ఇప్పుడు మణిరత్నం ఫామ్ కోల్పోయి ఉండొచ్చు కానీ.. ఒకప్పుడు ఆయన మామూలు సినిమాలు గా తీయలేదు. నాయగన్, రోజా, బొంబాయి, ఇద్దరు, సఖి, యువ.. ఇలా కల్ట్ ఫిలిమ్స్ అందించారాయన. దేశంలో ఎంతోమంది ఫిలిం మేకర్లకు ఆయన ఇన్స్పిరేషన్. అయితే తనకు మాత్రం మణిరత్నం సినిమాలు నచ్చవని అంటున్నాడు ఆయన సమకాలీన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మణిరత్నం కల్ట్ మూవీస్ చేసిన టైంలోనే వర్మ కూడా శివ, రంగీలా, సత్య, కంపెనీ లాంటి మైల్ స్టోన్ మూవీస్ తీశారు. అయితే వ్యక్తిగా తనకు మణిరత్నం నచ్చినా… దర్శకుడిగా మాత్రం ఇష్టపడనని ఓ ఇంటర్వ్యూలో వర్మ తెలిపాడు.
మణిరత్నం సినిమాల్లో ఆల్ టైం గ్రేట్ మూవీ అయిన నాయగన్ కూడా తనకు నచ్చలేదని వర్మ చెప్పడం విశేషం. అందులో కమల్ పెర్ఫామెన్స్ తనకు ఎంతో ఇష్టమని.. అందుకు ఆయన పోషించిన వరదరాజన్ ముదలియార్ పాత్ర కూడా ఒక కారణం కావచ్చని వర్మ పేర్కొన్నాడు. అంతే తప్ప మణిరత్నం దర్శకత్వాన్ని తాను ఇష్టపడలేదని వర్మ తెలిపాడు. నాయగన్ మాత్రమే కాదు.. మణిరత్నం తీసిన మిగతా చిత్రాలు కూడా తనకు నచ్చలేదని వర్మ స్పష్టం చేశాడు. అంతే కాక మణిరత్నంకు కూడా తన సినిమాలు నచ్చేవి కావని వర్మ తెలిపాడు.
ఇక కోలీవుడ్ నుంచి తనను బాగా ఇన్స్పైర్ చేసిన దర్శకుడిగా బాలచందర్ పేరు చెప్పాడు వర్మ. స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్ విషయంలో బాలచందర్ నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందినట్లు వర్మ తెలిపాడు. విశేషం ఏంటంటే.. తమ ప్రైమ్ టైంలో వర్మ, మణిరత్నం ఇద్దరూ కలిసి పని చేశారు. వర్మ డైరెక్ట్ చేసిన గాయం చిత్రానికి మణిరత్నం రచనా సహకారం అందించారు. అలాగే మణిరత్నం తీసిన దొంగా దొంగా సినిమాకు వర్మ రచయితగా పని చేశారు. కానీ పేరుకు కలిసి పని చేశాం కానీ.. తామిద్దరం ఒకరి మాట ఒకరు వినలేదని.. ఎవరి శైలిలోనే వాళ్లు సినిమాలు తీశామని వర్మ తెలిపాడు. తమ ఇద్దరిలోనూ ఎవరికి వారికి సొంత శైలి ఉందని.. ఆ శైలిలోనే సినిమాలు తీశామని.. ఒకరి ప్రభావం ఒకరి మీద పడలేదని వర్మ తెలిపాడు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…