ఇంకొక్క ఇరవై నాలుగు గంటల కన్నా తక్కువ సమయంలోనే కన్నప్ప షోలు ప్రారంభం కాబోతున్నాయి. రెండు రోజుల ముందే బుక్ మై షో ట్రెండింగ్ లోకి రావడం అభిమానులు శుభ సూచకంగా భావిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ప్రభాసేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపెనింగ్స్ కోసం ట్రంప్ కార్డుగా డార్లింగ్ ని వాడుతున్నప్పటికీ అసలు సినిమాలో ఉన్న ఇతర అంశాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయని టీమ్ చెబుతోంది. ఎందుకంటే ప్రభాస్ అరగంట కనిపించినా మిగిలిన రెండున్నర గంటలు బరువును మోయాల్సింది విష్ణునే. అందులోనూ ఇంటర్వల్ తర్వాతే రుద్ర వస్తాడని మొన్న బివిఎస్ రవి స్టేజి మీదే చెప్పేశారు.
ఇది విష్ణుకి అగ్ని పరీక్ష అనడానికి కారణాలున్నాయి. ఇప్పటిదాకా లక్ష్మి ప్రసన్న బ్యానర్ లో ఏ సినిమాకు పెట్టనంత బడ్జెట్ దీనికి ఖర్చు పెట్టారు. సుదీర్ఘ అనుభవమున్న మోహన్ బాబు కంటెంట్ మీద నమ్మకంతో కొడుకు సాహసానికి ఎస్ చెప్పేశారు. అంత పెద్ద క్యాస్టింగ్ ని తీసుకెళ్లి న్యూజిలాండ్ లో షూటింగ్ చేసుకొచ్చారు. ఆఫ్ లైన్ టాక్ లో రెండు వందల కోట్ల బడ్జెట్ అయ్యిందనే టాక్ ఉంది కానీ అది ఎంత వరకు నిజమనేది విష్ణుకి మాత్రమే తెలుసు. మహాభారతం లాంటి ఎపిక్ ని హ్యాండిల్ చేసిన అనుభవమున్న ముఖేష్ కుమార్ సింగ్ ని దర్శకుడిగా ఎంచుకోవడం ద్వారా విష్ణు వేసిన ఎత్తుగడ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
గత వారం కుబేరతో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. మరీ పుష్ప 2 రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టడం లేదు కానీ దాని మీదున్న అంచనాలు మించి రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే వంద కోట్ల గ్రాస్ దాటేయడం ట్రేడ్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. కన్నప్ప కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కనీసం రెండు వారాల పాటు స్ట్రాంగ్ గా ఉండటం ఖాయం. విష్ణు నటన, మోహన్ లాల్ – అక్షయ్ కుమార్ – మోహన్ బాబు లాంటి సీనియర్ల పాత్రలు అంచనాలను పెంచడానికి దోహదపడుతున్నాయి. డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కించిన విష్ణు కల ఏ రూపంలో సాకారం కానుందో రేపీపాటికి తేలనుంది. చూద్దాం.
This post was last modified on June 26, 2025 3:37 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…