ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న కన్నప్ప మంచు విష్ణుకి చాలా ప్రెస్టీజియస్ మూవీ. ప్రమోషన్ల పరంగా తన శక్తివంచన లేకుండా కష్టపడిన వైనం మీడియాలో కనిపిస్తోంది. దుబాయ్ కెళ్ళి మరీ ఈవెంట్ చేయడం ఎంత కమిట్ మెంట్ ఉందో తేటతెల్లం చేస్తోంది. హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో దీన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్న విష్ణు దానికి ప్రభాస్ ని గెస్టుగా తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఎంతవరకు సఫలీకృతమవుతాడో వేడుక జరిగే రోజే తెలియనుంది. అయితే ఇప్పుడు టాపిక్ ఇది కాదు. కుబేరకొస్తున్న స్పందన కన్నప్పకు కొత్త ఉత్సహాన్ని ఇచ్చేలా ఉంది.
ఎందుకంటే గత కొన్ని వారాలుగా థియేటర్ల దగ్గర వాతావరణం చూసి బయ్యర్లు, నిర్మాతలు టెన్షన్ పడ్డారు. ప్రేక్షకులు సినిమాలు చూసే మూడ్ లో లేరని, ఇప్పట్లో మార్పు వచ్చేలా లేదని ఏవేవో విశ్లేషణలు చేసుకున్నారు. కొందరు ఏకంగా రివ్యూలే దెబ్బ కొడుతున్నాయని స్టేట్ మెంట్ ఇచ్చారు. అవన్నీ తప్పని కుబేర నిరూపించింది. రెగ్యులర్ మాస్ సినిమా కాకపోయినా జనం ఆదరిస్తున్న తీరు కళ్ళముందు కనిపిస్తోంది. ఏపీలోని ప్రధాన కేంద్రాల్లో 75 రూపాయల హైక్ ఇచ్చినా హౌస్ ఫుల్స్ పడటమే దానికి నిదర్శనం. పాజిటివ్ టాక్ వస్తే చాలు జనాలు మధ్యాన్నం షోల నుంచే పెరగడం ప్రారంభమవుతుందని ప్రూవ్ చేసింది.
జూన్ 27న కన్నప్పకు కావాల్సింది ఇలాంటి టాకే. ప్రభాస్ ఇమేజ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చినా తర్వాత లాంగ్ రన్ లో నిలబెట్టాల్సింది మాత్రం మంచు విష్ణునే. అది తెలిసే తన వంతుగా ఆడియన్స్ లోకి ఎక్కువ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెలుగు ఆడియన్స్ కి సుపరిచితుడు కాదు. తన బ్రాండ్ ఉపయోగపడదు. అందుకే దాన్ని హైలైట్ చేయకుండా వీలైనంత వరకు కన్నప్పకు మంచి డివోషనల్ మూవీగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ముందు రోజు ప్రీమియర్లు వేసే ఆలోచన లేకపోయినా రిలీజ్ రోజు త్వరగా షోలు మొదలుపెట్టే ఆలోచనైతే ఉందట.
This post was last modified on June 20, 2025 9:55 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…