మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా ప్రపంచవ్యాప్తంగా అంచనాలు రేపుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ కీలక దశకు చేరుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీలో 50 కోట్ల రూపాయలతో వేసిన వారణాసి సెట్లో ముఖ్యమైన ఎపిసోడ్ తీయడానికి రంగం సిద్ధమయ్యింది. ట్రెజర్ హంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ లో మహేష్ బాబు వేటగాడిగా కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్. మరి కాశికి వెళ్లి ఏం చేస్తాడనే ఆసక్తి కలగడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అడవికి వెళ్ళడానికి ముందు ఒక రహస్యాన్ని సంబంధించిన ట్విస్టులు వారణాసిలో జరుగుతాయని, చాలా థ్రిల్ ఇచ్చే సన్నివేశాలు ఇక్కడ షూట్ చేస్తారని అంటున్నారు.
నిజానికి ఒరిజినల్ వారణాసిలోనే చిత్రీకరణ జరపాలని తొలుత అనుకున్న రాజమౌళి తర్వాత మనసు మార్చుకున్నారు. షూట్ టైంలో వచ్చే రద్దీని నియంత్రించలేని పరిస్థితి తలెత్తడంతో పాటు అనుకున్న టైంకి అన్నీ పూర్తి చేయలేమనే భావనతో చివరికి సెట్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఇప్పటిదాకా ఇంత ఖరీదైన సెట్ ఏ సినిమాకు వేయలేదు. బాలీవుడ్ గ్రాండియర్లుగా చెప్పుకునే బాజీరావు మస్తానీ, దేవదాస్, హీరామండిలకు పాతిక కోట్ల లోపే ఖర్చయ్యిందట. అయితే అవన్నీ మొత్తం సినిమా అక్కడ షూట్ చేసినవి. కానీ ఎస్ఎస్ఎంబి 29కి వేసింది కేవలం ఒక భాగం కోసం మాత్రమే.
ఫిలిం సిటీలో ఆ సెట్ ని దగ్గరి నుంచి చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఫోటోలు గట్రా తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు కానీ దూరం నుంచి డ్రోన్ తరహాలో పిక్స్ తీసినవాళ్లు లేకపోలేదు. బాహుబలి ఎలాగైతే రామోజీ ఫిలిం సిటీలో ఒక ల్యాండ్ మార్క్ స్పాట్ గా మారిపోయిందో అదే తరహాలో ఇప్పుడీ వారణాసి కూడా నిలిచిపోతుందని అంటున్నారు. త్వరలోనే ఆఫ్రికా వెళ్ళబోతున్న ఎస్ఎస్ఎంబి 29 సభ్యుల్లో కొందరికి ఇంకా వీసాలు రావాలని, అందుకే కొంత ఆలస్యమవుతోందని, అక్కడ జరిగే సుదీర్ఘమైన షెడ్యూల్ లో ముఖ్యమైన పార్ట్ అయిపోతుందని సమాచారం. 2027 రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
This post was last modified on June 19, 2025 11:33 am
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…