Movie News

ప్రమోషన్లు చేసే ‘మార్గం’ ఇది కాదు

నిన్న కన్నప్పతో పాటు విజయ్ ఆంటోనీ మార్గన్ విడుదలయ్యింది, ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్త డిస్ట్రిబ్యూషన్ కాబట్టి చెప్పుకోదగ్గ థియేటర్లు దొరికాయి. ఉదయం ఆటకు పెద్దగా జనాలు కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మెల్లగా మొదలైన టాక్ సాయంత్రం షోల నుంచి ప్రేక్షకులు కొంత పెరిగేలా చేసింది. కథ పరంగా రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ దర్శకుడు లియో జాన్ పాల్ ట్రీట్ మెంట్ ఈ జానర్ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్విస్టులు, స్క్రీన్ ప్లే, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ వగైరా అంశాలు నిరాశ పరచకుండా కాపాడాయి. గత కొన్నేళ్లలో బిచ్చగాడు హీరోకి ఇదే డీసెంట్ మూవీ.

ఇదంతా బాగానే ఉంది కానీ మార్గన్ కు ప్రమోషన్లు చేయకపోవడం శాపంగా మారుతోంది. తమిళ వెర్షన్ వరకు విజయ్ ఆంటోనీ స్వయంగా చూసుకుంటూ అక్కడి మీడియా, అభిమానులను కలుస్తూ టాక్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ తెలుగులో ఆ సపోర్ట్ కొరవడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి చేశారు కానీ అది జనాల దృష్టికి వెళ్లకుండానే అయిపోయింది. స్ట్రెయిట్ అయినా, డబ్బింగ్ అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పబ్లిసిటీ చాలా ముఖ్యంగా. ప్రభాస్ లాంటి కటవుట్ ఉన్నా సరే కన్నప్ప కోసం మంచు విష్ణు ఎంత కష్టపడింది కష్టపడుతోంది ఇంకా చూస్తూనే ఉన్నాం. ట్రెండ్ కు తగ్గట్టు ఈ స్పీడ్ కావాల్సిందే.

మరీ ఇంత రేంజ్ లో కాకపోయినా మార్గన్ ని ఓ మోస్తరుగా అయినా ప్రమోట్ చేస్తే తెలుగు ఆడియన్స్ ఆదరించే అవకాశాలు లేకపోలేదు. యావరేజ్ కు కొంచెం పైన ఉన్నా ఆదరణ దక్కుతున్న టాలీవుడ్ లో మార్గన్ అదే కోవలోకి వస్తుంది. బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీకి ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. బిచ్చగాడు 2 కొంత పర్వాలేదనిపించుకుంది. మిగిలినవన్నీ దారుణంగా పోయాయి. చివరి మూడు సినిమాలు మరీ అన్యాయం. విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాదు మార్గన్ కు స్వయంగా సంగీతం కూడా సమకూర్చాడు. ఇప్పుడొచ్చిన టాక్ కొంచెం స్టాండ్ అయితే నిర్మాతకు లాభాలొస్తాయి.

This post was last modified on June 29, 2025 11:17 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

43 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

46 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago