కన్నప్ప సినిమాలో హీరో మంచు విష్ణునే అయినా… ఈ చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో బజ్ రావడానికి కారణం ప్రభాస్ అనడంలో సందేహం లేదు. కన్నప్ప మీద ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టారన్నా అందుక్కారణం ప్రభాసే. దేశవ్యాప్తంగా ప్రభాస్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులు చూస్తారని చిత్ర బృందం ఆశిస్తోంది. మరి ప్రభాస్ ఈ సినిమాలో ఎంతసేపు కనిపిస్తాడు.. సినిమాలో తన పాత్ర ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది. అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రభాస్ చేసిన రుద్ర పాత్ర దాదాపు అరగంటసేపు ఉండొచ్చని మంచు విష్ణు ఇప్పటికే వెల్లడించాడు.
ఇప్పుడు రచయిత బీవీఎస్ రవి.. ప్రభాస్ క్యారెక్టర్ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చాడు. కన్నప్ప ప్రి రిలీజ్ ఈవెంట్లో రవి మాట్లాడుతూ.. మంచు విష్ణు, ప్రభాస్ల పాత్రల గురించి.. వీరి మధ్య వచ్చే సన్నివేశాల గురించి.. అలాగే సినిమా గురించి గొప్ప ఎలివేషన్ ఇచ్చాడు. ప్రభాస్ పాత్ర ద్వితీయార్ధంలో ( సెకండ్ హాఫ్ ) ఉంటుందని అతను వెల్లడించాడు. ఇంటర్వెల్ తర్వాత సరిగ్గా 15వ నిమిషంలో ప్రభాస్ పాత్ర సినిమాలోకి ప్రవేశిస్తుందని… అక్కడ్నుంచి సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అతను చెప్పాడు. 27 నిమిషాల పాటు ప్రభాస్, విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని.. మొత్తంగా ద్వితీయార్ధం అదిరిపోతుందని అతను చెప్పాడు.
ఓవరాల్గా కన్నప్ప సినిమా మామూలుగా ఉండదని.. ఇది చరిత్ర సృష్టించే సినిమా అవుతుందని బీవీఎస్ రవి ధీమా వ్యక్తం చేశాడు. మోహన్ బాబు పాత్ర, ఆయన నటన సైతం గొప్పగా ఉంటాయన్నాడు రవి. మంచు విష్ణు గురించి మాట్లాడుతూ.. మోహన్ బాబుకు సారీ చెప్పి, ఈ సినిమాలో అతను తండ్రిని మించిపోయాడని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు రవి. విష్ణు ఎంతో కమిట్మెంట్ ఉన్న నటుడని.. కన్నప్ప కోసం ప్రాణం పెట్టి నటించాడని.. అలాగే డబ్బింగ్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నాడని.. తెలుగులో చిన్న తప్పు కూడా లేకుండా పర్ఫెక్ట్గా డైలాగులు చెప్పాడని.. తన కష్టానికి కన్నప్ప మంచి ఫలితాన్ని అందిస్తుందని రవి పేర్కొన్నాడు. రవి ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కన్నప్ప ఫస్టాఫ్ చూశానని.. సినిమా మామూలుగా ఉండదని ఎలివేషన్ ఇచ్చాడు.
This post was last modified on June 22, 2025 8:24 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…