అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కు ప్రభాస్ ఆర్థిక సహాయం చేస్తాడని, కిడ్నీ దాతలు ఎవరైనా దొరికితే తనకు ఫోన్ చేయమని చెప్పాడని అతని కుటుంబ సభ్యులు నిన్న మీడియాతో చెప్పడం చాలా దూరం వెళ్ళింది. నిజానికి ప్రభాస్ టీమ్ నుంచి కాల్ వెళ్లలేదట. ఎవరో అగంతక వ్యక్తి ప్రభాస్ అసిస్టెంట్ గా పరిచయం చేసుకుని యాభై లక్షలు అందజేస్తామని, దాతలు దొరికాక సంప్రదించమని చెప్పాడట. ఇది సోషల్ మీడియాలో వైరలయ్యింది. కొన్ని గంటల అనంతరం ఎవరైతే ఈ ఫేక్ కాల్ చేశారో సదరు వ్యక్తి నెంబర్ స్విచ్ అఫ్ వస్తోంది. అంటే ఇది పక్కా ఫేక్ కాల్ గా భావించవచ్చు.
ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడైపోయి ఆసుపత్రి బెడ్ మీద పోరాడుతున్నారు. ఇలాంటి టైంలో స్టార్ హీరోల పేరు చెప్పి కొందరు ఇలాంటి స్టంట్స్ చేయడం ఖండించాల్సిన విషయం. నిజంగా ఎవరైనా సాయం చేయాలి అనుకుంటే తమ మనుషులను వ్యక్తిగతంగా పంపించి వీడియో కాల్ లో మాట్లాడతారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళు అలాగే తమ ఫ్యాన్స్ కి ఊరట కలిగించారు. కానీ ప్రభాస్ సహాయకుడిగా ఒకడు ఫోన్ చేసి ఇలా నమ్మించడం సరికాదు. ఫిష్ వెంకట్ ఒకరికే కాదు ఇండస్ట్రీలో ఎందరో హీరోలతో చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్టుగా ఎన్నో పాత్రలు పోషించాడు.
సినీ ప్రియులు వీలైనంత త్వరగా ఫిష్ వెంకట్ కోలుకోవాలని కోరుకుంటున్నారు. గతంలో తన ఆరోగ్యం గురించి పవన్, చిరంజీవి స్పందించడం గురించి ఇటీవలే ఆయన కూతురు వివరణ ఇచ్చింది. ఇలాంటి విషయాల్లో మా అసోసియేషన్ చొరవ తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిష్ వెంకట్ అందులో సభ్యుడో కాదో కానీ టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటుడు కాబట్టి ఎంతో కొంత సాయం అందేలా చొరవ తీసుకుంటే బాగుంటుందని కొందరు నటీనటులు అంటున్నారు. ఫిష్ వెంకటే కాదు ఆవాసాన దశలో ఇలాంటి సమస్యలతో బాధ పడుతూ ఆర్థిక మద్దతు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వందల్లో ఉంటారు.
This post was last modified on July 5, 2025 4:47 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…