అనుమానపడినట్టే నిన్న సోమవారం పరీక్షలో కన్నప్ప తడబడ్డాడు. వీక్ డేస్ లో నెమ్మదించడం ప్రతి సినిమాకు సహజమే అయినా మంచు విష్ణుకి డ్రాప్ శాతం ఎక్కువ ఉందనేది బుకింగ్స్ లో తేటతెల్లమవుతోంది. బిసిలోనే కాదు ఏ సెంటర్స్ లోనూ వసూళ్లు తగ్గాయని ట్రేడ్ నుంచి వస్తున్న రిపోర్ట్. ఇప్పటిదాకా బుక్ మై షోలో అయిదు లక్షల టికెట్లు అమ్మిన కన్నప్ప ఇకపై దూకుడు కొనసాగించడం మీద అనుమానాలు లేకపోలేదు. ఏపీలో పలు కేంద్రాల్లో పది రోజులకు తీసుకున్న యాభై రూపాయల టికెట్ రేట్ పెంపు కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోందని ఎగ్జిబిటర్స్ టాక్. త్వరగా సాధారణ స్థితికి తేవాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా కన్నప్ప మళ్ళీ పికప్ కావాలంటే వీకెండ్ దాకా ఎదురు చూడాలి. అయితే ఇక్కడ కొన్ని చిక్కులున్నాయి. శుక్రవారం నితిన్ తమ్ముడు, సిద్దార్థ్ 3 బిహెచ్కె లు మంచి అంచనాలతో థియేటర్లలో అడుగు పెడుతున్నాయి. హాలీవుడ్ మూవీ జురాసిక్ వరల్డ్ రీ బర్త్ సైతం క్లాస్ ఆడియన్స్ ని లాగుతుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప అనూహ్యంగా పుంజుకోవడం అనేది కొత్త రిలీజుల ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రభాస్ పాత్ర ఓపెనింగ్స్ తెచ్చినప్పటికీ లాంగ్ రన్ కు అవసరమైన యునానిమస్ టాక్ తెచ్చుకోవడంలో కన్నప్ప వర్కౌట్ చేయలేకపోయాడు. మిశ్రమ స్పందన వచ్చిన వైనం కళ్ళముందు కనిపిస్తోంది.
ఒకవేళ ప్రమోషన్లు ఏమైనా ఫ్రెష్ గా ప్లాన్ చేస్తారేమో చూడాలి. పైరసీ తెచ్చిన ముప్పుని కూడా కొట్టిపారేయలేం. విష్ణు అధికారికంగా 30 వేల లింకులు తీయించామని చెప్పాడు. ఇంకా దొరకనివి ఇంకెన్ని వేలు ఉంటాయో చెప్పలేం. ఈ నేపథ్యంలో కన్నప్ప బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది పెద్ద ప్రశ్న. మంచు ఫ్యామిలీ ఓన్ రిలీజ్ కాబట్టి థియేటర్ బిజినెస్ ఎంత టార్గెట్ చేశారనేది బయటికి చెప్పడం లేదు. మైత్రి తదితర సంస్థలు అండదండలు అందించినప్పటికీ జనాన్ని పుష్ చేయాల్సింది కంటెంటే. మొన్నామధ్య సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తామని శివబాలాజీ అన్నాడు. అది జరిగితే పరిస్థితి కొంత మెరుగు పడొచ్చు.
This post was last modified on July 1, 2025 3:13 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…