ఎన్టీఆర్తో మలి చిత్రాన్ని ఖాయం చేసుకున్న త్రివిక్రమ్ అతని రాకకోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్టీఆర్ కోసమని రాసుకున్న కథకు డైలాగ్ వెర్షన్తో సహా త్రివిక్రమ్ లాక్ చేసేసాడట. ఎన్టీఆర్ ఎప్పుడు వస్తానని ఖచ్చితమైన సమాచారం అందిస్తే దానికి నెల రోజుల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్ మొదలు పెడతారట. అయితే ఈలోగా పవన్ కళ్యాణ్ చేస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ చిత్రానికి త్రివిక్రమ్ మార్పులు చేసి మాటలు రాస్తాడనే ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ బ్రాండ్ తోడయితే మరింత క్రేజ్ ఏర్పడుతుందనేది మేకర్ల అభిప్రాయం కావచ్చు. ఇంకా ఈ చిత్రంలో నటించే రెండో హీరో ఎవరనే దానిపై స్పష్టమయిన సమాచారం లేదు కానీ ముందునుంచీ అనుకుంటోన్న రానా దగ్గుబాటి పేరు ఖాయం చేస్తారని వినిపిస్తోంది. త్రివిక్రమ్ మాటలు రాసినంత మాత్రాన క్రేజ్ వచ్చేస్తుందని అనుకోవడానికి లేదు. బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందేమో కానీ త్రివిక్రమ్ గతంలో పవన్ సినిమాకి మాటలు రాయగా ఆ చిత్రం అట్టర్ఫ్లాపయింది.
‘తీన్మార్’ అనుభవం తెలుసు కనుక ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు వుంటాయని వినిపిస్తోన్నా ఫాన్స్ ఎక్సయిట్ అవడం లేదు. పైగా అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా మాటల సినిమా కాదు… ఇది ఫక్తు యాక్షన్ సినిమా కనుక త్రివిక్రమ్ మాయాజాలం చూపించడానికి వీల్లేదు.
This post was last modified on November 13, 2020 8:54 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…