Movie News

పవన్‍కి త్రివిక్రమ్‍ బ్రాండింగ్‍ అవసరమా?

ఎన్టీఆర్‍తో మలి చిత్రాన్ని ఖాయం చేసుకున్న త్రివిక్రమ్‍ అతని రాకకోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్‍ కోసమని రాసుకున్న కథకు డైలాగ్‍ వెర్షన్‍తో సహా త్రివిక్రమ్‍ లాక్‍ చేసేసాడట. ఎన్టీఆర్‍ ఎప్పుడు వస్తానని ఖచ్చితమైన సమాచారం అందిస్తే దానికి నెల రోజుల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్‍ మొదలు పెడతారట. అయితే ఈలోగా పవన్‍ కళ్యాణ్‍ చేస్తోన్న ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’ రీమేక్‍ చిత్రానికి త్రివిక్రమ్‍ మార్పులు చేసి మాటలు రాస్తాడనే ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రానికి త్రివిక్రమ్‍ బ్రాండ్‍ తోడయితే మరింత క్రేజ్‍ ఏర్పడుతుందనేది మేకర్ల అభిప్రాయం కావచ్చు. ఇంకా ఈ చిత్రంలో నటించే రెండో హీరో ఎవరనే దానిపై స్పష్టమయిన సమాచారం లేదు కానీ ముందునుంచీ అనుకుంటోన్న రానా దగ్గుబాటి పేరు ఖాయం చేస్తారని వినిపిస్తోంది. త్రివిక్రమ్‍ మాటలు రాసినంత మాత్రాన క్రేజ్‍ వచ్చేస్తుందని అనుకోవడానికి లేదు. బిజినెస్‍ పరంగా హెల్ప్ అవుతుందేమో కానీ త్రివిక్రమ్‍ గతంలో పవన్‍ సినిమాకి మాటలు రాయగా ఆ చిత్రం అట్టర్‍ఫ్లాపయింది.

‘తీన్‍మార్‍’ అనుభవం తెలుసు కనుక ఈ చిత్రానికి త్రివిక్రమ్‍ సంభాషణలు వుంటాయని వినిపిస్తోన్నా ఫాన్స్ ఎక్సయిట్‍ అవడం లేదు. పైగా అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍ సినిమా మాటల సినిమా కాదు… ఇది ఫక్తు యాక్షన్‍ సినిమా కనుక త్రివిక్రమ్‍ మాయాజాలం చూపించడానికి వీల్లేదు.

Satya

Recent Posts

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

19 minutes ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

2 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

3 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

5 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

5 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

6 hours ago