కన్నప్ప విడుదలను దృష్టిలో ఉంచుకుని కన్నప్ప టీమ్ ఆన్ లైన్ ట్రోలర్స్ కు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ఇటీవలి కాలంలో ట్రోలింగ్ పేరుతో వ్యక్తిత్వ హనన పెరిగిపోయింది. విష్ణుతో పాటు మంచు కుటుంబం దీని వల్ల చాలా ఇబ్బంది పడింది. ఫ్లాపులు అందరికీ సహజమే కానీ కావాలని ఉద్దేశపూర్వవికంగా ఎగతాళి పోస్టులు, వీడియోలు పెట్టడం ఒకదశలో శృతి మించిపోయింది. విష్ణు దీన్ని పర్సనల్ గా తీసుకుని సైబర్ క్రైమ్ లో కంప్లయింట్ ఇచ్చాక వీటి తాకిడి తగ్గింది. యూట్యూబ్ లో పిచ్చి పిచ్చి థంబ్ నైల్స్ పెట్టి మిలియన్ల వ్యూస్ తెచ్చుకునే బ్యాచులు క్రమంగా తమ జోరుని తగ్గించాయి.
ఈ నేపథ్యంలో కన్నప్పని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నందున విష్ణు లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భావ ప్రకటన స్వేచ్ఛ పరిమితుల్లో తమ సినిమా మీద అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళ మీద ఎలాంటి ఆంక్షలు లేవని, కానీ కావాలని బురద జల్లే ఉద్దేశంతో క్రియేటివ్ వర్క్ మీద నెగటివిటీని తీసుకొచ్చే వాళ్ళ మీద మాత్రం చట్టపరంగా చర్యలు ఉంటాయని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున ఒక సుదీర్ఘమైన లెటర్ నోటీస్ ని మంచు విష్ణు విడుదల చేశాడు. అందులో పేర్కొన్న సెక్షన్లు, నిర్మాత కం నటుడిగా తనకు, మోహన్ బాబుకు వర్తించే హక్కుల గురించి అందులో స్పష్టంగా పేర్కొన్నాడు.
ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి పనే. సినిమా బాగుంటే జనం ఆదరిస్తారు. లేదంటే థియేటర్ కు రావడం మానేస్తారు. అంతే తప్ప మధ్యలో ఎవరో కావాలని రాళ్లు వేసినంత మాత్రాన మంచి కంటెంట్ కిల్ అయిపోదు. కాకపోతే సోషల్ మీడియా ప్రభావం కొన్నిసార్లు అనూహ్యంగా ఉంటుంది కాబట్టి వీలైనంత కట్టి చేయడం అవసరం. అలాని ప్రతిదాన్ని నియంత్రించలేం కానీ ఉన్నంతలో కొంత మేర నిలువరించినా సక్సెస్ అయినట్టే. ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కన్నప్పకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. మంచి ఓపెనింగ్ రావొచ్చని ట్రేడ్ ప్రాధమిక అంచనా.
This post was last modified on June 25, 2025 3:16 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…