మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టు.. రెండు రోజుల కిందటే థియేటర్లలో దిగింది. మేకర్స్ చెప్పిన ప్రకారం దీని బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే. సినిమాకు ఆశించిన బిజినెస్ ఆఫర్లు రాకపోవడంతో చాలా ఏరియాల్లో కమిషన్ బేసిస్లో మంచు విష్ణునే స్వయంగా సినిమాను రిలీజ్ చేశాడు. ఈ చిత్రానికి రిలీజ్కు ముందు ఓటీటీ డీల్ కూడా కుదుర్చుకోలేదు విష్ణు. విడుదల తర్వాత సినిమా అదరగొడుతుందని.. తాను కోరుకున్న రేట్ వస్తుందని అతను ఆశించాడు.
ఈ నేపథ్యంలో ‘కన్నప్ఫ’ ఏమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఐతే చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడం, పెద్ద స్కేల్లో రూపొందించడం.. అన్నింటికీ మించి ప్రభాస్ సహా కొందరు పేరున్న నటీనటులు కీలక పాత్రలు పోషించడంతో తొలి రోజు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్స్తో సినిమా రన్ అయింది. డే-1 దగ్గర దగ్గర రూ.20 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టి మంచు విష్ణు అండ్ కోలో ఆనందాన్ని నింపింది ‘కన్నప్ప’.
ఐతే సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో రెండో రోజు ‘కన్నప్ప’ ఏమాత్రం నిలబడుతుందో అని సందేహించారు ట్రేడ్ పండిట్లు. కానీ ‘కన్నప్ప’ వసూళ్లలో పెద్ద డ్రాప్ ఏమీ లేదు. రెండో రోజు కూడా తొలి రోజుకు దీటుగా వసూళ్లు వచ్చాయి. శనివారం కూడా రూ.20 కోట్లకు దగ్గరగా గ్రాస్ వచ్చినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు నిలకడగా ఉండగా.. తొలి రోజు హిందీలో నామమాత్రపు కలెక్షన్లు తెచ్చిన ఈ సినిమా రెండో రోజు పుంజుకుంది.
అక్కడ సౌత్ నుంచి వచ్చే పాన్ఇండియా సినిమాలకు నెమ్మదిగానే వసూళ్లు పుంజుకుంటాయి. బాహుబలి, పుష్ప సహా చాలా చిత్రాలకు ఇదే జరిగింది. ‘కన్నప్ప’ హిందీ వెర్షన్కు తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు 40 శాతం మేర వసూళ్లు పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళం, మలయాళంలో మాత్రం ‘కన్నప్ప’కు ఆశించిన స్పందన లేదు. ఐతే తెలుగు, హిందీలో బాగా ఆడితే విష్ణు అండ్ టీం పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లే. ఆదివారం ఈ సినిమాకు తొలి రెండు రోజులకు మించి వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు.
This post was last modified on June 29, 2025 3:47 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…