Movie News

నెవ్వర్ బిఫోర్ – రామాయణ బడ్జెట్ 4000 కోట్లు

నిన్నా మొన్నటిదాకా ప్రచారం జరిగినట్టు బాలీవుడ్ రామాయణ ఏదో 1500 కోట్లతో అయిపోవడం లేదట. రెండు భాగాలు కలిపి అక్షరాలా 4000 కోట్ల దాకా ఖర్చవుతుందని నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా ఒక పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనం రేపుతోంది. యుఎస్ కరెన్సీలో చెప్పుకుంటే 500 మిలియన్ డాలర్లు అవుతుందని వివరించిన నమిత్, హాలీవుడ్ స్టాండర్డ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ విజువల్ వండర్ ఉంటుందని హామీ ఇస్తున్నారు. తాను ఎవరి డబ్బులతోనో తీయడం లేదని, ఫైనాన్షియల్ గా తన సోర్సెస్ ఖర్చు పెడుతున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా నెంబర్లు చెబుతున్నానని వివరణ ఇచ్చారు.

ఇప్పట్లో కాదు భవిష్యత్తులో చాలా కాలం పాటు ఎవరూ అందుకోలేనంత స్కేల్ లో రామాయణ ఉంటుందని చెప్పడం అంచనాలు పెంచేస్తోంది. షూటింగ్ పూర్తయినప్పటికీ కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఏడాది సమయం కేటాయించుకున్న రామాయణ కోసం ఆస్కార్ అవార్డులు సాధించిన ప్రైమ్ ఫోకస్ సంస్థ  పని చేయడం, దానికి నమిత్ మల్హోత్రానే సిఈఓ కావడంతో మూవీ లవర్స్ నమ్మకం అంతకంతా పెరుగుతోంది. 2026 దీపావళికి మొదటి భాగాన్ని రిలీజ్ చేసి ఆ తర్వాతి సంవత్సరం పార్ట్ 2 ని విడుదల చేయబోతున్న నమిత్ మల్హోత్రా, లైఫ్ టైం థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తానని హామీ ఇస్తున్నారు.

ఇంత బడ్జెట్ పెడుతున్నందుకు తోటి బాలీవుడ్ ప్రొడ్యూసర్ల నుంచి తన మీద కామెంట్లు వస్తాయని చెబుతున్న నమిత్ మల్హోత్రా వాటికి కంటెంట్ ద్వారానే సమాధానం ఇస్తామని చెబుతున్నారు. వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కానీ రామాయణంని హ్యాండిల్ చేయడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఆదిపురుష్ ఋజువు చేసింది. ఒకవేళ గొప్పగా చెబితే జనాలు బ్రహ్మరథం ఎలా పడతారో టీవీ సీరియల్ రామాయణం నిరూపించింది. మరి మోడరన్ రామాయణ దర్శకుడు నితేశ్ తివారి ఇంత పెద్ద బాధ్యతను ఎలా మోస్తారో చూడాలి. అందులోనూ ఇంత ఖరీదైన సినిమాను.

This post was last modified on July 14, 2025 10:21 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 minute ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago