ పొంగల్ కే వస్తుంది. రాజా సాబ్ కనక పండగ సీజన్ కోరుకుంటే తమిళనాడు, కేరళలో విజయ్ వల్ల ప్రభాస్ ఓపెనింగ్స్, థియేటర్ పంపకాలు ప్రభావితం చెందుతాయి. ఇది ఎంత మాత్రం సేఫ్ గేమ్ కాదు. డిసెంబర్ 5 రణ్వీర్ సింగ్ దురంధర్ ఉన్నా ఇబ్బంది లేదు. ఆ కాంపిటీషన్ ని ఫేస్ చేయొచ్చు. ఎటొచ్చి సంక్రాంతి గురించి ఆలోచిస్తేనే అవసరం లేని రిస్క్ కనిపిస్తుంది. సో డార్లింగ్ ఫ్యాన్స్ నిశ్చింతగా డిసెంబర్ 5న రాజా సాబ్ కోసం ఎదురు చూడొచ్చు.
This post was last modified on July 16, 2025 11:23 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…