నిన్నా మొన్నటిదాకా ప్రచారం జరిగినట్టు బాలీవుడ్ రామాయణ ఏదో 1500 కోట్లతో అయిపోవడం లేదట. రెండు భాగాలు కలిపి అక్షరాలా 4000 కోట్ల దాకా ఖర్చవుతుందని నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనం రేపుతోంది. యుఎస్ కరెన్సీలో చెప్పుకుంటే 500 మిలియన్ డాలర్లు అవుతుందని వివరించిన నమిత్, హాలీవుడ్ స్టాండర్డ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ విజువల్ వండర్ ఉంటుందని హామీ ఇస్తున్నారు. తాను ఎవరి డబ్బులతోనో తీయడం లేదని, ఫైనాన్షియల్ గా తన సోర్సెస్ ఖర్చు పెడుతున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా నెంబర్లు చెబుతున్నానని వివరణ ఇచ్చారు.
ఇప్పట్లో కాదు భవిష్యత్తులో చాలా కాలం పాటు ఎవరూ అందుకోలేనంత స్కేల్ లో రామాయణ ఉంటుందని చెప్పడం అంచనాలు పెంచేస్తోంది. షూటింగ్ పూర్తయినప్పటికీ కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏడాది సమయం కేటాయించుకున్న రామాయణ కోసం ఆస్కార్ అవార్డులు సాధించిన ప్రైమ్ ఫోకస్ సంస్థ పని చేయడం, దానికి నమిత్ మల్హోత్రానే సిఈఓ కావడంతో మూవీ లవర్స్ నమ్మకం అంతకంతా పెరుగుతోంది. 2026 దీపావళికి మొదటి భాగాన్ని రిలీజ్ చేసి ఆ తర్వాతి సంవత్సరం పార్ట్ 2 ని విడుదల చేయబోతున్న నమిత్ మల్హోత్రా, లైఫ్ టైం థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తానని హామీ ఇస్తున్నారు.
ఇంత బడ్జెట్ పెడుతున్నందుకు తోటి బాలీవుడ్ ప్రొడ్యూసర్ల నుంచి తన మీద కామెంట్లు వస్తాయని చెబుతున్న నమిత్ మల్హోత్రా వాటికి కంటెంట్ ద్వారానే సమాధానం ఇస్తామని చెబుతున్నారు. వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కానీ రామాయణంని హ్యాండిల్ చేయడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఆదిపురుష్ ఋజువు చేసింది. ఒకవేళ గొప్పగా చెబితే జనాలు బ్రహ్మరథం ఎలా పడతారో టీవీ సీరియల్ రామాయణం నిరూపించింది. మరి మోడరన్ రామాయణ దర్శకుడు నితేశ్ తివారి ఇంత పెద్ద బాధ్యతను ఎలా మోస్తారో చూడాలి. అందులోనూ ఇంత ఖరీదైన సినిమాను.
This post was last modified on July 14, 2025 10:21 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…