సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన కూలీ వాయిదా పడనుందనే వార్త సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతోంది. వార్ 2కి అత్యధిక స్క్రీన్లు బ్లాకయిపోవడంతో విధి లేని పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కానుందనే టాక్ బలంగా ప్రచారమవుతోంది. అయితే చెన్నై వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఇది కేవలం పుకారే. సన్ పిక్చర్స్ బిజినెస్ డీల్స్ చేస్తోందని, తమిళనాడుకి సంబంధించి థియేటర్ అగ్రిమెంట్లు ఆల్రెడీ ఊపుమీదున్నాయని, ఆరు నూరైనా వెనక్కు తగ్గే పరిస్థితి ఒక్క శాతం కూడా లేదని అంటున్నారు. సో వాయిదా న్యూసులన్నీ గ్యాసే.
యష్ రాజ్ ఫిలిమ్స్ చాలా ప్లాన్డ్ గా వార్ 2 స్క్రీన్లను లాక్ చేస్తున్న మాట వాస్తవమే. కానీ కూలీ సైతం దానికి ధీటుగా డిస్ట్రిబ్యూటర్లను ఎంచుకుంటూ తన వంతుగా మంచి రిలీజ్ వచ్చేలా చూసుకుంటోంది. ఒకవేళ కౌంట్ పరంగా హెచ్చుతగ్గులు ఏమైనా వచ్చినా టాక్ దెబ్బకు ఆటోమేటిక్ గా డిమాండ్ కు తగ్గట్టు థియేటర్లు వాటంతటవే పెరుగుతాయనే ధీమాలో కూలి నిర్మాతలున్నారు. అలాని వార్ 2ని ఎంత మాత్రం తక్కువంచనా వేయడానికి లేదు. టీజర్ కు ఆశించిన స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రాని మాట నిజమే అయినా ట్రైలర్ నుంచి లెక్క వేరుగా ఉంటుందని, క్వాలిటీ మొత్తం మారిపోయిందని ఇన్ సైడ్ టాక్.
దీని సంగతలా ఉంచితే కూలి ఫీవర్ ఓ రేంజ్ లో పెరుగుతోంది. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు ఇప్పటికే అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. తెలుగులో యాభై కోట్లను డిమాండ్ చేసే స్థాయిలో హైప్ వచ్చిందంటే ఆ క్రెడిట్ ఎక్కువ శాతం లోకేష్ కనగరాజ్ కే ఇవ్వాలి. ఆల్రెడీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు మొదలుపెట్టేశారు. జూలై నెలాఖరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ట్రైలర్ లాంచ్ ఆగస్ట్ మొదటి వారంలో ఉంటుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ రజనీకాంత్ సరసన డ్యూయెట్లు లాంటివి ఉండకపోవచ్చని వినికిడి. చూడాలి ఏమైనా సర్ప్రైజ్ ఉంటుందేమో.
This post was last modified on July 6, 2025 9:56 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…