ఇటీవలే విడుదల చేసిన రజనీకాంత్ కూలిలో మౌనికా సాంగ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఒక్క తెలుగు వెర్షనే మూడు మిలియన్ల వ్యూస్ దాటేయడం చూస్తే రీచ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పూజా హెగ్డే రెడ్ కాస్ట్యూమ్ లో అంత అందంగా అదరగొడితే ఆమెకన్నా ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సౌబిన్ సాహిర్ హైలైట్ కావడం ఊహించని ట్విస్టు. నలభై రెండేళ్ల సపోర్టింగ్ నటుడు ఈ స్థాయిలో డాన్స్ చేసి అదరగొడతాడని ఎవరూ అనుకోలేదు. ఇది చూసిన మలయాళం దర్శకులు ఇన్నేళ్లు సౌబిన్ లోని ఈ కోణాన్ని వాడుకోనందుకు తెగ ఫీలవుతున్నారట. అయితే చెప్పుకోవాల్సిన అసలు ట్విస్టు మరొకటి ఉంది.
ఈ మౌనికాలో ప్రధానంగా కనిపించాల్సింది కింగ్ నాగార్జున. ఆయన కోసమే పూజా హెగ్డే పోర్టుకు వచ్చినప్పుడు సెలబ్రేషన్ గా ఈ ఐటెం సాంగ్ ఆడిస్తారు. అయితే దాన్ని లిరికల్ వీడియోలోనే చూపిస్తే థ్రిల్ ఉండదని భావించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎంత సీక్రెట్ గా ఉంచాలని ట్రై చేసినా లీకైపోయింది. రజనీకాంత్ ఉండకపోవచ్చని టాక్. నెగటివ్ రోల్ అయినప్పటికీ నాగ్ పాత్రకు కూలిలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. దానికి తగ్గట్టే ఒక ప్రత్యేక పాటను ఉంచారు. ఎక్స్ పెక్ట్ చేసిన దాని కన్నా చాలా పెద్ద రెస్పాన్స్ రావడం చూసి కూలి బృందం ఆనందం మాములుగా లేదట.
ఇంకో రెండు పాటలు రావాల్సి ఉందని చెన్నై టాక్. అనిరుద్ రవిచందర్ ఈ ఆల్బమ్ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. మరీ ఎక్స్ ట్రాడినరి ట్యూన్స్ గా మొదట అనిపించకపోయినా మెల్లగా ఎక్కుతున్న వైనం ట్రెండ్స్ లో కనిపిస్తోంది. ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న కూలికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బిగ్ స్క్రీన్ కన్నా ముందు పబ్లిక్ స్టేజి మీద రజని, నాగ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్లను చూడాలని తెగ ఆరాటపడుతున్నారు. అన్నట్టు ఈసారి లైవ్ షోలో సౌబిన్ సాహిర్ డాన్స్ చేస్తే అదిరిపోతుంది కదూ. ప్రస్తుతం టీమ్ మనసులో ఆ ఐడియా అయితే పుట్టిందట. చేసేలానే ఉన్నారు.
This post was last modified on July 14, 2025 4:33 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…