ఎన్టీఆర్తో మలి చిత్రాన్ని ఖాయం చేసుకున్న త్రివిక్రమ్ అతని రాకకోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్ కోసమని రాసుకున్న కథకు డైలాగ్ వెర్షన్తో సహా త్రివిక్రమ్ లాక్ చేసేసాడట. ఎన్టీఆర్ ఎప్పుడు వస్తానని ఖచ్చితమైన సమాచారం అందిస్తే దానికి నెల రోజుల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్ మొదలు పెడతారట. అయితే ఈలోగా పవన్ కళ్యాణ్ చేస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ చిత్రానికి త్రివిక్రమ్ మార్పులు చేసి మాటలు రాస్తాడనే ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ బ్రాండ్ తోడయితే మరింత క్రేజ్ ఏర్పడుతుందనేది మేకర్ల అభిప్రాయం కావచ్చు. ఇంకా ఈ చిత్రంలో నటించే రెండో హీరో ఎవరనే దానిపై స్పష్టమయిన సమాచారం లేదు కానీ ముందునుంచీ అనుకుంటోన్న రానా దగ్గుబాటి పేరు ఖాయం చేస్తారని వినిపిస్తోంది. త్రివిక్రమ్ మాటలు రాసినంత మాత్రాన క్రేజ్ వచ్చేస్తుందని అనుకోవడానికి లేదు. బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందేమో కానీ త్రివిక్రమ్ గతంలో పవన్ సినిమాకి మాటలు రాయగా ఆ చిత్రం అట్టర్ఫ్లాపయింది.
‘తీన్మార్’ అనుభవం తెలుసు కనుక ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు వుంటాయని వినిపిస్తోన్నా ఫాన్స్ ఎక్సయిట్ అవడం లేదు. పైగా అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా మాటల సినిమా కాదు… ఇది ఫక్తు యాక్షన్ సినిమా కనుక త్రివిక్రమ్ మాయాజాలం చూపించడానికి వీల్లేదు.
This post was last modified on November 13, 2020 8:54 am
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…