Movie News

ఫిష్ వెంకట్‌‌కు ట్రీట్మెంట్.. టెన్షన్ తీరింది

టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో విషమ స్థితిలో ఉన్న అతడి గురించి మీడియా ఇటీవల వెలుగులోకి తెచ్చింది. అత్యవసరంగా కిడ్నీ మార్చాల్సిన పరిస్థితి తలెత్తగా.. అందుకు సరిపడా డబ్బులు లేక కుటుంబం ఇబ్బంది పడుతున్నట్లు కథనాలు వచ్చాయి. సినీ పరిశ్రమ నుంచి ఫిష్ వెంకట్‌ను ఎవ్వరూ ఆదుకోవడం లేదంటూ మీడియా పేర్కొనగా.. ప్రభాస్ అసిస్టెంట్ తమకు కాల్ చేసి సాయానికి ముందుకు వచ్చినట్లు వెంకట్ తనయురాలు ముందు ఒక వీడియోలో చెప్పింది. కానీ తర్వాతేమో ఆ కాల్ ఫేక్ అని.. ఫోన్ చేసింది ప్రభాస్ పీఏ కాదని ఆమె స్పష్టం చేసింది.

మరోవైపు చిరంజీవి గతంలో సర్జరీ చేయడానికి ముందుకు రాగా.. ఒక స్నేహితుడిని నమ్మి వెంకట్ మోసపోయినట్లుగా ఆమె చెప్పింది. ఐతే సినీ రంగం నుంచి సాయం సంగతి పక్కన పెడితే.. ఫిష్ వెంకట్ ట్రీట్మెంట్ విషయంలో కుటుంబ సభ్యులకు బెంగ తీరిపోయినట్లే. ఆయన చికిత్స ఖర్చును భరించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది.

వెంకట్ విషయం తెలిసి స్వయంగా మంత్రి వాకిటి శ్రీహరి.. ఆసుపత్రికి వెళ్లి తనను పరామర్శించి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వెంకట్ చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ఆయన ప్రకటించారు. అంతే కాక తక్షణ ఖర్చుల కోసం ఆయన రూ.లక్ష మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. వెంకట్ హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రితో చికిత్స పొందుతున్నారు. కిడ్నీలు దెబ్బ తినడంతో ఇన్నాళ్లూ డయాలసిస్‌తో నెట్టుకొచ్చాడు వెంకట్. కానీ అవి పూర్తిగా పాడైపోవడంతో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కిడ్నీ డోనర్ల కోసం కుటుంబం ఎదురు చూస్తోంది.

 

This post was last modified on July 7, 2025 6:42 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Fish Venkat

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

4 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

11 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago