అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కు ప్రభాస్ ఆర్థిక సహాయం చేస్తాడని, కిడ్నీ దాతలు ఎవరైనా దొరికితే తనకు ఫోన్ చేయమని చెప్పాడని అతని కుటుంబ సభ్యులు నిన్న మీడియాతో చెప్పడం చాలా దూరం వెళ్ళింది. నిజానికి ప్రభాస్ టీమ్ నుంచి కాల్ వెళ్లలేదట. ఎవరో అగంతక వ్యక్తి ప్రభాస్ అసిస్టెంట్ గా పరిచయం చేసుకుని యాభై లక్షలు అందజేస్తామని, దాతలు దొరికాక సంప్రదించమని చెప్పాడట. ఇది సోషల్ మీడియాలో వైరలయ్యింది. కొన్ని గంటల అనంతరం ఎవరైతే ఈ ఫేక్ కాల్ చేశారో సదరు వ్యక్తి నెంబర్ స్విచ్ అఫ్ వస్తోంది. అంటే ఇది పక్కా ఫేక్ కాల్ గా భావించవచ్చు.
ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడైపోయి ఆసుపత్రి బెడ్ మీద పోరాడుతున్నారు. ఇలాంటి టైంలో స్టార్ హీరోల పేరు చెప్పి కొందరు ఇలాంటి స్టంట్స్ చేయడం ఖండించాల్సిన విషయం. నిజంగా ఎవరైనా సాయం చేయాలి అనుకుంటే తమ మనుషులను వ్యక్తిగతంగా పంపించి వీడియో కాల్ లో మాట్లాడతారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళు అలాగే తమ ఫ్యాన్స్ కి ఊరట కలిగించారు. కానీ ప్రభాస్ సహాయకుడిగా ఒకడు ఫోన్ చేసి ఇలా నమ్మించడం సరికాదు. ఫిష్ వెంకట్ ఒకరికే కాదు ఇండస్ట్రీలో ఎందరో హీరోలతో చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్టుగా ఎన్నో పాత్రలు పోషించాడు.
సినీ ప్రియులు వీలైనంత త్వరగా ఫిష్ వెంకట్ కోలుకోవాలని కోరుకుంటున్నారు. గతంలో తన ఆరోగ్యం గురించి పవన్, చిరంజీవి స్పందించడం గురించి ఇటీవలే ఆయన కూతురు వివరణ ఇచ్చింది. ఇలాంటి విషయాల్లో మా అసోసియేషన్ చొరవ తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిష్ వెంకట్ అందులో సభ్యుడో కాదో కానీ టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటుడు కాబట్టి ఎంతో కొంత సాయం అందేలా చొరవ తీసుకుంటే బాగుంటుందని కొందరు నటీనటులు అంటున్నారు. ఫిష్ వెంకటే కాదు ఆవాసాన దశలో ఇలాంటి సమస్యలతో బాధ పడుతూ ఆర్థిక మద్దతు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వందల్లో ఉంటారు.
This post was last modified on July 5, 2025 4:47 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…