Movie News

పవన్‍కి త్రివిక్రమ్‍ బ్రాండింగ్‍ అవసరమా?

ఎన్టీఆర్‍తో మలి చిత్రాన్ని ఖాయం చేసుకున్న త్రివిక్రమ్‍ అతని రాకకోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్‍ కోసమని రాసుకున్న కథకు డైలాగ్‍ వెర్షన్‍తో సహా త్రివిక్రమ్‍ లాక్‍ చేసేసాడట. ఎన్టీఆర్‍ ఎప్పుడు వస్తానని ఖచ్చితమైన సమాచారం అందిస్తే దానికి నెల రోజుల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్‍ మొదలు పెడతారట. అయితే ఈలోగా పవన్‍ కళ్యాణ్‍ చేస్తోన్న ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’ రీమేక్‍ చిత్రానికి త్రివిక్రమ్‍ మార్పులు చేసి మాటలు రాస్తాడనే ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రానికి త్రివిక్రమ్‍ బ్రాండ్‍ తోడయితే మరింత క్రేజ్‍ ఏర్పడుతుందనేది మేకర్ల అభిప్రాయం కావచ్చు. ఇంకా ఈ చిత్రంలో నటించే రెండో హీరో ఎవరనే దానిపై స్పష్టమయిన సమాచారం లేదు కానీ ముందునుంచీ అనుకుంటోన్న రానా దగ్గుబాటి పేరు ఖాయం చేస్తారని వినిపిస్తోంది. త్రివిక్రమ్‍ మాటలు రాసినంత మాత్రాన క్రేజ్‍ వచ్చేస్తుందని అనుకోవడానికి లేదు. బిజినెస్‍ పరంగా హెల్ప్ అవుతుందేమో కానీ త్రివిక్రమ్‍ గతంలో పవన్‍ సినిమాకి మాటలు రాయగా ఆ చిత్రం అట్టర్‍ఫ్లాపయింది.

‘తీన్‍మార్‍’ అనుభవం తెలుసు కనుక ఈ చిత్రానికి త్రివిక్రమ్‍ సంభాషణలు వుంటాయని వినిపిస్తోన్నా ఫాన్స్ ఎక్సయిట్‍ అవడం లేదు. పైగా అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍ సినిమా మాటల సినిమా కాదు… ఇది ఫక్తు యాక్షన్‍ సినిమా కనుక త్రివిక్రమ్‍ మాయాజాలం చూపించడానికి వీల్లేదు.

This post was last modified on November 13, 2020 8:54 am

Share

Recent Posts

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

58 minutes ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

2 hours ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

2 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

3 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

4 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

4 hours ago