అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కు ప్రభాస్ ఆర్థిక సహాయం చేస్తాడని, కిడ్నీ దాతలు ఎవరైనా దొరికితే తనకు ఫోన్ చేయమని చెప్పాడని అతని కుటుంబ సభ్యులు నిన్న మీడియాతో చెప్పడం చాలా దూరం వెళ్ళింది. నిజానికి ప్రభాస్ టీమ్ నుంచి కాల్ వెళ్లలేదట. ఎవరో అగంతక వ్యక్తి ప్రభాస్ అసిస్టెంట్ గా పరిచయం చేసుకుని యాభై లక్షలు అందజేస్తామని, దాతలు దొరికాక సంప్రదించమని చెప్పాడట. ఇది సోషల్ మీడియాలో వైరలయ్యింది. కొన్ని గంటల అనంతరం ఎవరైతే ఈ ఫేక్ కాల్ చేశారో సదరు వ్యక్తి నెంబర్ స్విచ్ అఫ్ వస్తోంది. అంటే ఇది పక్కా ఫేక్ కాల్ గా భావించవచ్చు.
ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడైపోయి ఆసుపత్రి బెడ్ మీద పోరాడుతున్నారు. ఇలాంటి టైంలో స్టార్ హీరోల పేరు చెప్పి కొందరు ఇలాంటి స్టంట్స్ చేయడం ఖండించాల్సిన విషయం. నిజంగా ఎవరైనా సాయం చేయాలి అనుకుంటే తమ మనుషులను వ్యక్తిగతంగా పంపించి వీడియో కాల్ లో మాట్లాడతారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళు అలాగే తమ ఫ్యాన్స్ కి ఊరట కలిగించారు. కానీ ప్రభాస్ సహాయకుడిగా ఒకడు ఫోన్ చేసి ఇలా నమ్మించడం సరికాదు. ఫిష్ వెంకట్ ఒకరికే కాదు ఇండస్ట్రీలో ఎందరో హీరోలతో చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్టుగా ఎన్నో పాత్రలు పోషించాడు.
సినీ ప్రియులు వీలైనంత త్వరగా ఫిష్ వెంకట్ కోలుకోవాలని కోరుకుంటున్నారు. గతంలో తన ఆరోగ్యం గురించి పవన్, చిరంజీవి స్పందించడం గురించి ఇటీవలే ఆయన కూతురు వివరణ ఇచ్చింది. ఇలాంటి విషయాల్లో మా అసోసియేషన్ చొరవ తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిష్ వెంకట్ అందులో సభ్యుడో కాదో కానీ టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటుడు కాబట్టి ఎంతో కొంత సాయం అందేలా చొరవ తీసుకుంటే బాగుంటుందని కొందరు నటీనటులు అంటున్నారు. ఫిష్ వెంకటే కాదు ఆవాసాన దశలో ఇలాంటి సమస్యలతో బాధ పడుతూ ఆర్థిక మద్దతు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వందల్లో ఉంటారు.
This post was last modified on July 5, 2025 4:47 pm
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…