Movie News

వారణాసిలో మహేష్ బాబు…ఏంటి కథ

మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా ప్రపంచవ్యాప్తంగా అంచనాలు రేపుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ కీలక దశకు చేరుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీలో 50 కోట్ల రూపాయలతో వేసిన వారణాసి సెట్లో ముఖ్యమైన ఎపిసోడ్ తీయడానికి రంగం సిద్ధమయ్యింది. ట్రెజర్ హంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ లో మహేష్ బాబు వేటగాడిగా కనిపిస్తాడని ఇన్ సైడ్ టాక్. మరి కాశికి వెళ్లి ఏం చేస్తాడనే ఆసక్తి కలగడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అడవికి వెళ్ళడానికి ముందు ఒక రహస్యాన్ని సంబంధించిన ట్విస్టులు వారణాసిలో జరుగుతాయని, చాలా థ్రిల్ ఇచ్చే సన్నివేశాలు ఇక్కడ షూట్ చేస్తారని అంటున్నారు.

నిజానికి ఒరిజినల్ వారణాసిలోనే చిత్రీకరణ జరపాలని తొలుత అనుకున్న రాజమౌళి తర్వాత మనసు మార్చుకున్నారు. షూట్ టైంలో వచ్చే రద్దీని నియంత్రించలేని పరిస్థితి తలెత్తడంతో పాటు అనుకున్న టైంకి అన్నీ పూర్తి చేయలేమనే భావనతో చివరికి సెట్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఇప్పటిదాకా ఇంత ఖరీదైన సెట్ ఏ సినిమాకు వేయలేదు. బాలీవుడ్ గ్రాండియర్లుగా చెప్పుకునే బాజీరావు మస్తానీ, దేవదాస్, హీరామండిలకు పాతిక కోట్ల లోపే ఖర్చయ్యిందట. అయితే అవన్నీ మొత్తం సినిమా అక్కడ షూట్ చేసినవి. కానీ ఎస్ఎస్ఎంబి 29కి వేసింది కేవలం ఒక భాగం కోసం మాత్రమే.

ఫిలిం సిటీలో  ఆ సెట్ ని దగ్గరి నుంచి చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఫోటోలు గట్రా తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు కానీ దూరం నుంచి డ్రోన్ తరహాలో పిక్స్ తీసినవాళ్లు లేకపోలేదు. బాహుబలి ఎలాగైతే రామోజీ ఫిలిం సిటీలో ఒక ల్యాండ్ మార్క్ స్పాట్ గా మారిపోయిందో అదే తరహాలో ఇప్పుడీ వారణాసి కూడా నిలిచిపోతుందని అంటున్నారు. త్వరలోనే ఆఫ్రికా వెళ్ళబోతున్న ఎస్ఎస్ఎంబి 29 సభ్యుల్లో కొందరికి ఇంకా వీసాలు రావాలని, అందుకే కొంత ఆలస్యమవుతోందని, అక్కడ జరిగే సుదీర్ఘమైన షెడ్యూల్ లో ముఖ్యమైన పార్ట్ అయిపోతుందని సమాచారం. 2027 రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

This post was last modified on June 19, 2025 11:33 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

7 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

33 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago