ఇంకొక్క ఇరవై నాలుగు గంటల కన్నా తక్కువ సమయంలోనే కన్నప్ప షోలు ప్రారంభం కాబోతున్నాయి. రెండు రోజుల ముందే బుక్ మై షో ట్రెండింగ్ లోకి రావడం అభిమానులు శుభ సూచకంగా భావిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ప్రభాసేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపెనింగ్స్ కోసం ట్రంప్ కార్డుగా డార్లింగ్ ని వాడుతున్నప్పటికీ అసలు సినిమాలో ఉన్న ఇతర అంశాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయని టీమ్ చెబుతోంది. ఎందుకంటే ప్రభాస్ అరగంట కనిపించినా మిగిలిన రెండున్నర గంటలు బరువును మోయాల్సింది విష్ణునే. అందులోనూ ఇంటర్వల్ తర్వాతే రుద్ర వస్తాడని మొన్న బివిఎస్ రవి స్టేజి మీదే చెప్పేశారు.
ఇది విష్ణుకి అగ్ని పరీక్ష అనడానికి కారణాలున్నాయి. ఇప్పటిదాకా లక్ష్మి ప్రసన్న బ్యానర్ లో ఏ సినిమాకు పెట్టనంత బడ్జెట్ దీనికి ఖర్చు పెట్టారు. సుదీర్ఘ అనుభవమున్న మోహన్ బాబు కంటెంట్ మీద నమ్మకంతో కొడుకు సాహసానికి ఎస్ చెప్పేశారు. అంత పెద్ద క్యాస్టింగ్ ని తీసుకెళ్లి న్యూజిలాండ్ లో షూటింగ్ చేసుకొచ్చారు. ఆఫ్ లైన్ టాక్ లో రెండు వందల కోట్ల బడ్జెట్ అయ్యిందనే టాక్ ఉంది కానీ అది ఎంత వరకు నిజమనేది విష్ణుకి మాత్రమే తెలుసు. మహాభారతం లాంటి ఎపిక్ ని హ్యాండిల్ చేసిన అనుభవమున్న ముఖేష్ కుమార్ సింగ్ ని దర్శకుడిగా ఎంచుకోవడం ద్వారా విష్ణు వేసిన ఎత్తుగడ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
గత వారం కుబేరతో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. మరీ పుష్ప 2 రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టడం లేదు కానీ దాని మీదున్న అంచనాలు మించి రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే వంద కోట్ల గ్రాస్ దాటేయడం ట్రేడ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. కన్నప్ప కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కనీసం రెండు వారాల పాటు స్ట్రాంగ్ గా ఉండటం ఖాయం. విష్ణు నటన, మోహన్ లాల్ – అక్షయ్ కుమార్ – మోహన్ బాబు లాంటి సీనియర్ల పాత్రలు అంచనాలను పెంచడానికి దోహదపడుతున్నాయి. డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కించిన విష్ణు కల ఏ రూపంలో సాకారం కానుందో రేపీపాటికి తేలనుంది. చూద్దాం.
This post was last modified on June 26, 2025 3:37 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…