ఎన్టీఆర్తో మలి చిత్రాన్ని ఖాయం చేసుకున్న త్రివిక్రమ్ అతని రాకకోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్ కోసమని రాసుకున్న కథకు డైలాగ్ వెర్షన్తో సహా త్రివిక్రమ్ లాక్ చేసేసాడట. ఎన్టీఆర్ ఎప్పుడు వస్తానని ఖచ్చితమైన సమాచారం అందిస్తే దానికి నెల రోజుల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్ మొదలు పెడతారట. అయితే ఈలోగా పవన్ కళ్యాణ్ చేస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ చిత్రానికి త్రివిక్రమ్ మార్పులు చేసి మాటలు రాస్తాడనే ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ బ్రాండ్ తోడయితే మరింత క్రేజ్ ఏర్పడుతుందనేది మేకర్ల అభిప్రాయం కావచ్చు. ఇంకా ఈ చిత్రంలో నటించే రెండో హీరో ఎవరనే దానిపై స్పష్టమయిన సమాచారం లేదు కానీ ముందునుంచీ అనుకుంటోన్న రానా దగ్గుబాటి పేరు ఖాయం చేస్తారని వినిపిస్తోంది. త్రివిక్రమ్ మాటలు రాసినంత మాత్రాన క్రేజ్ వచ్చేస్తుందని అనుకోవడానికి లేదు. బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందేమో కానీ త్రివిక్రమ్ గతంలో పవన్ సినిమాకి మాటలు రాయగా ఆ చిత్రం అట్టర్ఫ్లాపయింది.
‘తీన్మార్’ అనుభవం తెలుసు కనుక ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు వుంటాయని వినిపిస్తోన్నా ఫాన్స్ ఎక్సయిట్ అవడం లేదు. పైగా అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా మాటల సినిమా కాదు… ఇది ఫక్తు యాక్షన్ సినిమా కనుక త్రివిక్రమ్ మాయాజాలం చూపించడానికి వీల్లేదు.
This post was last modified on November 13, 2020 8:54 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…