మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా ప్రపంచవ్యాప్తంగా అంచనాలు రేపుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ కీలక దశకు చేరుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీలో 50 కోట్ల రూపాయలతో వేసిన వారణాసి సెట్లో ముఖ్యమైన ఎపిసోడ్ తీయడానికి రంగం సిద్ధమయ్యింది. ట్రెజర్ హంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ లో మహేష్ బాబు వేటగాడిగా కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్. మరి కాశికి వెళ్లి ఏం చేస్తాడనే ఆసక్తి కలగడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అడవికి వెళ్ళడానికి ముందు ఒక రహస్యాన్ని సంబంధించిన ట్విస్టులు వారణాసిలో జరుగుతాయని, చాలా థ్రిల్ ఇచ్చే సన్నివేశాలు ఇక్కడ షూట్ చేస్తారని అంటున్నారు.
నిజానికి ఒరిజినల్ వారణాసిలోనే చిత్రీకరణ జరపాలని తొలుత అనుకున్న రాజమౌళి తర్వాత మనసు మార్చుకున్నారు. షూట్ టైంలో వచ్చే రద్దీని నియంత్రించలేని పరిస్థితి తలెత్తడంతో పాటు అనుకున్న టైంకి అన్నీ పూర్తి చేయలేమనే భావనతో చివరికి సెట్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఇప్పటిదాకా ఇంత ఖరీదైన సెట్ ఏ సినిమాకు వేయలేదు. బాలీవుడ్ గ్రాండియర్లుగా చెప్పుకునే బాజీరావు మస్తానీ, దేవదాస్, హీరామండిలకు పాతిక కోట్ల లోపే ఖర్చయ్యిందట. అయితే అవన్నీ మొత్తం సినిమా అక్కడ షూట్ చేసినవి. కానీ ఎస్ఎస్ఎంబి 29కి వేసింది కేవలం ఒక భాగం కోసం మాత్రమే.
ఫిలిం సిటీలో ఆ సెట్ ని దగ్గరి నుంచి చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఫోటోలు గట్రా తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు కానీ దూరం నుంచి డ్రోన్ తరహాలో పిక్స్ తీసినవాళ్లు లేకపోలేదు. బాహుబలి ఎలాగైతే రామోజీ ఫిలిం సిటీలో ఒక ల్యాండ్ మార్క్ స్పాట్ గా మారిపోయిందో అదే తరహాలో ఇప్పుడీ వారణాసి కూడా నిలిచిపోతుందని అంటున్నారు. త్వరలోనే ఆఫ్రికా వెళ్ళబోతున్న ఎస్ఎస్ఎంబి 29 సభ్యుల్లో కొందరికి ఇంకా వీసాలు రావాలని, అందుకే కొంత ఆలస్యమవుతోందని, అక్కడ జరిగే సుదీర్ఘమైన షెడ్యూల్ లో ముఖ్యమైన పార్ట్ అయిపోతుందని సమాచారం. 2027 రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
This post was last modified on June 19, 2025 11:33 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…